-
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం, మద్యం, గంజాయి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ము మ్మరం చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదు సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో రూ.24, 88,40,388 విలువ చేసే 4,44,639. 8652 గ్రాముల బంగారం, రూ.30,34,700 విలువ చేసే 48,900 గ్రాముల వెండి, రూ.1,50, 00,738 విలువ చేసే 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మోడల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు షురూ చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్ల్లు కళాశాల ప్రిన్సిపాల్ టేనావతి పేర్కొన్నారు. చేవెళ్లలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలపై పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ మోడల్ కళాశాలలో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవా లన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయని తెలిపారు. పదో తరగతిలో 9జీపీఏ పైగా సాధించిన అమ్మాయిలకు హాస్టల్వసతి కూడా ఉందని చెప్పారు. మార్కుల మెమో, ఆధార్కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల జిరాక్స్లతోపాటు రెండు పాస్పోర్టు ఫొటోలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు. స్ట్రాంగ్రూంను పరిశీలించిన మహబూబ్నగర్ కలెక్టర్ షాద్నగర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూంను సోమవారం మహబూబ్నగర్ కలెక్టర్ రవి నాయక్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ రిసెప్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఆర్డీఓ వెంకట మాధవరావును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పార్థసారధి, పట్టణ సీఐ ప్రతాప్లింగం ఉన్నారు. ‘పట్నం’లో స్ట్రాంగ్ రూం పరిశీలన ఇబ్రహీంపట్నం: భువనగరి లోక్సభ పరిధి లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్ట్రాంగ్రూంను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండబా సందర్శించారు. ఖానాపూర్ సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమంత్ అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి అనంతరెడ్డి ఉన్నారు. మోదీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు సనత్నగర్: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మంగళ, బుధవారాల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 7న (మంగళవారం) రాత్రి 7.50 నుంచి 8.25 మధ్య ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వై జంక్షన్, పీ అండ్ టీ ఫ్లైఓవర్ వద్ద యూ టర్న్, షాపర్స్స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ల్యాండ్స్, రాజీవ్గాంధీ విగ్రహం వద్ద లెఫ్ట్ టర్న్, మోనప్ప ఐల్యాండ్ జంక్షన్, యశోద హాస్పి టల్, ఎంఎంటీఎస్ మీదుగా రాజ్భవన్ చేరుకుంటారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 8న (బుధవారం) ఉదయం 8.35 నుంచి 9.10 గంటల మధ్య అదే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. -
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
చేవెళ్ల: దేశంలో మోదీ ప్రభంజనంతో రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీకి ఆదరణ పెరుగుతోందనిఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డపై ఈసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో బీజేపీ జోరు చూసిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. రంజిత్రెడ్డి ఐదేళ్లలో చేసిన కోళ్ల స్కాం, దాణా స్కాంలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఫిలింనగర్లో హనుమాన్ దేవాలయం కూల్చి వేసిన పాపం రంజిత్రెడ్డిని వెంటాడుతోందని, ఆయన ఈఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. అలాంటి వ్యక్తులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దేశాభివృద్ధికి మోదీలాంటి నాయకుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని కొండా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. మండలంలోని ప్రొద్దటూరు మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, కొత్తపల్లి ఎంపీటీసీ శోభ తదితరులు విశ్వేశ్వర్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్రెడ్డి, రాములు, నర్సింహారెడ్డి, సురేశ్, వాసుదేవ్కన్న తదితరులు పాల్గొన్నారు. ఈసారి చేవెళ్ల గడ్డపైకాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి -
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్ కుమార్ కటారియా కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చేవెళ్ల: లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కళాశాలలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లలో బ్యాలెట్ పేపర్, అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఈవీఎంలను అన్ని విధాలా సిద్ధం చేయాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం, ఇతర అధికారులు ఉన్నారు. కలెక్టర్ శశాంక -
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
షాద్నగర్రూరల్: చిన్నారులకు విద్యతోపాటు సంస్కారం, సామాజిక విలువలు నేర్పించాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణమధ్య ప్రాంత సేవాప్రముఖ్ బండారు రమేష్ అన్నారు. పట్టణంలోని యోగా కేంద్రంలో సోమవారం సంస్కారభారతి జాతీయ సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ షాద్నగర్శాఖ ఆధ్వర్యంలో బాలల రంగస్థల నట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బండారు రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఒక్కటే ప్రధానం కాదని, సభ్యత, సంస్కారం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, తోటి వారిని గౌరవించడం, అభిమానించడం, సహాయం చేయడంవంటి మంచి విలువలను నేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అలాంటి మంచి విలువలను నేర్పించేందుకు పాఠశాలలతో పాటు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. పిల్లలకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన సంస్కారం నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సంస్కారభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ రంగయ్య మాట్లాడుతూ.. నట శిక్షణా శిబిరంలో చిన్నారులకు నటనలో మెలకువలు, పది మందిలో ధైర్యంగా మాట్లాడగలగడం, భావ వ్యక్తీకరణ, నీతి కథలు, పద్యపఠనం, చిత్రలేఖనం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంవంటి పలు అంశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నేటి బాలల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఎంతోమంది యువకులు ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పటికీ వేదికమీద తమ భావాలను సరైన సరైన రీతిలో వ్యక్త పరచలేకపోతున్నారని, అందుకు కారణం కేవలం పుస్తకపఠనానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆట, పాటలకు ఇవ్వకపోవడమేనని అన్నారు. చిన్నారులకు మన సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ కళలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీతల ముఖచిత్రాలతో రూపొందించిన శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది కాలమానిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బెజుగం రమేష్, సింగారం శ్రీనివాస్, బాలబ్రహ్మచారి, చెట్ల వెంకటేశ్, రవీందర్, రమేష్చారి, వీరేశం, ప్రణీత తదితరులు పాల్గొన్నారు. వీహెచ్పీ దక్షిణమధ్య ప్రాంత సేవాప్రముఖ్ బండారు రమేష్ -
ప్రచార పాట్లు
ఓట్ల ఫీట్లు..షాద్నగర్: క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే.. ● రద్దీ ప్రాంతాలే ప్రచార అడ్డాలు ● ఉపాధి పని వద్దకు ఉదయపు నడక ● పొలం బాట పడుతున్న నేతలు ● కూలీలు పని చేసే చోట ఓట్ల అభ్యర్థన షాద్నగర్: లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్తున్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో నేతలు కూలీలు పని చేసే ప్రాంతాలకు వరుస కడుతున్నారు. వారితో కలిసి పని చేస్తూ.. తట్టా, బుట్టా మోస్తూ, కూరగాయలు కోస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారికి ఉపాధి.. వీరికి ప్రచార పరమావధి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చాలాగ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు 8 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద నుంచి మూడు వందల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. చెరువుల్లో పూడిక తీత, కందకాల తవ్వకం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో నాయకులు ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మార్చుకుంటున్నారు. రైతన్న.. నీ ఓటు మాకేనన్న యాసంగి పంటలు కోతలు జరుగుతున్నాయి. గ్రా మాల్లో చాలా మంది రైతులు వ్యవసాయ పొలాల వద్ద పంట కోతల్లో నిమగ్నమయ్యారు.తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు పొలాల వద్దే ఉంటున్నారు.దీంతో నేతలు ప్రచారాల కోసంపొలం బాట పడుతున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులను కలుస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని వారికి హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆట.. ఓట్ల వేటవేసవి సెలవులు కావడంతో ఉదయం, సాయంత్ర వేళల్లో పట్టణాలు, గ్రామాల్లో క్రీడా మైదానాలు కిటకిటలాడుతున్నాయి. కొందరు వ్యాయామాలు, నడకకు వెళ్తే, యువత క్రికెట్ టోర్నమెంట్లలో నిమగ్నం అవుతోంది. దీంతో నాయకులు క్రీడా మైదానాలను ఎంచుకొని అక్కడికి వెళ్తూ వారితో సరదాగా ఆటలు ఆడుతూ.. వ్యాయామాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, చికెన్, మటన్ దుకాణాల వద్ద ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement