ప్రధాన వార్తలు
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తాము గెలిస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఖతం చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు. దేశ పేదల గొంతుక, వారి గుండెచప్పుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు రాజ్యాంగంతోనే లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, మారుస్తామని అనడం ద్వారా బీజేపీ నేతలు పేద ప్రజలపైనే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్, మహాత్మాగాం«దీ, నెహ్రూ లాంటి వారు పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ రక్తం, చెమటను ధారపోశారు. ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని ఇప్పుడు బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాం«దీ, ఖర్గే, దేశ ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మాపుతామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభల్లో ఆయన మాట్లాడారు. మేం కోట్లాదిమందిని లక్షాధికారుల్ని చేస్తాం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల రిజర్వేషన్లను తొలగించేందుకే మోదీ సర్కారు పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు తొలగించాలంటున్న వారికి.. రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న వారికి మధ్య పోరు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల కోసమే అన్నీ చేశారు. దేశ ప్రజలు, రైతులు, శ్రామికుల కోసం కొద్దిగా కూడా పని చేయలేదు. మోదీ 22–25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు. బీజేపీ సర్కారు 22 మందిని కుబేరుల్ని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షలాధికారుల్ని చేస్తుంది. పేదల జాబితా తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాందీ, ఖర్గే, నేను, రేవంత్ రెడ్డి, తెలంగాణ నేతలందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారు చేస్తాం. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమ చేస్తుంది. నెలకు మరో రూ.8,500 వేస్తుంది. ఈ డబ్బులతో దేశంలోని పేద కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. విద్య, వైద్యం పొందుకోవడంతో పాటు పేదలు అనుకుంది ఏదైనా ఈ డబ్బులతో చేయగలుగుతారు. మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు నోరు విప్పని మీడియా, ఇప్పుడు మేము పేదలకు డబ్బులిస్తామంటే.. వారి అలవాట్లను చెడగొడుతున్నామని విమర్శిస్తోంది. అదానీ మనుషులూ.. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పేదల ఖాతాల్లో మేము రూ.కోట్లు వేయబోతున్నాం..’ అని రాహుల్ స్పష్టం చేశారు. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ‘దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము రైతుల కోసం జబర్దస్త్ పని చేయబోతున్నాం. మేనిఫెస్టోలో రెండు హామీలు పొందుపరిచాం. మా సర్కారు రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. వారికి చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తాం. రైతుల కష్టానికి తగిన ఫలితం లభించని రోజులు ఇక ఉండవు. పక్కాగా తొలి కొలువు మోదీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను తయారు చేశారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, అగ్నివీర్ పథకాల ద్వారా నిరుద్యోగ్యాన్ని పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిస్íÙప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసినవారందరికీ ఈ హక్కుఇవ్వబోతున్నాం. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. ఒక ఏడాది కాలం పక్కాగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. నెలకు రూ.8,500 వేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..’ అని రాహుల్ ప్రకటించారు. కులగణనతో రాజకీయాల్లో శాశ్వత మార్పు ‘నరేంద్ర మోదీ ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేశారు. మా ప్రభుత్వం పేద, బలహీన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ తరహాలో మేము దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని పేద, వెనుకబడిన, దళిత, గిరిజన, పేద ఉన్నత కులాలు, మైనారిటీలకు జనాభాలో వారి దామాషా తెలిసిపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఈ విప్లవాత్మక చట్టం అమల్లోకి వచ్చాక దేశ రాజకీయాలు శాశ్వతంగా మారిపోతాయి..’ అని ఏఐసీసీ నేత అన్నారు. రేవంత్ బృందం బాగా పనిచేశారు ‘రేవంత్, తెలంగాణ బృందం బాగా పనిచేశారు. 30 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తాం. మోదీ ఎంత డబ్బు కుబేరులకు ఇచ్చారో అంతే డబ్బును దేశ, తెలంగాణ పేదలకు ఇస్తాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. నేను తెలంగాణ ప్రజల కోసం ఢిలీల్లో సైనికుడిలా పనిచేస్తా. తెలంగాణకు ఏది అవసరమైనా ఆ పని చేసేందుకు నేను ఢిల్లీలో సిద్ధంగా ఉంటా..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, నేతలు మధుయాష్కీ, మహేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరం ఓటెత్తాలని..
జీహెచ్ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు. బంజారాహిల్స్లోని జీవీకే వన్మాల్లో ఇటీవల ఓ ఫ్లాష్మాబ్లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది. పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు 584 పోలింగ్ బూత్ల పరిధిలో అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.ఇంకా ఏం చేస్తున్నారంటే.. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్లెవెల్ అధికారులు తమ బూత్లో పోలింగ్శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు..» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు. » జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. » ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు. » ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు. » ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. » పార్కులు, బస్స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. » ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల దాకా..ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్లో సీఈఓ వికాస్రాజ్, తదితరులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ కాదు.. విఫల భారత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మోదీ.. దేశ్ కా సత్యనాశ్ చేసిండు. వికసిత భారత్ అంటూ దేశాన్ని విఫల భారత్గా చేసిండు..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గురువారం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్ అన్నారు.. సచ్చేదిన్ వచ్చింది. అంతా గ్యాస్.. ట్రాష్..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్. విదేశీ మారకాలు తగ్గినయ్.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్కుమార్ను పంపుదామా? ఆలోచించాలి.మహిళలకు రూ.2,500 సాయం ఏది?అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్ఎస్తోనే సాధ్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్రెడ్డి) కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కుపైగా లోక్సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్ఎస్కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్ మళ్లీ సీఎం అవుతారు వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా..
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అద్దంకిలో తుఫ్యాన్
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కల్పించాలి
నేడు మంగళగిరికి సీఎం వైఎస్ జగన్
డీఎంహెచ్ఓ ఆస్పత్రుల తనిఖీ
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషిచేయాలి
సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
ప్రజల నమ్మకం జగనన్న
బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా తీర్చిదిద్దుతాం
తెలంగాణ పాలిటిక్స్
వీడియోలు
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..సీఎం జగన్ ప్రయత్నం కూడా ఇదే..
కాబోయే సీఎం జగనే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
అకాల వర్షం..అపార నష్టం
హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్