-
అభివృద్ధిని చూసి ఓటేయండి
మర్కూక్(గజ్వేల్): బీఆర్ఎస్ గ్రామాల్లో చేసిస అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎంపీపీలు పాండుగౌడ్,కృష్ణ యాదవ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మంగమ్మ, బీఆర్ఎస్ బీసీసెల్ అధ్యక్షుడు కనకయ్య అన్నారు. సోమవారం మండలంలోని అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. అనంతరం ఉపాధిహమీ కూలీలవద్దకు వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు లక్ష్మి, మంజుల, ఎంపీటీసీ నరేందర్, ఉప సర్పంచ్ కొండల్రెడ్డి, సీనియర్ నాయకులు రాందాస్గౌడ్, సంతోశ్రెడ్డి పాల్గొన్నారు. -
ఆరు గ్యారెంటీలతో ఆగమయ్యాం
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీంల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ను ఇంకా నమ్మమని ప్రజలు ముక్తకంఠంగా అంటున్నారని బీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తీక వెల్లడించారు. సోమవారం ఆమె మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, కౌన్సిలర్ యాదగిరి, నాయకులు చందు, ప్రభాకర్, శ్రీను పాల్గొన్నారు. ‘కారు’కు ఓటేసి సారుకు కానుకగా ఇద్దాం మద్దూరు(హుస్నాబాద్): కాంగ్రెస్ పాలనలో విఫలమైందని బీఆర్ఎస్ దుల్మిట్ట అధ్యక్షుడు మంద యాదగిరి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొండాపూర్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశ్ను పార్లమెంట్కు పంపించి మాజీ సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్, తాగు, సాగు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ భువనగిరి లోక్సభ అభ్యర్ధి క్యామ మల్లేశంను భారీ మోజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ముమ్మర ప్రచారం సిద్దిపేటజోన్: మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. పట్టణంలోని 24 వార్డులో మున్సిపల్ చైర్మన్ మంజుల, 31 వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, 3వ వార్డులో రేణుక తిరుమాల్ రెడ్డి, 8వ వార్డులో సురేశ్, 13వ వార్డులో విఠోభ, 26వ వార్డులో ప్రవీణ్, 28వ వార్డులో మల్లికార్జున్, 40వ వార్డులో సాయి ఈశ్వర్, 41వ వార్డులో సుందర్, 42వ వార్డులో శోభారాణి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తీక -
No Headline
● చలివేంద్రం ఏర్పాటు కొమురవెల్లి(సిద్దిపేట): మండల పరిధిలోని అయినాపూర్లో మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ తల్లిదండ్రులు రాజయ్య,అనుసూర్య ల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రతలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, గోపాల్రెడ్డి, మెరుగుకృష్ణ, జయ రాములు తదితరులు పాల్గొన్నారు. ● ‘తెలంగాణ అంటేనే కేసీఆర్’ గజ్వేల్రూరల్: తెలంగాణ అంటే గుర్తొచ్చేది కేసీఆరేనని, పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్రెడ్డికి మద్దతుగా సోమవారం సింగాటంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, జెడ్పీటీసీ మల్లేశంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడుపడ్డ తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు తీవ్రమవుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణగౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి, దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● ‘కేంద్రంలో బీజేపీదే అధికారం’ తొగుట(దుబ్బాక): కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని.. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ విజ యం సాధిస్తామని పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి విభీషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమ వారం ఆయన మండల పరిధిలోని గుడికందు ల గ్రామంలో కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి రఘునంద్రావు ఎంపీగా భారీ మెజార్టీ సాధిస్తారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు పేద లను మోసం చేయడం తప్పా చేసేదేమీ లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సా ధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చార న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు. ● బాధ్యులను కఠినంగా శిక్షించండి మిరుదొడ్డి(దుబ్బాక): వాటర్ ట్యాంకర్ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడి చేయడం సరికాదని పార్టీ జిల్లా కార్యదర్శి మద్దెల రోశయ్య ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ భర్త ధర్మారం మల్లయ్య బీజేపీ నాయకుడు బయ్యారం రమేష్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పును పక్కదోవ పట్టించడానికి ఎంపీటీసీ భర్త మల్లయ్యతో అట్రాసిటీ కేసు పెట్టించారన్నారు. పోలీసులు ఎన్నికల అధికారులు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దేవరాజు, నాయకులు శ్రీనివాస్, మల్లేశం, సదానందరెడ్డి, కరుణాకర్, కనకరాజు, రమేష్, కిషన్, ఎల్లం పాల్గొన్నారు. ● కులం పేరుతో దూషించిన వారిపై కేసు మిరుదొడ్డి(దుబ్బాక): కులం పేరుతో దూషించి దాడి చేసిన బీజేపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి, సూకూరి లింగం, మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వారు మాట్లాడుతూ... బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రోడ్ షో సందర్భంగా ఎంపీటీసీ–2 ధర్మారం లక్ష్మీ భర్త మల్లయ్యపై బీజేపికి చెందిన బయ్యారం రమేష్ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడినట్లు తెలిపారు. కులం పేరుతో దూషించి దాడి చేసిన రమేష్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఉప సర్పంచ్ కనకయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు స్వామి, నాయకులు బాబు, మల్లయ్య, రాములు, వెంకట్, అంజిరెడ్డి, కుమార్, శేఖర్, నర్సింహులు, రాజయ్య పాల్గొన్నారు. ● ఇంటింటికీ బీజేపీ ప్రచారం కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని దుద్దెడలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు మద్దతుగా సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు -
‘కారు’దిగి కాంగ్రెస్లోకి..
కొండపాక(గజ్వేల్): సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి అన్నా రు. కుకునూరుపల్లి మండల పరిధిలోని కోనాయిపల్లికి చెందిన బీర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, ఉపేందర్గౌడ్, సాయిరెడ్డి, అంజిగౌడ్ తదితరులు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధు విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, రుషీ, నరేశ్, దేవానందం, రమేశ్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హస్తం గూటికి మాజీ సర్పంచ్ వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని గిర్మాపూర్ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. డీసీసీ అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సందీప్రెడ్డి, సీనియర్ నాయకులు తోట ముత్యాలు, శ్రీరాంనర్సింలు తదితరులు పాల్గొన్నారు. పాలనకు ఆకర్షితులై చేరికలు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
రైతు సమస్యలు పరిష్కరించండి
వర్గల్(గజ్వేల్): వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలసి ఎంపీపీ లత అన్నారు. సోమవారం వర్గల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. వేతవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కో రారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని వైద్యాధికారిణి డాక్టర్ హరిత తెలిపారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని ఎంఈఓ సునీత వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు బాలమల్లు యాదవ్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బాలరాజు, ఎస్ఐ శివకుమార్, విద్యుత్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు సంతోశ్కుమార్, పాష, శ్రీధర్, ఐసీడీఎస్, ఉద్యాన తదితర శాఖల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎంపీపీ లత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement