చీరాలలో కరణం మొదటి సెట్‌ దాఖలు | Sakshi
Sakshi News home page

చీరాలలో కరణం మొదటి సెట్‌ దాఖలు

Published Tue, Apr 23 2024 8:35 AM

మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న కరణం వెంకటేష్‌, సతీమణీ గీత - Sakshi

చీరాల: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నాలుగోరోజు సోమవారం తొమ్మిది మంది అభ్యర్థులు నానినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి జి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌ ఉదయం 11.7 నిమిషాలకు మొదటి సెట్‌ నామినేషన్‌ను ఆర్వోకు అందించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, బీఎస్పీ అభ్యర్థిగా కాటి మార్క్‌, రిఫార్మ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా తన్నీరు విజయ్‌, స్వతంత్ర అభ్యర్థిగా తేళ్ల రాంబాబు, టీడీపీ అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య, ఆయన భార్య బాలకొండమ్మ తరఫున రెండు సెట్లు, కాంగ్రెస్‌ తరఫున ఆమంచి కృష్ణమోహన్‌, పోలిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్‌ను ఆర్వోకు అందించారు.

Advertisement
Advertisement