ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు: కలెక్టర్‌

Published Tue, May 14 2024 6:35 AM | Last Updated on Tue, May 14 2024 6:35 AM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూ న్‌ చెప్పారు. జిల్లాలోని 2,358 పోలింగ్‌ స్టేషన్లలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల ఓటర్లకు తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. ది వ్యాంగుల కోసం వీల్‌చైర్లు, ప్రత్యేక క్యూలు, రవాణా సౌకర్యం కోసం వాహనాలు, సీనియర్‌ సిటిజ న్లు, విజువల్‌, లోకోమోటివ్‌ వైకల్యాలు ఉన్న వ్యక్తులు, బలహీనమైన కదలికతో బాధపడుతున్న ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్‌ సహాయకులను అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పా టు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌స్టేషన్ల వద్ద టెంట్లు, ఫ్యాన్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వైద్య బృందాలు, పా రా మెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండల్లో మహిళా ఓటర్లు తమతో పాటు పిల్లలను పోలింగ్‌ స్టేషన్లకు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత పోలింగ్‌ స్టేషన్‌కు ఓటు వేయాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement