-
కమల దళంలో ఉత్సాహం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల ఔట్డోర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన బీజేపీ జనసభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగం కార్యకర్తలను ఆకట్టుకుంది. రేణుకా ఎల్లమ్మ దేవి అంటూ జేపీ నడ్డా తన ప్రసంగం మొదలు పెట్టడంతో యువత కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను, సోనియా, రాహుల్, ప్రియాంక మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుతోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓట్లేసి యువకుడైన సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మరో ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తొందరలోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే ఉంటారని తెలిపారు. నల్లగొండ సమస్యలపై దుమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. తాను 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నానని, ఎక్కడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నల్లగొండ బీజేపీ గడ్డ అని, కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ యువతకు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తానని తెలిపారు. రేవంత్రెడ్డి గాడిద గుడ్డు చూపిస్తున్నారని.. ఆయన ఇచ్చిన హామీలు మహిళలకు రూ.2500, యువతుల పెళ్లిల్లకు తులం బంగారం, రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రూ.12 వేలు, ఆరు గ్యారంటీలు ఎందుకు హామీ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. జిల్లాలో వారసత్వ రాజకీయాలను తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, చాడ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్రెడ్డి, నూకల నరసింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, జుట్టుకొండ సత్యనారాయణ, కంకణాల నివేధిత, పోతెపాక సాంబయ్య, లాలూనాయక్, సాధినేని శ్రీనివాసరావు, పెరిక మునికుమార్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ జనసభకు భారీగా తరలివచ్చిన కాషాయ పార్టీ శ్రేణులు ఫ కార్యకర్తలను ఆకట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రసంగం ఫ సైదిరెడ్డి గెలుపుతోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు ఇబ్బందులు కలగొద్దు
నల్లగొండ : పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా హెల్ప్ డెస్క్, టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవి తదితర అధికారులు ఉన్నారు. పోస్టల్, హోం ఓటింగ్లో పాల్గొన్న 5555 మంది హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 5555 ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోం ఓటింగ్లో 883 మంది వృద్ధులు ఓటు వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 750 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1258 మంది దివ్యంగ ఓటర్లకుగాను ఇప్పటివరకు 1173 మంది ఓటు వేశారు. అత్యవసర సేవలు అందించే వారు 62 మందికిగాను 32 మంది ఓటు వేశారు. జిల్లాలోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా సోమవారం ఒక్క రోజే 2,877 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసిన అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు నాలుగు హాల్స్ ఏర్పాటు చేసి ప్రతి హాల్లో 25 టేబుల్స్ వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో స్ట్రాంగ్ రూం, రూఫ్ సరిగా వచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హరిచందన -
విధుల కేటాయింపులో అవకతవకలు లేవు
నల్లగొండ : ఎన్నికల విధుల కేటాయింపు విషయంలో కొందరు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే డ్యూటీలు క్యాన్సిల్ చేశారట. ఎన్నికల విధులకు సరిపడా సిబ్బంది ఉండటంతోనే మరికొందరికి అసలు డ్యూటీలే వేయలేదట! ఇదీ ఉద్యోగులకు ఎన్నికల విధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగం అనుసరించిన తీరు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులే చెప్పడం విశేషం. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వారికి, రెండు నెలల్లో రిటైర్మెంట్ ఉన్నవారికి, బాలింతలు, గర్భిణులకు డ్యూటీలు వేశారని.. ఈనెల 5న ‘సాక్షి’లో ‘ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మ్యాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, డీఆర్డీఓ నాగిరెడ్డి స్పందించి పై విషయం చెప్పుకొచ్చారు. ఎన్నికల విధుల కేటాయింపుల్లో ఎక్కడా అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. కానీ, సమస్యలు ఎదుర్కొంటున్న వారికి డ్యూటీలు ఎలా వేశారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు. ధ్రువీకరణ పత్రాల ఆధారంగా.. ● నార్కట్పల్లి మండలంలో వివిధపాఠశాలల్లో పని చేస్తున్న 22 మందికి విధులు కేటాయించలేదని.. ఇందులో 15 మందికి వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా విధుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సరిపడా సిబ్బంది ఉన్నందున మిగిలిన ఏడుగురికి విధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ● కనగల్ మండలంలో ఏడుగురికి విధులు కేటాయించలేదని.. ఇందులో ముగ్గురికి వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మినహాయింపు ఇచ్చామని, మిగిలిన వారికి అసలు విధులు కేటాయించలేదని తెలిపారు. ● గుర్రంపోడు మండలంలో 17 మందికి విధులు కేటాయించలేదని అందులో 16 మంది వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని.. అక్కడ కూడా ఒకరికి విధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఫ మ్యాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, డీఆర్డీఓ నాగిరెడ్డి ఫ రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినవారికి మినహాయింపు ఇచ్చామని వెల్లడి ఫ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి విధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వని అధికారి -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
యాదగిరిగుట్ట: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లికి చెందిన బూడిద యాదయ్య– దేవమ్మ కూతురు నాగమణి (25) వివాహం జనగామ జిల్లా నాగారం గ్రామానికి చెందిన గడిపే ప్రవీణ్తో 2020 మార్చి 18న జరిగింది. ప్రవీణ్ నాగారంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. నాగమణి– ప్రవీణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త ప్రవీణ్, మామ సాయిలు, అత్త జానమ్మ కొన్నేళ్లుగా నాగమణిని మానసికంగా వేధించడంతోపాటు వరకట్నం కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగమణి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నాగారం వెళ్లి పంచాయితీ సైతం పెట్టారు. అయినా భర్త, అత్త, మామల్లో మార్పు రాకపోగా వరకట్నం కోసం మరింత వేధించసాగారు. ఇటీవల నాగారంలో నాగమణిని భర్తతోపాటు అత్త, మామలు కొట్టి, తీవ్రంగా వేధించారు. దీంతో నాగారంలోని అత్తగారి ఇంటి నుంచి నాగమణి, ఇద్దరు పిల్ల లను ఆమె తల్లిదండ్రులు గత శుక్రవారం యాదగిరిపల్లికి తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా భర్త ప్రవీణ్ తరచూ ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదగిరిపల్లిలో ఇంటి వద్ద ఉన్న వ్యవసాయబావిలో దూకింది. అదే సమయంలో యాదగిరిపల్లిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బావిలో నాగమణి దూకిన విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రభాకర్, డ్రైవర్ శంకర్ బావిలోకి దిగి నాగమణిని బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న నాగమణికి సీపీఆర్ చేశారు. అనంతరం ఆమెను ప్రైవేట్ వాహనంలో యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భువనగిరి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు నాగమణి మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేష్ వెల్లడించారు. మృతురాలికి మూడేళ్ల కుమారుడు, తొమ్మిది నెలల పాప ఉందని సీఐ పేర్కొన్నారు. వ్యవసాయ బావిలో దూకిన మహిళ బయటకు తీసి సీపీఆర్ చేసిన అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు చికిత్స పొందుతూ మృతి యాదగిరిపల్లిలో ఘటన -
విద్యాశాఖ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి
నల్లగొండ: టెట్పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆటంకంగా ఉన్న టెట్పై ఎన్సీటీఈ వివరణ తీసుకోవాలని కోరారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్సీటీఈ నుంచి వివరణ తీసుకుని, ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్రెడ్డి, జిల్లా కార్యదర్శి నలపరాజు వెంకన్న, మురళయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ఎరనాగుల సైదులు, రాజశేఖర్, రమణ, ప్రభాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement