-
Warangal: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
హసన్పర్తి: నగరంలోని వంగపహాడ్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.గది కిరాయి రోజుకు రూ.వెయ్యికాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. -
ఆశీర్వదిస్తే హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి
కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మడికొండ: నిండు మనసుతో ఆశీర్వదించండి.. వరంగల్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. శనివారం మడికొండ ఆర్ఎన్ఆర్ గార్డెన్లో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యాన వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల బూత్ కమిటీలు, మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కర్పన్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా మడికొండ గ్రామానికి ఉన్న డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ఎంపీగా గెలిచిన వెంటనే కృషి చేస్తానని అన్నారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు.. రానున్న వారం రోజులు జరిగే ప్రచారం ఒక ఎత్తు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని అన్నారు. వర్ధన్నపేటలో భూకబ్జాలు చేసిన అరూరి రమేశ్ను గెలిపిస్తే ఉన్న భూములు కూడా లాగేసుకుంటాడని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దొమ్మాటి సాంబయ్య ప్రసంగించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, శేఖర్రావు, వెంకట్రెడ్డి, మన్నె బాబురావు, బైరి కొంరయ్య, లింగమూర్తి, పైడిపాల రఘుచందర్, ఎడబోయిన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా వరంగల్ అర్బన్ : ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా ఆదేశించారు. శనివారం ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖమ్మం ప్రధాన రహదారి నాయుడు పెట్రోల్ పంపు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పనిసరిగా అమలు చేయాలని, ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే చర్యలను నిరోధించడానికి గట్టి నిఘా పెట్టాలని చెప్పారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు డబ్బు, మద్యం ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాల ని సూచించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని డీసీతండా చెక్ పోస్టును పరిశీలించారు. తనిఖీల్లో వరంగల్ జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అజిత్రెడ్డి, లైజన్ ఆఫీసర్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు. -
పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్
వరంగల్: ఏనుమాములలోని మార్కెట్ గోదాంలలో పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఏఆర్ఓ, గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం ఆమె వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి వరంగల్ (తూర్పు) నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏనుమాములలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి కమిషనింగ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ సందడి
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రధాన రాజకీయ పార్టీల్లో లోక్సభ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 2న నోటికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అదే రోజు నుంచి నల్లగొండ కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఈనెల 9న ముగియనుంది. 10న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంది. అయితే ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ రోజే లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 27న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు జరగనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన మరుసటి రోజు ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఆయా పార్టీల ఎన్నికల ఇన్చార్జ్ లు అభ్యర్థుల ఎంపిక మొదలు ఓటర్ల జాబితాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. గెలుపు ఓటముల విశ్లేషణ, ఓట్ల లెక్కల్లో నిమగ్నం కావడంతో ఎన్నికల సందడి జోరందుకుంది. అప్రమత్తంగా కాంగ్రెస్.. వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 12,806 ఓట్ల తేడాతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్నను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. బీఆర్ఎస్ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ నుంచి పలువురు ఉద్యమకారులు, సీనియర్లు ఆశించినప్పటికీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం ఇచ్చింది. రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్లో పెట్టింది. ఆ ముగ్గురిలో ఎవరు..? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ప్రధానంగా ముగ్గురు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రెండుసార్లు ఇదే స్థానాని కి పోటీ చేసి.. 2021 ఎన్నికల్లో 39,306 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రేమేందర్రెడ్డికి మూడోసారి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కాగా మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భువనగిరి జిల్లాకు చెందిన కాసం వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు నాయకులు పులి సరోత్తంరెడ్డి, డాక్టర్ ప్రకాశ్రెడ్డి సైతం ఈసారి గట్టిగా పట్టుపడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్ర పార్టీకి తాజాగా మళ్లీ దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్తినేని ధర్మారావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందో? అనేది మరో రెండు రోజుల్లో తేలుతుందని పార్టీవర్గాల సమాచారం. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలుపల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) : 1,61,811 తీన్మార్ మల్లన్న(స్వతంత్ర) : 1,49,005 ప్రొఫెసర్ కోదండరామ్(టీజేఎస్) : 71,126 గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ) : 39,306 రాములు నాయక్(కాంగ్రెస్) : 27,729 ఓ వైపు పార్లమెంట్, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా మారిన వైనం గెలుపు, ఓటముల లెక్కల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ అభ్యర్థిపై ఇంకా వీడని సస్పెన్స్ మూడో రోజు నలుగురు నామినేషన్లునల్లగొండ: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. కర్నె రవి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మరో సెట్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బైరబోతుల శ్రీనివాసరావు, దైద సోమసుందరం, బక్క జడ్సన్ నామినేషను పత్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్. మహేందర్కు అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement