ప్రతి పది లక్షల్లో 30,774 మందికి పరీక్షలు | Sakshi
Sakshi News home page

ప్రతి పది లక్షల్లో 30,774 మందికి పరీక్షలు

Published Mon, Jul 27 2020 3:35 AM

Corona Tests for 30774 people in every ten lakhs in AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డు నెలకొల్పింది. తొలిసారిగా ప్రతి పది లక్షల జనాభాకి సగటున 30,774 మందికి పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశ సగటు 11,746గానే ఉంది. గడిచిన 24 గంటల్లో 47,645 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 16,43,319కి చేరింది.

కొత్తగా 7,627 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఇదే సమయంలో 3,046 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 46,301కి చేరింది. తాజాగా 56 మంది మృతితో మొత్తం మరణాలు 1,041కి చేరాయి. యాక్టివ్‌ కేసలు 48,956 ఉన్నాయి. 

Advertisement
Advertisement