Sakshi News home page

భక్తి శ్రద్ధలతో సత్యసాయి ఆగమన దినోత్సవం

Published Thu, Mar 28 2024 1:00 AM

సమావేశంలో ప్రసంగిస్తున్న వక్తలు  - Sakshi

యలమంచిలి రూరల్‌ : సత్యసాయిబాబా చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని సత్యసాయి జాతీయ సేవా సమన్వయకర్త ఎస్‌.కోటేశ్వరరావు తెలిపారు. యలమంచిలి ప్రధాన రహదారి పక్కన ఓ ప్రైవేటు కల్యాణమండపంలో బుధవారం సత్యసాయిబాబా 60 ఏళ్ల ఆగమన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం భగవాన్‌ సత్యసాయిబాబా యలమంచిలి పట్టణానికి వచ్చారని, అప్పట్లో 50 వేల మంది భక్తులు హాజరయ్యారని చెప్పారు. సత్యసాయి సందేశాలు, బోధనలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, పాడేరు ప్రాంతాలకు చెందిన పలువురు సంస్థాగత పదాధికారులు, రాష్ట్ర పదాధికారులు, అఖిల భారత పదాధికారులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉదయం నగర సంకీర్తన, నారాయణసేవ నిర్వహించారు. యలమంచిలి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోడూరు వెంకటేశ్వరరావు, ఆర్‌.లక్ష్మణరావు, సి.సురేంద్ర, కె.శ్యాంప్రసాద్‌, ప్రకాశరావు, వి.కృష్ణంరాజు, రాజారావు, గ్రంధి వెంకటస్వామి, పీల్ఖాన కామేశ్వరి, చైతన్య పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement