ప్రధాన వార్తలు
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
సాక్షి, యాదాద్రి: ‘దేశంలో కుటుంబ పాలనకు, భార తీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్కు మధ్య జరుగుతు న్నాయి. మోదీ దేశం కోసం.. వారు కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తారు. ‘ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్.. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ అభివృద్ధి గ్యారంటీ’ మధ్య ఎన్ని కలు జరుగుతున్నాయి..’అని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని, రేవంత్రెడ్డీ చూస్కో.. ఈసారి 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ బీజేపీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగ మం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలు కాలేదన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. అబద్ధాలతో ఈ ఎన్నికలు గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ పదేళ్లుగా ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం అందిస్తోంది. మేం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించండి. దేశంలోనే నంబర్ వ¯న్గా తెలంగాణను మార్చుతాం..’అని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏబీసీలు మూడూ ఒక్కటే ‘తెలంగాణలో ఏబీసీలు (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) మూడూ ఒక్కటే. మూడూ ట్రయాంగిల్ లాంటివి. షరియత్, ఖురాన్ ప్రకారం పాలన కొనసాగించాలని చూస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలుచేస్తున్న వీరు హైదరాబాద్లో శ్రీ రామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ట్రిపుల్ తలాక్ తీసుకురావాలనుకుంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు ఆపింది. కానీ మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో రామమందిరానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ అంతం చేశారు. నక్సలైట్ సిద్ధాంతాన్ని సమాప్తం చేశారు. 370 ఆర్టీకల్ రద్దుతో కశ్మీర్ మనదే అని తేలిపోయింది. కొత్త టెక్స్టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మీకులకు ఉపాధి లభించింది. రూ.1,500 కోట్లతో ఈ విధానం అమల్లోకి తెచ్చాం. మోదీ చేనేత పాలసీ తీసుకువచ్చారు..’అని వివరించారు. నర్సయ్యగౌడ్కు ఓటు వేస్తే మోదీకి, అభివృద్ధికి వేసినట్లే అని అన్నారు. ఈ సమావేశంలో నర్సయ్యగౌడ్తో పాటు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ కాదు.. విఫల భారత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మోదీ.. దేశ్ కా సత్యనాశ్ చేసిండు. వికసిత భారత్ అంటూ దేశాన్ని విఫల భారత్గా చేసిండు..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గురువారం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్ అన్నారు.. సచ్చేదిన్ వచ్చింది. అంతా గ్యాస్.. ట్రాష్..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్. విదేశీ మారకాలు తగ్గినయ్.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్కుమార్ను పంపుదామా? ఆలోచించాలి.మహిళలకు రూ.2,500 సాయం ఏది?అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్ఎస్తోనే సాధ్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్రెడ్డి) కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కుపైగా లోక్సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్ఎస్కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్ మళ్లీ సీఎం అవుతారు వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా..
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తెలంగాణ పాలిటిక్స్
వీడియోలు
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
17 లోక్ సభ స్థానాలకు రేపే పోలింగ్..
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..సీఎం జగన్ ప్రయత్నం కూడా ఇదే..
కాబోయే సీఎం జగనే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
అకాల వర్షం..అపార నష్టం