-
మెరుగైన వైద్యసేవలందించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వాసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణ, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంకితభావంతో విధులు నిర్వర్తించే వారిని ప్రజలు ఆదరించి గౌరవిస్తారని, ప్రతిఒక్కరూ రోగులతో మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను డీసీహెచ్ఎస్ రమాకాంత్ వివరించారు. కమిషనర్ వెంట శౌరయ్య, శ్రీధర్ తదితర సిబ్బంది ఉన్నారు. -
కార్మికులకు త్వరలో ఇళ్ల స్థలాల పట్టాలు
● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ గోదావరిఖని: సింగరేణి కార్మికులకు త్వరలోనే ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాగూర్ అన్నారు. గురువారం ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లి, ఏరియా వర్క్షాప్లో ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో మాట్లాడారు. కార్మికులకు 200గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పదేళ్లు కలిసి కాపురం చేసిన బీజేపీ, బీఆర్ఎస్లు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నాయని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ను కాకా వెంకటస్వామి ఏర్పాటు చేస్తే, మాజీ ఎమ్మెల్యే అందులోని కొలువులు అమ్ముకున్నారన్నారు. ఏరియా వర్క్షాప్లో నెలకొన్న సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులను ఏనాడు పట్టించుకోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొప్పుల ఈశ్వర్కు ఓటు వేయాలని అడుగుతున్నారన్నారు. కార్మిక క్షేత్రాన్ని సింగరేణి కారిడార్గా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక క్షేత్రం ఇండస్ట్రీయల్ హబ్గా మారబోతుందన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపన ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెల్లి రాజిరెడ్డి, బదావత్ శంకర్నాయక్, బాల రాజ్కుమార్, కొత్త సత్యనారాయణరెడ్డి, ఆకుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే ఆత్మగౌరవం చంపుకోవడమే యైటింక్లయిన్కాలనీ: బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆత్మగౌరవం చంపుకోవడమే అవుతుందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం రాత్రి యైటింక్లయిన్కాలనీలోని 15, 16, 17, 18, 19 డివిజన్ల ఏరియాలో నిర్వహించిన కార్నర్ మీ టింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మకై రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, కాలనీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, కార్పొరేటర్లు శంకర్నా యక్, సాగంటి శంకర్, ఆయా డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
చెప్పింది 20 కోట్ల ఉద్యోగాలు.. ఇచ్చింది 7లక్షలు
గోదావరిఖని: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందని, గడిచిన పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉండగా కేవలం 7లక్షల మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. గురువారం శారదానగర్లోని రెడ్డిఫంక్షన్హాల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాగూర్తో కలిసి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే యువతకు అన్యాయం జరగకుండా చూస్తామని, యువన్యాయం పేరుతో ఉద్యోగం వచ్చేంత వరకు ఏటా రూ.లక్ష చెల్లించేలా నిర్ణయించినట్లు తెలిపారు. పదేళ్ల బీజేపీ పాలనలో అన్నిరంగాల్లో దేశం వెనకబడిందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. యువత గురించి దేశప్రధాని నరేంద్రమోదీకి మాట్లాడే హక్కు లేదన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించి సామాన్యులకు అందని స్థాయికి ధరలు పెంచారన్నారు. కేంద్రంలో 400సీట్లు సాధించి డాక్టర్బాబాసాహెచ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రారంభంలోనే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ప్రతులను కాలబెట్టిందని, మూడేళ్ల పాటు కార్యాలయం వద్ద కూడా జెండా ఎగురనీయలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తే తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రామగుండాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేస్తామన్నారు. రామగుండం నుంచి మణుగూరు వరకు సింగరేణి, ఎన్టీపీసీ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, బాలరాజ్కుమార్, పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సాగు, తాగునీరు అందించడమే ధ్యేయం ధర్మారం: ఽదర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాల రైతులకు సాగు, తాగునీరందించడమే ధ్యేయమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్డుషోలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మాణం చేపడ్తామని ఈ ప్రాంత రైతులను మోసం చేసిందన్నారు. రెండు నియోజకవర్గాల రైతులకు ఉపయోగకరంగా ఉండే పతిపాక రిజర్వాయర్ను నిర్మించి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. యువతను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మార్పుకోసం 400సీట్ల ఆరాటం ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ధాన్యం రవాణాకు వాహనాలు సిద్ధం చేయాలి
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన తర్వాత వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, అందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కేంద్రాల ద్వారా 1,63,069 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 1,61,539 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని కోతల పేరిట ఇబ్బందులు పెట్టొద్దన్నారు. సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్రెడ్డి, డీఎస్ఓ ప్రేంకుమార్, డీఆర్డీవో రవీందర్, డీసీవో శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.పోలింగ్ కేంద్రాల పరిశీలనకమాన్పూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం డీపీవో ఆశలత పరిశీలించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలోని తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమె వెంట డీఎల్పీవో శంకర్, ఎంపీవో శేషయ్యసూరి, పంచాయతీ కార్యదర్శి మారుతి ఉన్నారు. భూసార పరీక్షలతో అధిక దిగుబడులుపెద్దపల్లిరూరల్: భూసార పరీక్షలు చేయించి లోపాలున్న మేరకే ఎరువులు చల్లి భూసారాన్ని పెంపొందించుకుని పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించగలుగుతామని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త పిల్లి కిరణ్ అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షలతో పోషకవిలువలే కాకుండా భూమిలోని చౌడు, సున్నం శాతాన్ని గుర్తించవచ్చన్నారు. రైతులు తమ భూముల్లోనుంచి మట్టి నమూనాలను సేకరించి రామగిరి కృషి విజ్ఞాన కేంద్రానికి పంపితే పరీక్షలు నిర్వహించి సూచనలు అందిస్తామని తెలిపారు. ఏఈవో శ్వేత పాల్గొన్నారు. నిర్భ్బయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలిసుల్తానాబాద్రూరల్: నిర్భయంగా ఓటు హ క్కును వినియోగించుకోవాలని ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. గురువారం సుల్తానాబాద్లో నిర్వహించిన పోలీసు కవాతును ప్రారంభించి మా ట్లాడారు. ప్రశాంతమైన వాతవరణంలో పోలి ంగ్ జరిగేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు, బీఆర్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైన మద్యం, డబ్బులు పంపినట్లు దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు శ్రావణ్కుమార్, అశోక్రెడ్డి, శ్రీధర్, ఓంకార్యాదవ్ పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలతో 11న రండిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయ వివరాలతో ఈనెల 11న కలెక్టరేట్లోని కార్యాలయంలో హాజరు కావాలని ఎన్నికల ఖర్చుల నమోదు నోడల్ అధికారి శ్రీమాల అన్నారు. ప్రచార వ్యయ వివరాల రిజిస్టర్తో స్వయంగా గాని, ఏజెంటు ద్వారానైనా హాజరు కావచ్చని తెలిపారు. -
జప్తు.. ఆధారాలు చూపితే విడుదల
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన వాహన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1,92,56,462 నగదు జప్తు చేశామని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఇందులో సరైన ఆధారాలు చూపిన వారికి రూ.1,90,86,332 నగదు విడుదల చేశామన్నారు. ఆధారాలు చూపని రూ.1,70,130లను సీజ్ చేసి ఉంచినట్లు తెలిపారు. వివరాలు చూపితే జప్తు చేసిన నగదును అప్పగిస్తామని అన్నారు. వేసవి క్రీడాశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలిపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడాశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా శాఖ అధికారి సురేశ్ అన్నారు. గురువారం శిక్షణా శిబిరాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో హ్యాండ్బాల్ కోచ్ సురేందర్ శిక్షణఇస్తున్నాడని అన్నారు. -
No Headline
లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండానేనని, ఇది కేసీఆర్ చెప్పినట్లుగా ఆగర్భ శ్రీముంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్య పోటీయేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజా సమస్యల కోసం కేంద్రం మెడలు వంచగలిగే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే ఈసారి పెద్దపల్లి నుంచి తన గెలుపు ఖాయమని, ప్రజల గొంతును పార్లమెంటులో వినిపిస్తానని తెలిపారు. సామాజిక న్యాయాన్ని తొంగులో తొక్కినా కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో పలు విషయాలు వెల్లడించారు. – సాక్షి, పెద్దపల్లి మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అమలు కాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అనతి కాలంలోనే పరిపాలనలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ సక్కగా అమలు చేయడం లేదు. ప్రజలు తొందరపాటుతో ఓటేశామని తమ భాదలు చెప్పుకుంటున్నారు. మళ్లీ సారే రావాలి కావాలి అంటూ తమ బిడ్డగా స్వాగతిస్తున్నారు. హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఎంపీగా గెలిస్తే ప్రజా గొంతుకవుతా. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పథకాలను అమలు చేయిస్తా.ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారు? సింగరేణి కార్మికుడిగా నాకు కార్మికుల సమస్యలు తెలుసు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కొత్తగనుల ఏర్పాటు, ఆదాయపన్ను మినహాయింపు, పెన్షన్ విధానం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో పలు సూపర్ పాస్ట్ రైళ్ల నిలుపుదల, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కృషిచేస్తా. సుల్తానాబాద్లో డ్రైపోర్టు నిర్మాణం, ఓదెల, రామగిరిఖిల్లా, ధర్మపురి, కాలేశ్వరం, రామునిగుండాలతో పాటు పలు ప్రాంతాలను టూరిజం హబ్గా మార్చేలా నా దగ్గర ప్రణాళికలున్నాయి. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి? మా నాయకుడు కేసీఆర్ చెప్పినట్లుగా కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ హక్కుల కోసం బరిగీసీ కొట్లాడుతాం. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సైతం రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అందుకే బీజేపీతో రేవంత్రెడ్డి అంటకాగుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఒక్కరికిఒక్కరు సహకరించుకుంటున్నారు.మీపై వస్తున్న విమర్శలపై స్పందన ఏంటి? మచ్చలేని నాయకుడిని, నన్ను విమర్శించడానికి, వారికి చెప్పుకోవడానికి చేసిన అభివ్వద్ధి పనులు ఏం లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల బాగు కోసం అభివృద్ధికి పాటు పడే వారు కావాలా? తాగు, సాగు నీరు అందించక రైతుల ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన పార్టీ కావాలా? ఒక్క కుటుంబంలోనే ముగ్గురికి పదువులు కావాలో విజ్ఞలైన ప్రజలే ఆలోచించాలి. 40 ఏళ్లుగా వారి కుటుంబమే ఈ పెద్దపల్లిని పరిపాలించాలా? తాత, తండ్రి, మనువడు అంటూ ప్రజల మీద రుద్దుతున్నారు. దేశంలో శ్రీమంతుల జాబితాలో 9వ నంబర్గా ఉన్న వారు రిజర్వ్డ్ స్థానంలో పోటీచేయడం ఎందుకు? ఇదెక్కడి సామాజికన్యాయమో ఆలోచించాలి.మీ ప్రత్యర్థి పార్టీలపై మీ స్పందన ఏంటి? పదేళ్లలో కేంద్రంలో బీజేపీ చేసిందేమీ లేదు. కనీసం చెప్పుకోవడానికి ఫలానా పని అంటూ కనిపించడం లేదు. 2019లో పుల్వామా దాడిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు రామమందిరం పేరుతో రాజకీయం చేస్తున్నారు. మాకు అన్ని మతాలు సమానమే. రెచ్చగొట్టి రాజకీయాలు మేం చేయం. తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపెట్టింది. సింగరేణిని ప్రైవేట్పరం చేయవద్దని చెప్పిన, నోటిఫికేషన్ ఇచ్చి ప్రైవేట్పరం చేశారు. చివరగా నియోజకవర్గ ఓటర్లకు మీరు ఏం చెప్పదల్చుకున్నారు? ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఇక్కడే చస్తా.. ఈ గోదావరి తల్లిగా ప్రమాణం చేసి చెప్పుతున్నా. ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు, నియోజవకవర్గ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారం కోసం, ఇక్కడి ప్రజల వాణిని ఢీల్లీలోని పార్లమెంట్లో వినిపిస్తా. అదే స్థానికంగా ఉండని, ఏసీల్లో తిరిగే వ్యాపారవేత్తలైన వారికి ఓటు వేస్తే మురుగుకాలువలో వేసినట్లే అవుతుంది. ప్రజలు ఆలోచించి నన్ను ఆశీకర్వదించాలని కోరుకుంటున్నా. ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఒకే ఫ్యామిలీకి మూడు అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయమా? హామీలు నెరవేర్చకుండా ఓట్లు అడిగే నైతికహక్కు కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్, బీజేపీలే సింగరేణిని ముంచినాయి ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ -
రూ.14.05లక్షలు పట్టివేత
జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద పట్టణ ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మందుల లచ్చన్న నుంచి రూ.6లక్షలు పట్టుకున్నారు. కొత్తస్టాండ్ చౌరస్తా వద్ద కథలాపూర్ మండలం గంభీరావుపేటకు చెందిన ఒగ్గు ప్రకాశ్ నుంచి రూ.7.50 లక్షలు సీజ్ చేశారు. కొత్తబస్టాండ్ వద్ద మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ రూ.45 వేల విలువైన కూలర్లు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. అలాగే సారంగాపూర్లో మహారాష్ట్రకు చెందిన వామన్లాల్ సింగ్ చౌహన్ అనే మామిడి వ్యాపారి నుంచి రూ.55వేలు పట్టుకున్నారు. పోతారం గ్రామంలో బెల్ట్షాపు నిర్వహిస్తున్న రమేశ్ నుంచి రూ.5 వేల విలువైన మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రామగుండం: మల్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద గల రాజీవ్ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్–2డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా మల్యాలపల్లి సబ్స్టేషన్ మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుకు మరోవైపు ప్రమాదం జరిగి ఉంటే బస్సు బోల్తాపడి భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి మృతి జూలపల్లి: జూలపల్లి మండలం కాచాపూర్లో గురువారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో పుట్ట ప్రశాంత్(32) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఎన్. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్న ప్రశాంత్ గురువారం ఉదయం ట్రాక్టర్లో ధాన్యం రవాణా చేస్తూ ఊర చెరువు సమీపంలో గల కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ నడుపుతున్న ప్రశాంత్ ఇంజిన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. వడదెబ్బతో వృద్ధుడు.. ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్కు చెందిన వృద్ధుడు సార్ల లింగయ్య(62) గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. లింగయ్య ఉపాధిహామీ పనులకు వెళ్లి ఇంటికొచ్చాక అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ముత్తారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డీఎల్పీవోగా నరేశ్కుమార్సిరిసిల్ల: జిల్లా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్(డీఎల్పీవో)గా బి.నరేశ్కుమార్ను నియమిస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య గురువారం తెలిపారు. జిల్లా డీఎల్పీవోగా ప నిచేసిన మల్లికార్జున్ రిటైర్డు కాగా.. ఆయన స్థానంలో వీర్నపల్లి పంచాయతీ ఆఫీసర్గా ప నిచేస్తున్న బి.నరేశ్కుమార్ను నియమించారు. -
No Headline
కరీంనగర్ అర్బన్: నగరంలోని అత్యధిక హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాల్లో దర్జాగా రాయితీ గ్యాస్ వినియోగిస్తున్నారు. పలు ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి భారీ అక్రమాలకు తెర తీయగా.. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దందాను మరింత పెంచారు. హోటళ్లు, చిరుతిళ్ల తయారీ, రెస్టారెంట్లు, దాబాల్లో రాయితీ వంటగ్యాస్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. అదేంటీ.. ఆన్లైన్లో బుకింగ్ కదా అంటే.. పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాకం వల్ల ఇదిగో ఇలా హోటళ్లలో చేరుతాయంతే.!! అటకెక్కిన తనిఖీలు ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాలశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో ఇండెన్, హెచ్పీ, భారత్ కంపెనీల వినియోగదారులుండగా 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాల్సిన పౌరసరఫరాలశాఖ అధికారులు ఏనాడో సదరు విధులను మరిచారన్న విమర్శలున్నాయి. సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్, డీటీ సివిల్ సప్లయ్, ఏఎస్వోలు ప్రతినెలా తనిఖీలు నిర్వహించాలన్న టార్గెట్నే మరిచారు. నెలకు రూ.కోట్లలో అక్రమ దందా నగరంలోని పలు హోటళ్లలో ఆహారనాణ్యత అటుంచితే హెచ్చు ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లు పేరుకు మాత్రమే కనిపిస్తాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,300 ఉండగా సబ్సిడీ గ్యాస్ రూ.1,000కే దొరుకుతుండటం, అందుకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీబాయ్ల సంపూర్ణ సహకారముండటంతో కమర్షియల్ సిలిండర్ వాడకాన్ని 70శాతం తగ్గించారు. ఒక్కో హోటల్లో కస్టమర్లను బట్టి కనిష్టంగా నెలకు 10 నుంచి 50సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రాయితీ గ్యాస్ వినియోగించే ఒక్కో హోటల్లోనే రూ.20వేల నుంచి రూ.70వేల వరకు అక్రమంగా లాభపడుతున్నారు. రాయితీ గ్యాస్ వినియోగించే అన్ని ప్రాంతాలను లెక్కిస్తే నెలకు రూ.కోట్లలో ప్రయోజనం పొందుతున్నారు. మరీ ఇందులో ఎవరి వాటాలు ఎంతో తేలాల్సి ఉంది. భారీగా తేడాలు నగరంలో రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, టీస్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు అన్ని కలిపి 2వేల వరకు ఉంటాయని అంచనా. కానీ వారు బుక్చేసే సిలిండర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. విపరీతంగా కస్టమర్లు ఉన్న హోటళ్లలోనూ తక్కువ కమర్షియల్ సిలిండర్లు వాడారంటే అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల వద్ద రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే పలు విద్యాసంస్థల్లో సైతం రాయితీ సిలిండర్లు వినియోగిస్తున్నారు. పెద్దపెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు సుమారు 10వేల సిలిండర్ల వినియోగం జరగాలి. కాగా.. 11 ఏజెన్సీల పరిధిలో కేవలం వందల్లోనే కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా సగటున నెలకు 20వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని సమాచారం. తనిఖీలు చేపడతాం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కేవలం గృహాల్లో మాత్రమే వినియోగించాలి. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వ్యాపారులు వినియోగించాలి. రాయితీ గ్యాస్ పక్కదారి పడుతుందన్నది తెలియదు. తనిఖీలు చేసి చర్యలు చేపడతాం. – జిల్లా పౌరసరఫరాల అధికారి -
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రయివేట్ వ్యక్తులకు అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియలోనే దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ చెప్పడం అన్యాయమన్నారు. వేలంలో బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు దక్కితే జరుగబోయేది విధ్వంసమే అన్నారు. సంస్థకు అవసరం లేని విదేశీ యంత్రాలను కొనిపించిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్ల సింగరేణి సంస్థ నష్టాల పాలైందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్, రాజ్కుమార్, పాశం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు -
విషాదం నింపిన క్యాన్సర్
● గర్భిణి మృతి ● కంటతడి పెట్టిన స్థానికులు, బంధువులు కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ (జీజీహెచ్) ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన గర్భిణి గొంతు క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబసభ్యులు, ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. మంథని ప్రాంతానికి చెందిన దివ్య(29)కు మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో కూతురు జన్మించింది. రెండోసారి గర్భం దాల్చిన దివ్య ప్రస్తుతం 36 వారాల గర్భవతి. కాగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న దివ్య గురువారం ఇంట్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటూ అస్వస్థతకు గురైంది. హుటాహుటిన మంథనిలోని ప్రభుత్వ ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించగా గోదావరిఖని జీజీహెచ్కు రెఫర్ చేశారు. గోదావరిఖని ఆస్పత్రికి తరలించే లోగానే గర్భిణి అపస్మారక స్థితిలోకి చేరింది. వైద్యులు చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందింది. మరోవైపు కడుపులోని శిశువును బతికించడానికి ఆపరేషన్ చేసినప్పటికీ శిశువు కూడా కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించగా వివిధ సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లు సైతం కంటతడి పెట్టారు. -
కాంగ్రెస్కు సేవ చేసే వారందరికీ గుర్తింపు
కమాన్పూర్(మంథని): కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతీఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమాన్పూర్, కన్నాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, మల్క రామస్వామి, వారి అనుచరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడారు. కన్నాలలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మా ణానికి నిధులు మంజూరు చేశామన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోనే కొ నుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. తనపై తప్పుడు కూతలు కూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామమని హెచ్చరించారు. యువతకు ఉద్యోగాగాలు ఇస్తాం పెద్దపల్లిరూరల్: తనను పార్లమెంట్కు పంపిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. యూత్కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు ఎమ్మెల్సీ, యూత్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, దుద్దిళ్ల శ్రీనుబాబు తదితర నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మోసపూరిత విధానా లు అవలంబిస్తున్నాయని ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. నాయకులు పాల్గొన్నారు.● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ప్లాన్–3
● మిగిలింది మూడు రోజులే ● దూసుకొస్తున్న గడువు ● వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక ● రథాలు, సామాజిక మాధ్యమాలే కీలకం ● మండలాల వారీగా సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. 48 గంటల ముందే ఎ న్నికల ప్రచారం ముగించాల్సి ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గ విస్తీర్ణం విశాలంగా ఉండడం, ఓ టర్ల సంఖ్య అధికంగా ఉండటంతో అభ్యర్థులు ప్రతీఓటరును నేరుగా కలిసే అవకాశం లేదు. దీంతో సభల నిర్వహణపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభల్లో పాల్గొన్ని పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపారు. అయి తే, ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటివరకు ప్రచారమంతా మాటలతో సాగింది. ఓటర్లను పూర్తి స్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు. ఎక్కువ మందిని కలిసేలా.. ● నగరాలు, పట్టణాలు, మండలాల్లో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసిసేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. ● ఏ రోజు.. ఏ మండలంలో ప్రచారం నిర్వహించాలో షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. ● ముఖ్యంగా మండలాల వారీగా యువజన, మహిళా, కుల, యువజన సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● హామీలు గుప్పిస్తూ వారిని ఆకట్టుకోవాలని నిర్ణయించారు. ● సమయం తక్కువ ఉన్నందున అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసే వీలులేకపోవటంతో వారి అనుచరులు, పార్టీ శ్రేణుల ద్వారా గడపగడపకూ తిరిగి ఓట్లు అభ్యర్థించే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ● అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్లను నియమించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరమే లక్ష్యం అన్ని గ్రామాల్లో పర్యటించడం కష్టం కావటంతో మండల కేంద్రాలు, పట్టణాలు, రామగుండం నగరంలో సభలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా గ్రామాలమీదుగా, పట్టణాలు, నగరంలోని కాలనీల మీదుగా కార్నర్ మీటింగులు, ర్యాలీలు చేపడుతూ ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పగించారు. మొత్తమ్మీద సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, ప్రచార బాధ్యతలెత్తుకున్న నాయకులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ప్రచారం చివరిరోజు అధినేతల సభలు, రోడ్షోలు ఏర్పాటు చేయడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించాలని అభ్యర్థులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నారు.. ఎండలకుతోడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలతో లోక్సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం కురిసిన అకాల వర్షంతో వాతావరణం చల్లబడినా.. పోలింగ్ ముగిసే వరకూ సోషల్ మీడియా వింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మాటలు, తూటాలు, విమర్శనాస్త్రాలతో పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా ప్రచార రథాలు, సోషల్ మీడియాపైనే అభ్యర్థులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. -
కమలదళంలో హుషారు
● తన ప్రసంగంతో ఉత్సాహం నింపిన ప్రధాని మోదీ ● రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని ● పోలీస్ వలయంలో ఆధ్యాత్మిక క్షేత్రం ● జనహోరుతో మార్మోగిన శైవక్షేత్ర పరిసరాలు ● బహిరంగ సభకు భారీగా జనం హాజరు వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ కాషా యమయమైంది. అడుగడుగునా పోలీసుల తనిఖీ లు.. కమలదళం కవాతులతో మార్మోగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మో దీ బుధవారం వేములవాడకు రాగా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా రాజన్నను దర్శించుకున్న మోదీ నేరుగా.. బహిరంగసభ వేదికపైకి వచ్చారు. తన ప్రసంగంతో కాషాయదళంలో హుషారు నింపారు. సమరోత్సాహంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరారు. ఈ ముగ్గురికి ఓటేస్తే తనకు వేసినట్లేనని ఆయన చెప్పారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు వేదిక ప్రాంగణం మోదీ.. మోదీ.. అనే నినాదాలతో దద్దరిల్లింది. పట్టణంలోని కూడళ్లు, బైపాస్రోడ్డు కాషాయజెండాలతో నిండిపోయింది. పొద్దు పొద్దుగాళ్ల గింత జనప్రవాహమా.. ‘వేములవాడ జనసభ’ పేరుతో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకే బహిరంగసభకు భారీగా జనం తరలివచ్చారు. సరిగ్గా 10.30 గంటలకు సభ ప్రాంగణానికి మోదీ చేరుకుని.. జన సందోహాన్ని చూసి చలించిపోయారు. హెలికాప్టర్లో నుంచి జనప్రవాహాన్ని చూసిన మోదీ.. ఈ విషయాన్ని వేదికపై నుంచి ప్రస్తావించారు. ‘నేను గుజరాత్లో మూడుసార్లు సీఎంగా పనిచేసిన. అక్కడ ఎన్నో ఎన్నికలు చూసిన. కానీ గుజరాత్లో కూడా పొద్దు పొద్దుగాళ్ల గింత పెద్ద జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదు. కానీ ఇక్కడ ఇంతమంది తరలిరావడం.. సభ బయట కూడా భారీగా జనం వస్తున్న దృశ్యాలను చూస్తుంటే... మీ అందరూ నాపై చూపుతున్న ప్రేమాభినాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం ముందే ఖాయమైందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అతి కష్టం మీద నిలబెట్టగా.. ఓటమి ఖాయమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ అడ్రస్ గల్లంతైందన్నారు. ఆరడుగుల బుల్లెట్ కావాలా? దొంగల ముఠా నేత కావాలా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ కాంగ్రెస్పై పంచ్ల వర్షం కురిపించారు. కాశీ నుంచి దక్షిణకాశీకి వచ్చిన తొలి ప్రధాని నరేంద్రమోదీని కాశీవిశ్వేశ్వరుని ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆరడుగుల బుల్లెట్ మోదీ కావాలా? దొంగల ముఠా బ్యాచ్ నేత రాహుల్ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ను గద్దె దించి మెడలు పట్టి గెంటేసిన జగమొండి నరేంద్రమోదీ అని వ్యాఖ్యానించారు. ‘పక్కా లోకల్ మోదీ, మేడ్ ఇన్ భారత్ బీజేపీ.. నాన్లోకల్ సోనియాగాంధీ, మేడ్ ఇన్ బ్రిటీష్ పార్టీ కాంగ్రెస్..’ ఎవరి పక్షాన నిలుస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. 370 ఆర్డికల్ను రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసిన జగమొండి మోదీ అ న్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించిన జగమొండి మోదీ.. అని పే ర్కొన్నారు. హిందువుల 500 ఏళ్ల కల అయోధ్య రా మమందిరానికి ప్రాణప్రతిష్ఠ చేసిన జగమొండి అ న్నారు. కరోనా వ్యాక్సిన్ అందించి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి తెరిపించిన విషయాన్ని గుర్తుచేశా రు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కి రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. బీజేపీని గె లిపిస్తే హైవేలు, ఇంటర్నెట్, రైల్వేలు, ఎయిర్వేస్లతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గాడిదగుడ్డు చూపుతున్నారు ఆరు గ్యారంటీలను అడిగితే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు గాడిదగుడ్డు చూపిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వలేదని, రూ.2లక్షల రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకొస్తారని.. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి మనమంతా మోదీ పక్షాన ఉంటూ మూడోసారి ప్రధానిని చేసుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
ఉపాధి కల్పనే కాంగ్రెస్ ధ్యేయం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: ఉద్యోగాల కల్పన కాంగ్రెస్తోనే సాఽ ద్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూ ర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్లో బుధవా రం జరిగిన సీపీఎం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధర, ఉపాధిహామీ కూలీలకు రోజు కూలి రూ.400 వరకు పెంపు, పేద రైతుకు ఏటా రూ.లక్ష, రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్య సదుపాయం, 30లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్కుమార్, సీపీఎం నాయకుడు యాకయ్య ఉన్నారు. ఆదాయపు పన్ను మాఫీకి కృషి సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మాఫీకి వెసులుబాటు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ హామీ ఇచ్చారు. ఆర్జీ –వన్ జీఎం కార్యాలయం ఎదుట ని ర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. కార్మికు లు వ్యాధుల బారిన పడుతుంటే స్పందించని కేసీఆర్.. కొప్పుల ఈశ్వర్కు ఓటువేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చుతామన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంట నే కార్మికుల ఇళ్లకు పట్టాలతోపాటు కాంట్రాక్టు కార్మికులకు 200గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. కార్మిక క్షేత్రం రాబోయే రోజుల్లో పారిశ్రామిక క్షేత్రం ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని పేర్కొన్నా రు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, నర్సింహారెడ్డి, తిప్పారపు శ్రీని వాస్, పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం గోదావరిఖని: అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్య పు గింజ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు స్వయంగా తనతో ఫోన్లో ఈవిషయం చెప్పారన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, అధికారులకు ఆదేశాలు చేశారని ఆయన వివరించారు. -
బీఎల్వోలతో సమీక్ష
జ్యోతినగర్(రామగుండం): రామగుండం అ సెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో), సూపర్వైజర్లతో పోలింగ్ నిర్వహణ తీరుపై బుధవారం సమీక్షించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించా రు. ఆమె మాట్లాడుతూ, పోల్ స్లిప్పులను ప్రతీఓటరుకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలనానరు. ఓటింగ్ శాతం పేంచేలా కృషి చే యా లని కోరారు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్, బీఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. రైస్మిల్లులకు ధాన్యం తరలించండి సుల్తానాబాద్(పెద్దపల్లి): తూకం వేసిన వెంట నే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని అ దనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆదేశించా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్, సుగ్లాంప ల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కోత లేకుండా మి ల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు గోదావరిఖని: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల్లో విధుల నిర్వహణ కో సం ఉద్యోగులను కేటాయించాలని ఎన్నికల సంఘం సిగరేణి యాజమాన్యాన్ని కోరింది. ఈమేరకు సంస్థవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో సెక్యూరిటీ, క్లరికల్, జనరల్ మజ్దూర్లను ఏరియాల వారీగా కేటాయించనుంది. అన్ని ఏరియాల నుంచి సిబ్బందిని కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 ఏరియాల్లోని 1100మందిని ఎన్నికల విధులకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇ టీవల గుర్తింపు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్కుమార్.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని ఆన్డ్యూటీగా పరిగణించాలని కోరారు. ఈక్రమంలో ఆన్డ్యూటీగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ‘మోదీ పాలనను ప్రశ్నించాలి’ పెద్దపల్లిరూరల్: పదేళ్ల మోదీ పాలనలో అవినీతిపై ప్రజలు ప్రశ్నించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరా రు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నాయకుడు మాదన కుమారస్వామి, టీ పీఎఫ్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య త దితరులు బుధవారం కరపత్రం ఆవిష్కరించా రు. ప్రజల ఆకాంక్షలను కాదని ప్రధాని మోదీ ముస్లింలు, మంగళసూత్రాలు లాంటి అంశాల నే ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శించారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. నాయకులు రాజమల్లయ్య, మార్వాడి సుదర్శన్, గాండ్ల మల్లేశం, రామిళ్ల బాపు, రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మామిడితోటల పరిశీలన ధర్మారం(ధర్మపురి): ఈదురుగాలులతో కూడి న వడగళ్ల వర్షంతో నేలరాలిన మామిడితోటలను ఉద్యావనశాఖ అధికారి జ్యోతి బుధవారం పరిశీలించారు. బంజేరుపల్లి, గోపాల్రావుపేట, కటికెనపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఇప్పటికే తోటల్లోని మామిడికాయలు కోశారని, మిగిలిన కాయలు ఈదురుగాలులకు రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. నిర్భయంగా ఓటు వేయండి పెద్దపల్లిరూరల్: ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఏసీసీ కృష్ణ కోరారు. సాయుధ బలగాల కవాతను జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కు వినయోగించుకోవాలని ఆయన కోరారు. -
రైతులను ఆదుకోవాలి
పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయిన, సాగు నీరు అందక దిగుబడి రాని రై తుకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దబొంకూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మ నోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. నాయకులు మ ర్కు లక్ష్మణ్, రాములు, సంపత్, మిట్టపల్లి శ్రీనివా స్, నవీన్కుమార్, లక్ష్మీరాజం, రవి, రాజేశం, పోచమల్లు, అనిల్, తిరుపతి, నరేశ్, రాకేశ్ పాల్గొన్నారు.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి కోల్సిటీ(రామగుండం): ప్రజాసమస్యలపై గొంతెత్తాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో నగరపాలక పారిశుధ్య కార్మికులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి ఈశ్వర్ ఓట్లు అభ్యర్థించారు. -
స్ట్రాంగ్రూమ్లు సిద్ధం చేయండి
● పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: ఈవీఎం యూనిట్లలో సింబల్ లో డింగ్ చేసిన వాటికి సీల్చేసి స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని స్ట్రాంగ్రూమ్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన యూనిట్లను అడిషనల్ కలెక్టర్ శ్యా మ్ప్రసాద్లాల్తో కలిసి బుధవారం రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపర్చారు. ఈవీఎంలో గుర్తులు లోడ్ చేసి సీల్చేశామన్నారు. సింబల్ లోడింగ్ యూనిట్లను ఫలితాలు ప్రకటించిన తర్వాత నాలుగు రోజుల లోపు ఉంచుతామని వివరించారు. కలెక్టర్ ఏవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత పాల్గొన్నారు.స్ట్రాంగ్రూమ్లను సిద్ధం చేయాలి.. రామగిరి(పెద్దపల్లి): పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను భద్రపర్చేందుకు స్ట్రాంగ్రూమ్లను సిద్ధం చేయాలని, ఇదే సమయంలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. జేఎన్టీయూ లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్, దివాకరతో కలిసి ఆయన పరిశీలించారు. పార్లమెంట్లోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూలో చేపడతామన్నారు. -
ప్రకృతి కన్నెర్ర
● గాలిదుమారంతో కుప్పకూలిన వేదిక ● ముఖ్య అతిథి చేరకముందే ఘటన ● బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం మంథని: పార్లమెంట్ ఎన్నికల వేళ.. క్యాడర్లో జోష్ నింపి, ఓటర్లలో ఉనికి చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ పట్టణంలో మంగళవారం చేపట్టిన బహిరంగసభపై ప్రకృతి కన్నెర్ర జేసింది. కొద్దిరోజులుగా మంథనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయితే, వాతావరణంలో మంగళవారం ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లబడింది. ఇది తమకు శుభసూచకమని బీజేపీ క్యాడర్ ఆనందం వ్యక్తచేసింది. సరిగ్గా ఇదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారీగా జనసమీకరణ.. రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యే బహిరంగ సభ ఉదయం 9గంటలకు ఉంటుందని బీజేపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో జనాన్ని తరలించారు. కానీ, నిర్దేశిత సమయం కన్నా సుమారు ఐదు గంటలు ఆలస్యమైంది. దీంతో పలువురు వేదికపైనుంచి మాట్లాడుతూ, సభికులను ఉత్సాహ పరిచారు. ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఓవైపు మాట్లాడుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఆ తర్వాత మెల్లిగా గాలిదుమారం ప్రారంభమైంది. ఆ వెంటనే బీభత్సం సృష్టించింది. వేదిక వద్ద టెంట్లు గాలిదుమారం ధాటికి కుప్పకూలిపోయారు. తొలుత జనం కోసం వేసిన టెంట్లు, ఆ తర్వాత స్టేజీ వేసిన టెంట్లు, వేదిక నెలమట్టమైంది. తప్పిన పెనుప్రమాదం ఈదురుగాలులకు వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. టెంట్లకింద ఉన్న ప్రజలు పరుగులు తీశారు. మరికొందరు టెంట్లకు ఆవల ఉండడంతో ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఏదిఏమైనా బహిరంగ సభ ద్వారా తమ ప్రభావం చాటేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంపై ప్రకృతి కన్నెర్ర జేయడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు. -
అభివృద్ధికి మరిన్ని పథకాలు
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి మ రిన్ని పథకాలు ప్రవేశపెట్టేలా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో మంగళవారం మార్నింగ్ వాకర్స్ను కలిసి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. దివంగత నేత వెంకటస్వామి(కాకా) మనుమడు, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతిగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత రూ.36 కోట్లతో లక్ష్మీనగర్ ప్రాంత అభివృద్ధి ప్రారంభిస్తామని, రూ.15 కోట్లతో స్టేడియం అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా తదితరులు ఉన్నారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లిలో ఉపాధిహామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. నాయకులు సూర సమ్మయ్య, గంగాధర రమేశ్, ముక్కెర శ్రీనివాస్, పాత రవీందర్, మహేందర్, ఓడ్నాల రాజు పాల్గొన్నారు. బీ థర్మల్లో ఉత్పత్తి నిలిపివేత రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సా మర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తి నిలిపివేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు విద్యు త్ కేంద్రాన్ని ట్రిప్ చేశారు. వ్యవసాయ వినియోగం తగ్గడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు. -
టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి
● కొత్త కథ వినండి ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పెద్దపల్లిరూరల్: వేసవిలో పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు రూమ్ టు రీడ్ సంస్థ రోజుకో కొత్త కథ ఆడియో రూపంలో అందిస్తోందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రూమ్ టు రీడ్ ఉల్లాస సమయం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా రూమ్ టు రీడ్ సంస్థ.. ఐవీఆర్ఎస్ సాయంతో ఉల్లాసవంతమైన కొత్త కథలను ఆడియో రూపంలో అందిస్తోందని తెలిపారు. నీతి కథలు, పిల్లల కథలు వింటే చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని ఆయన అన్నారు. కొత్త కథల కోసం టోల్ ఫ్రీ నంబర్ 040– 4520–9722కు కాల్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ప్రతినిధులు నరసింహాచారి, పాఠశాల అకడమిక్ అధికారి షేక్, రీడ్ టు రూమ్ సంస్థ రాష్ట్ర ప్రతినిధులు తేజస్వి, మధు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు?
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథని: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అంటే బీజేపీకి అక్కసు ఎందుకని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని తన నివాసంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ను అడ్డుగా పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన సొమ్మును నిలిపివేయడం సరికాదన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల రోజు రైతుబంధు సొమ్ము జమచేస్తే ఆనా డు నోరు మెదపని బీజేపీ.. నేడు రైతుబంధు డబ్బు ఎందుకు ఆపిందని నిలదీశారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలపై రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందనేనిది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమ, టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఎంపీపీ కొండ శంకర్, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు పురుశోత్తంరెడ్డి పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్, ఎలిగేడులో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మంగళవారం పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల కో సం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. తాగునీ టి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించా రు. ఎంపీడీవో భాస్కర్రావు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు చేయండి ఎలిగేడు(పెద్దపల్లి): ఆయిల్పామ్ సాగుకు రై తులు ముందుకు రావాలని ఉద్యానవనశాఖ అధికారి జ్యోతి కోరారు. ముప్పిరితోటలో పెద్దపల్లి ఉద్యానవనశాఖ, రివులిస్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్పా మ్ సాగుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నా రు. త్వరలోనే పెద్దరాతిపల్లిలో ఆయిల్పామ్ శుద్ధి పరివ్రమ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఏఈవో పద్మ, ఫీల్డ్ఆఫీసర్ అభిలాష, రివులిస్ డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధి రహమాన్, కో ఆర్టినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎల్లంపల్లిలో 6.10టీఎంసీలురామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 141 మీటర్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 6.10 టీఎంసీలకు పడిపోయింది. చిన్నారుల విహారయాత్ర రామగుండం: స్థానిక తబితా ఆశ్రమంలోని చి న్నారులు వేసవి ఆటవిడుపు కోసం మంగళవా రం హైదరాబాద్లోని వండర్లా సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ తన సొంత నిధులు వెచ్చించడంతో చిన్నారు మానసిక ఆనందం కోసం వివాహర యాత్రకు తీసుకెళ్తున్నామని ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. -
జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్కు స్వాగతం
జ్యోతినగర్(రామగుండం): జ్యుడీషియల్ క మిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్కు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికా రు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్లోని జ్యోతిభవన్కు చేరుకున్న జస్టిస్ ఘో ష్కు కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్కు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా నియమితులైన విషయం విదితమే. ఈక్రమంలో ఆయన మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శించారు. అనంతరం ఎన్టీపీసీ జ్యోతిభవన్కు చేరుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
అకాలం.. అతలాకుతలం
జిల్లాలోని ధర్మారం, ఎలిగేడు, పెద్దపల్లి, రామగిరి, మంథని, ముత్తారం, ఓదెల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో కొను గోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయ్యింది. ఆ రబెట్టిన ధాన్యంతోపాటు తూకం వేసిన వడ్ల బస్తా లు వర్షపునీటిలో తడిశాయి. కొన్నిచోట్ల నీటిలో కొ ట్టుకుపోయాయి. ఎలిగేడు, ధర్మారం మండలాల్లో మామాడికాయలు రాళ్లవర్షం ధాటికి నేలరాలాయి. సౌకర్యాలు కరువు.. గ్రామాల్లో ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్కెట్ యార్డులతోపాటు, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ సౌకర్యాలేమీలేవు. ధాన్యం కుప్పలు పోసుకున్న రైతులకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. మంగళవారం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం తడిసిముద్దయ్యింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వడ్లను కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు ఉరుకులు, పరుగులు తీశారు. ఐదురోజుల పాటు భారీవర్షాలు రాష్ట్రంలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ. నుంచి 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. భారీవర్షాలు కురుస్తాయని, దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జూలపల్లిలో వర్షం.. జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది.కాల్వశ్రీరాంపూర్లో.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్లో ని గ్రామాల్లో కురిసిన భారీవర్షం, గాలిదుమారానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికి చేతికి అందివచ్చిన వరి పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. ఎలిగేడులో.. ఎలిగేడు(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లోని ధా న్యం తడిసింది. లాలపల్లిలో వడగళ్లవాన కురిసింది. వరిపైరు నేలవాలింది. అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపడ్డాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో..సుల్తానాబాద్రూరల్: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కురిసిన భారీవర్షానికి ధాన్యం తడిసిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన వడ్లను కాపాడుకునేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.ముత్తారంలో.. ముత్తారం(మంథని): మచ్చుపేటకు చెందిన కల వేన మల్లయ్య ఇంటి పైకప్పు రేకులు గాలిదుమారం ధాటికి కొట్టుకుపోయాయి. సమీపంలోని విద్యుత్ స్తంభానికి తగిలి ఆగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లక్కారం, మచ్చుపేట, మైదంబండ, సర్వారం, కేశనపల్లి, పారుపల్లి, ముత్తారం, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షం తమను ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెలలో.. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, కనగర్తి, గుంపుల ఐకేపీ కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కొలనూర్లో జక్కుల రాజ య్యకు చెందిన ఇంటి పైకప్పు గాలిదుమారానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఓదె ల, పొత్కపల్లిలోనూ కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు. పాలకుర్తి మండలంలో.. పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి. వడగళ్లవాన – విరిగిన చెట్లు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యంపై పరదాలు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై వెంటనే టార్పాలిన్లు కప్పడంతో ధాన్యం తడవలేదు. నిట్టూరు, మారేడుగొండ తదితర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. నిట్టూరులోని శ్మశానవాటిక పైకప్పు గాలి ధాటికి ఎగిరి పడింది. తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. రాఘవపూర్, రాగినేడు, ములసాల, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, సుల్తానాబాద్ మండలం కనుకులలోని సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఎస్ఈ సుదర్శనం తెలిపారు. సమస్యలు ఉంటే 79016 28367 నంబరుకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యం పరిశీలన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ సందర్శించారు. తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. వర్షం కురిసేలోపు టార్పాలిన్లు కప్పడంతో పెద్దగా తడవలేదని అధికారులు ఆయనకు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. పాక్షికంగా తడిసిన ధాన్యాన్ని ఆరబోయించి కొనుగోలు చేయాలన్నారు. మార్కెట్ కార్యదర్శి దేవరాజ్పృథ్వీరాజ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, సీఈవో మదన్మోహన్ ఉన్నారు. వడ్లు.. నీటిపాలు.. సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక వ్యవసాయ మార్కె ట్లో ఆరబోసిన ధాన్యం వర్షపునీటికి తడిసి ముద్దయ్యింది. ఇటుక బట్టీలకు తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి పరిశీలించారు. ధర్మారం కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపునీరు, తడిసిన ధాన్యంజిల్లా సమాచారం కొనుగోలు కేంద్రాలు 311 సేకరించిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,52,179 మిల్లులకు తరలించింది(మెట్రిక్ టన్నుల్లో) 1,50,908 కేంద్రాల్లో ఉన్న ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 1,271 బలమైన ఈదురుగాలులు ఆ వెంటనే ఉరుములు, మెరుపులు మధ్యాహ్నం దంచికొట్టిన అకాల వర్షం తడిసి ముద్దయిన ధాన్యం.. రాలిన మామిడికాయలు ధ్వంసమైన ఇళ్ల పైకప్పులు విద్యుత్ సరఫరాకు అంతరాయం మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు దంచికొట్టాయి. ఉక్కపోత తో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు జనాలను భయకంపితులను చేశాయి. మరోవైపు.. వర్షం, గాలుల ధాటికి కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉంచిన వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయి. మామిడికాయలు రాలిపోయాయి. చేతికి వచ్చిన పంటను వానదేవుడు హఠాత్తుగా తన్నుకుపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరయ్యాడు. – సాక్షి, పెద్దపల్లిధాన్యం కొట్టుకుపోయింది ధర్మారం కేంద్రంలో పోసిన దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యం నీటిలో కొట్టుకపోయింది. వర్షం తగ్గిన తర్వత మిగిలిన ధాన్యంపై కవర్లు కప్పిన. సరిపడా టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం నీటిలో కొట్టుకు పోయింది. – గుమ్ముల సతీశ్, రైతు, ధర్మారంధర్మారంలో.. ధర్మారం(ధర్మపురి): బంజేరుపల్లి, పెర్కపల్లి, కటికెనపల్లి, మల్లాపూర్, ఎర్రగుంటపల్లిలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5గంటల వరకు వడగళ్లవాన కురిసింది. మామిడి కాయలు నేలరాలాయి. ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఎర్రగుంటపల్లిలో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిపోయాయి. సరిపడా టార్పిలిన్లు ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని రైతులు వాపోయారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement