-
కమిషనింగ్ పూర్తిచేయండి
జ్యోతినగర్(రామగుండం): ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూ చించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పా టు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సోమవా రం ఆయన తనిఖీ చేశారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తిచేసి, ఈవీఎంల కమిషనింగ్ ప్రారంభించామని తెలిపారు. తహస్దీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీపాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను జెడ్పీ సీఈవో నరేందర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. త్వరితగతిన పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్ళళ్లల్లి, బసంత్నగర్ డీఆర్డీవో రవీందర్ ఠాథోడ్ పర్యటించి పోలింగ్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు. ఎంపీడీవో శశికళ, ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు, హెచ్ఎం కమలాకర్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘మీరూ ఓటు వేయండి’పెద్దపల్లిరూరల్: ప్రజాస్వామ్యంలో ఓటుహ క్కు విలువైనదని, ప్రతీఓటరు దానిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అ న్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున సబ్ డివిజనల్ పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన సోమవారం వారు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం రాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చా రు. గతనెల 29న మిల్స్లో తలెత్తిన సాంకేతిక లోపంతో యూనిట్ను షట్డౌన్ చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు రో జులుగా ఇంజినీర్లు, ఉద్యోగుల నిరంతరం శ్ర మిచి యూనిట్ను విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. గత మూడు నెలలుగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, పునరుద్ధరించడం తదితర పనులతో రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా, శాశ్వత పరిష్కారం లభించడంలేదు. నీటి సమస్య పరిష్కరించాలిమంథని: గ్రామాల్లో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తేసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. గుంజపడుగు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేశారు. తాగునీటి సరఫరా తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. పంచాయతీ కార్య దర్శి రత్నాకర్ తదితరులు ఉన్నారు. ప్రశాంతంగా ఈసెట్ రామగిరి(మంథని): సెంటినరీకాలనీ జేఎన్టీయూలో సోమవారం ఈసెట్ ప్రశాంతంగా ముగిసింది. 150 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రతీ విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని అన్నారు. ఎస్సై సందీప్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వేడెక్కిన ప్రచారం
● జిల్లాలో అగ్రనేతల పర్యటనలు ● ప్రధాన పార్టీల శ్రేణుల్లో జోష్ ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాక ● పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయం కోసం నేతల ప్రచారం ● హామీలిస్తూ, విమర్శలు గుప్పిస్తూ, ఉత్సాహం నింపుతూ ముందుకు.. సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి లోక్సభలో తమ పార్టీ అ భ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమ అభ్యర్థుల విజయం కోసం జిల్లా పర్యటనకు వస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గుడువు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు పార్లమెంట్ను చు ట్టేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేసమయంలో తమ పార్టీని గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. మరోసారి సీఎం రేవంత్రెడ్డి రాక.. ● సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ● ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాంపల్లి బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నిక ప్రచారం చేశారు. ● దివంగత పీవీ, శ్రీపాదరావు, కాకాను గుర్తుచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం హామీలిస్తూ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ● కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ● జిల్లాకేంద్రంలో వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి పాల్గొననున్నారు. కార్మికులకు అండగా ఉండేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రామగుండంలో చేపట్టిన రోడ్డుషోలో మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో.. గతంలో కాంగ్రెస్ సింగరేణిని ముంచిందని, బొగ్గు గనులను బీజేపీ ప్రైవేట్పరం చేస్తోందని ఫైర్ ఆయ్యారు. తెలంగాణ కోసం, సింగరేణి కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఐదునెలల్లో రాష్ట్రంలో కరెంట్, సాగు నీటిసమస్యలు తలెత్తాయని, కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళం విప్పేది బీఆర్ఎస్ ఎంపీలేనంటూ ప్రచారం నిర్వహించారు. ఆర్ఎఫ్సీఎల్ను పునరుద్ధరించాం.. ● బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి జనసభలో కాషాయ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ● జగదల్పూర్–పెద్దపల్లి–ధర్మపురి– నిజామాబాద్ జాతీయ రహదారిని త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ● మూతపడిన ఎఫ్సీఐని ఆర్ఎఫ్సీఎల్గా పునరుద్ధరించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచామని ఆయన అన్నారు. ● బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మంథనిలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో రాజస్థాన్ సీఎం భాజన్లాల్శర్మ పాల్గొననున్నారు. ఎండలోనూ చుట్టేస్తున్నారు ముఖ్య నాయకుల సభలు లేని మిగతా రోజుల్లో అభ్యర్థులు ప్రతీ గ్రామంలో పర్యటిస్తున్నారు. కార్నర్ మీటింగ్లు, రోడ్డుషోలతోపాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పల్లె చుట్టేస్తూ ‘అన్నా.. ఎట్లున్నవు.. చెల్లె, అక్కా బాగున్నావా.. అమ్మా ఓటెయ్యాలే’ అని బంధుగణం, అనుచరగణం ఇంటింటి ప్రచారం చేస్తోంది. -
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
పెద్దపల్లిరూరల్: ‘భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్.. ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా’ అ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్(జేపీ) న డ్డా జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆరంభించారు. ప్రధాని మోదీ సా రథ్యంలోని ప్రభుత్వం నీతివంతమైన పాలన సాగిస్తోందని, మనదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన ని లిపేందుకే ఆరాట పడుతోందన్నారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కాలేజీ మైదానంలో పెద్దపల్లి పార్ల మెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతు గా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నడ్డా ప్రసంగాన్ని రాంచందర్రావు తె లుగులో అనువదించారు. మంథని ఎమ్మెల్యేగా ఎ న్నికైన, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భార తరత్న పురస్కారం అందించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు అన్నిగ్రామాలకు చేరాయన్నారు. 53వ నంబరు జాతీయ రహదారి పూర్తయితే మరింత మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ సాగుతోందని, రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించామని తెలిపారు. 25కోట్ల మంది పేదలు ఆత్మ నిర్భర్ ద్వారా ఆర్థికాభ్యున్నతి సాధించేలా ప్రోత్సహించామన్నారు. పదేళ్ల కేసీఆర్ సర్కార్ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, కుటుంబపాలనకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కేంద్రప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఓవైసీతో దోస్తానా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఓవైసీతో దోస్తీ చేస్తున్నా రని జేపీ నడ్డా విమర్శించారు. ముస్లింల ఓట్ల కోస మే ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు పంచారని, తాము వాటినే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి వివేక్ కుటుంబం జాగీరా? ‘పెద్దపల్లి అడ్డా వెంకటస్వామి కుటుంబీకుల జాగీ రా? వెంకటస్వామి పోతే ఆయన కొడుకు వివేక్, ఇ పుడు ఈయన కొడుకు వంశీకృష్ణ పోటీ చేస్తరా? ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తం.. గడ్డం కుటుంబీకుల ను ఓడించి కాషాయజెండా ఎగురవేస్తం’ అని బీజే పీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఇక్క డ ప్రజాప్రతినిధులుగా గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత్ భా రత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన రిజర్వేషన్లు ఒక్క వెంకటస్వామి కుటుంబమే అనుభవిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బీజేపీ అధ్యక్షులు సునీల్రెడ్డి, రఘునాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి, శ్రీదేవి, నాయకులు చిలారపు పర్వతాలు, జి.సురేశ్రెడ్డి, వనిత, కందుల సంధ్యారాణి, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై.. అందరికీ నమస్కార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా -
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలను రిజిష్టర్లలో పకడ్బందీగా నమో దు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల వ్యయం నమోదుపై వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యయం వి వరాలు నమోదు చేయాలన్నారు. 36మంది అభ్యర్థులు హాజరు కాగా గైర్హాజరైన ఆరుగురికి నోటీసు లు జారీచేశామని తెలిపారు. తదుపరి సమావేశం ఈనెల 11న ఉంటుందని పేర్కొన్నారు. డీసీవో శ్రీమాల తదితర అధికారులు పాల్గొన్నారు. రూ.కోటి 78లక్షల జప్తు.. పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.కోటి 78లక్షల97వేల132 నగదు జప్తు చేసి, తగిన ఆధారాలు చూపిన వారికి రూ.కోటి67లక్షల37వేల32 నగదు విడుదల చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలి పారు. ఆధారాలు చూపని రూ.11లక్షల60వేల100 సీజ్ చేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
● ఉద్యోగుల నిర్లక్ష్యమా? అధికారుల బాధ్యతారాహిత్యమా? కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో అధికారుల బాధ్యతా రాహిత్యం వెలుగులోకి వ చ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గోదావరిఖని కల్యాణ్నగర్కు చెందిన కారు డ్రైవర్, ట్రావెల్స్ నిర్వాహకుడు.. బత్తిని రవి రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం జీజీహెచ్కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు మందులు రాశారు. ఆస్పత్రి కౌంటర్లో డాక్టరు రాసిచ్చిన చీటీ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాలు నాణ్యతగా ఉండగా, మూడోరకానికి చెందిన 10 టాబ్లెట్లు తీసుకున్నాడు. ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం కారు పంపించే హడావుడిలో ఎన్టీపీసీ వెళ్లిన రవి.. అక్కడే మందులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మిత్రుడు వాటిని చూసి కాలం చెల్లిన మందులని చెప్పాడు. దీంతో చప్పరించే మందులను వాడకుండా పక్కన పెట్టాడు. అనుమానంతో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్కు వెళ్లి ఆ మందుల గురించి ఆరా తీశాడు. గతనెల వరకే గడువు ఉందని షాపు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బాధితుడు రవి ఆందోళన చెందాడు. మందులు, టానిక్లు, ఇంజక్షన్లు తరచూ తనిఖీచేసి, కాలం చెల్లిన వాటిని పక్కన పెట్టాల్సిన ఉద్యోగులు, అధికారులు.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంకా ఎంతమందికి ఇచ్చారో? మరోవైపు.. కాలం చెల్లిన మందులు ఆస్పత్రి కౌంటర్లో ఇంకా ఎన్నిఉన్నాయి? ఇప్పటివరకు ఇంకా ఎంతమందికి ఇచ్చారు? వైద్యులకు తెలిసే గడువు ముగిసిన మందులు పంపిణీ చేశారా? లేక వారికి తెలియకుండా, పొరపాటున మందులు పంపిణీ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ విచారణ చేపడితే వెలుగులోకి వస్తాయని పేషెంట్లు అభిప్రాయపడుతున్నారు. విచారణ జరువుతాం గడువు తీరిన మందులు ఇచ్చారనే ఘటనపై విచారణ చేపడతాం. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అరుణ, ఆర్ఎంవో, జీజీహెచ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement