-
ఏం చేశారో అడగండి
● కాంగ్రెస్, బీజేపీ వాళ్లను ప్రశ్నించండి ● మానేరు వంతెన కింద నీళ్లు మాయం ● కరెంట్ కోతలు మొదలు ● బతుకమ్మ చీరల ఆర్డర్లు దూరం ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుసిరిసిల్ల: సిరిసిల్ల ప్రజలు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశానో చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేశారో మీరు ప్రశ్నించండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను కోరారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా.. సిరిసిల్ల ప్రజలు ఐదు సార్లు గెలిపించారన్నారు. ప్రభుత్వం ఉండగా.. కాలేజీలు తెచ్చినా.. రోడ్లు వేసిన, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలను ఆదుకున్నామని తెలిపారు. మీరు గెలిపిస్తే.. పక్కనే ఉన్న వేములవాడ, చొప్పదండిలో మనకు ఓట్లు వేయక ఓడించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. మానేరు వంతెన కింద సముద్రం మాదిరిగా నీళ్లు ఉండేవని, ఇప్పుడు మాయమయ్యాయన్నారు. మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని, నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు దూరమయ్యాయని పేర్కొన్నారు. తాను జిల్లాను ఏర్పాటు చేసి కలెక్టరేట్ను తెచ్చానని, వ్యవసాయ, నర్సింగ్, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, బైపాస్రోడ్లు, సిమెంట్రోడ్లు ఇలా అనేక పనులు చేశానని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నేతలను మీరేం చేశారని నిలదీయాలని కోరారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను గుర్తించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. సిరిసిల్ల వీధుల్లో కేటీఆర్ ప్రచారం ఎమ్మెల్యేగా 2009లో కేటీఆర్ సిరిసిల్ల వీధుల్లో తిరిగిన నాటి దృశ్యాలు శనివారం కనిపించాయి. ఉదయం 6.30 గంటలకే రైతుబజారు వద్ద రైతులను కలిశారు. రాగిజావ తాగి ఆ వ్యాపారం చేసే దంపతులతో మాట్లాడారు. మెడికల్ కాలేజీకి మా భూములు ఇచ్చాం.. మాకు ప్లాటు ఇవ్వలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఓ మహిళా రైతు కేటీఆర్ను ప్రశ్నించగా.. కలెక్టర్తో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, తోట ఆగయ్య, జిందం చక్రపాణి, గూ డూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, లక్ష్మీనారాయణ, దేవదాస్, శ్రీనివాస్, నారాయణగౌడ్, గుడ్ల మంజు ల, మంచె శ్రీనివాస్, కల్లూరి రాజు, సత్తార్, సలీం, డాక్టర్ గాజుల బాలయ్య, కల్లూరి లత పాల్గొన్నారు. మరోసారి మోసపోకండి వీర్నపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, ఎంపీ ఎన్నికల్లో వినోద్కుమార్ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. వీర్నపల్లిలో సమావేశంలో మాట్లాడారు. వీర్నపల్లిని ఆదర్శగ్రామంగా చేసిన ఘనత బోయినపల్లి వినోద్కుమార్కే దక్కుతుందని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. బంజారా భాష నేర్చుకొని వస్తానని.. మీతో మాట్లాడుతానని కేటీఆర్ అన్నారు. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
● కలెక్టర్ అనురాగ్ జయంతి ● సిరిసిల్ల, వేములవాడల్లో ఈవీఎంల కమిషనింగ్ సిరిసిల్ల: ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడల్లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా కమిషనింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాలను పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు. స్ట్రాంగ్రూమ్ నిర్వహణ వివరాలను ఏఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల సందర్శన సిరిసిల్లలోని గీతానగర్ పాఠశాల, వేములవాడలోని నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజా వుగా జరిగేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశా రు. అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్వో పి.గౌతమి, వేములవాడ ఏఆర్వో రాజేశ్వర్, సిరిసిల్ల ఆర్డీవో ర మేశ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్లు షరీఫ్ మొహినొద్దీన్, మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
వినండి మా గోడు!
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ 13 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలతో భారీగా జనాభా ఉన్న సువిశాలమైన జిల్లా. ఇంతటి జనాభా ఉన్న పాత జిల్లాలో సామాన్యులు చట్టప్రకారం అందాల్సిన కనీస సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. సామాజికపరంగా భద్రత కల్పించే అనేక రకాల సదుపాయాలను వివిధ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టింది. ఇంతవరకూ ఆ సేవలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో అందడం లేదు. కొన్ని సేవలు నేటికీ అసంపూర్తిగానే అందుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు గెలిచాక ఆయా సమస్యలకు ఈ సారైనా పరిష్కా రం చూపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ సేవలెక్కడ? ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా మూడు రంగాల్లో కా ర్మికులు పనిచేస్తున్నారు. వీరు అనారోగ్యం పాలైతే వైద్యం అందించేందుకు కేంద్రం ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు తీసుకొచ్చింది. రామగుండంలో చిన్న డిస్పెన్సరీ తప్ప జనాభాకు తగినట్లు ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. అసలు ఆ ఆసుపత్రి ఉన్న విషయం కూడా చాలామంది తెలియకపోవడం గమనార్హం. ఈ సేవలు పొందాలంటే వరంగల్, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల మంది ప్రైవేటు టీచర్లు వివిధ స్కూళ్లలో పని చేస్తున్నారు. కానీ, వీరిలో 50శాతంపైగా మందికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేవు. 1,000 వరకు ఉన్న రైసుమిల్లుల్లో 20వేలకు పైగా కార్మికులు ఉన్నారు. అలాగే దాదాపు లక్షా తొంబై వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 370 వరకు గ్రానైట్ క్వారీల్లో 25వేల వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సరైన పీఎఫ్, ఈఎస్ఐ సేవలు అందడం లేదు. వేతన సవరణతో సేవలకు దూరం ఆపద కాలంలో కనీసం హైదరాబాద్లో అయినా ఈఎస్ఐ సేవలు పొందే వీలుండేది. 2015లో రూ.15,000 ఉన్న వేతన పరిమితిని కేంద్రం రూ.2,1000కు పెంచింది. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. కానీ, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత కేసీఆర్ ప్రభుత్వం 30శాతం వేతనం పెంచింది. దీంతో చాలామంది కార్మికుల వేతనాలు రూ.21,100 దాటాయన్న కారణంతో ఈఎస్ఐ సేవలకు దూరమయ్యారు. మారుతున్న కాలానికి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25వేలకు పెంచాలన్న కార్మికుల డిమాండ్ ఇంకా అమలుకు నోచుకోలేదు. అంగన్వాడీ ప్రతిపాదనలేవి? ● పిల్లలకు సరైన పోషకాహారంతోపాటు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అంగన్వాడీ కేంద్రాలు..పేద, సామాన్యుల పాలిట వరం. మన రాష్ట్రంలో దాదాపు 37,500 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి పెరుగుతున్న జనాభా, వెలుస్తున్న కొత్త కాలనీలకు అనుగుణంగా కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఆన్ డిమాండ్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది. అయినా, ఈ కేంద్రాల అమలుకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఆశించినంత స్థాయిలో చొరవ తీసుకోవడం లేదు. ● కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) కింద ఏర్పాటు చేయాల్సిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు మన వద్ద లేకపోవడం గమనార్హం. ● అలాగే 13 నియోజకవర్గాల్లో జరుగుతున్న సివిల్ పనుల్లో 0.1 శాతం మొత్తాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్)కు జమవుతుంది. ఆ మొత్తాన్ని వివిధ సివిల్ పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు గ్రాడ్యుయేట్ ఫినిషింగ్ స్కూల్ కోసం వెచ్చిస్తారు. అలాంటి శిక్షణ కేంద్రం ఉమ్మడి జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేసినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారవుతారు. ● కేంద్రం పరిధిలోని నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్తో రాష్ట్రం సమన్వయం చేసుకోని కారణంగా ఇక్కడ మైనార్టీలకు సరైన ఆర్థికసాయం అందడం లేదు. మైనార్టీ సంఖ్యను చూసినప్పుడు కరీంనగర్లో 1,29,000, పెద్దపల్లిలో 70,000పైగా, నిజామాబాద్లో 3,00,00 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లింలు అధికభాగం ఉండగా, మైనార్టీలు, సిక్కులు తదితరులు మిగిలిన సంఖ్యలో ఉన్నారు. ఈసారి గెలిచే ఎంపీలైనా మైనార్టీల ఆర్థికసాయానికి చొరవ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి
● బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు చేసిందేమీ లేదు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు ఒక్క అవకా శం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, జోగాపూర్, బండపల్లి, ఎన్గల్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాజేందర్రావును గెలి పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడిగితే మోసపోవద్దని కోరారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమిటో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ముస్కు పద్మ, మాజీ జెడ్పీటీసీ లింగారెడ్డి, సనుగుల సింగిల్విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, పులి సత్తయ్య, దూది శ్రీనివాస్రెడ్డి, జలపతి పాల్గొన్నారు. కాంగ్రెస్లోకి ఎన్గల్ మాజీ సర్పంచ్ ఎన్గల్ మాజీ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య తన అ నుచరులు 50 మందితో కలిసి కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పారు. గసికంటి ప్రభాకర్, లింగయ్య, ఏనుగంటి శంకర్, సత్తయ్య, తిరుపతి ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను పక్కన పెట్టాలి వేములవాడరూరల్: పదేళ్లు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడరూరల్ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజిపేట, మర్రిపల్లి, నాగయపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్గౌడ్, ఎంపీటీసీ చెన్నాడి శ్యామల, మాజీ సర్పంచ్లు సామ కవిత, తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి, బాలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే చికిత్స చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశాం. కుక్క కరిస్తే నాటు వైద్యం చేయించుకోకుండా హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం మంచిది. – సుమన్ మోహన్రావు, డీఎంహెచ్వో రక్షణ చర్యలు చేపడతాం కుక్కకాటు నుంచి ప్రజలకు రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వీధికుక్కలకు యాంటిరాబిస్ ఇంజక్షన్లు వేయిస్తున్నాం. త్వరలోనే ఏనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తాం(ఏబీసీ). అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా కుక్కలు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఇలా చేయకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహారం, నీరు అందించే చర్యలు తీసుకుంటాం. – డి.లావణ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement