-
ప్రజల గొంతుౖనై పోరాడా..
‘ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా.. రాబోయే కాలంలోనూ సేవ చేయాలనే భావన నాలో ఉంది. నన్ను గెలిపించిన ప్రతీసారి ఖమ్మం జిల్లా, రాష్ట్ర ప్రజల గొంతుౖనై పార్లమెంట్లో మాట్లాడా. ప్రజల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావనకు రావాలంటే నామ నాగేశ్వరరావుతోనే సాధ్యమవుతుంది. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. రైతు బిడ్డను, ఖమ్మం బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలి. నాపై పోటీకి వచ్చిన వారెవరో ఆలోచన చేయాలి’ అని ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కోరారు. సోమవారం నామ ‘సాక్షి’కి ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, ఖమ్మంపదేళ్లలోనే అభివృద్ధి.. భద్రాచలం – కొవ్వూరు రైల్వేలైన్ కోసం అనేక పోరాటాలు జరిగాయి. 40 ఏళ్ల నుంచి ఈ డిమాండ్ వింటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు రైల్వేలైన్ మంజూరైంది. 2012 రైల్వే బడ్జెట్లో పెట్టించాం. బయ్యారం ఉక్కు ప్రైవేటీకరించకుండా పార్లమెంట్లో పోరాడి అడ్డుకున్నా. బయ్యారం ఐరన్ఓర్ మైన్స్ను కాపాడింది నేనే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఏపీ పునర్విభజన బిల్లులో ఉన్న పెండింగ్ సమస్యలపై రాబోయే కాలంలో పోరాడుతా. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చా. మారుమూల గ్రామాల్లోనూ రోడ్లు ఉండేలా చూశాం. అలాగే తాగునీటి సరఫరా ఇప్పుడు మెరుగైంది. గత పదేళ్లలో మా నాయకుడు కేసీఆర్ హయాంలో విపరీతమైన అభివృద్ధి జరిగింది. గ్రామాలైనా, పట్టణాలైనా అభివృద్ధిని ప్రజలు చూసింది ఈ పదేళ్లలోనే. ఇంకా చేయాల్సి ఉంది. -
ఓటు వేసిన 5,964మంది
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు సోమవారం నాటికి 3,633 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అలాగే, 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలకు సంబంధించి ఉద్యోగులు 2,331మంది ఓటు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 5,964 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల స్థానానికి 13మంది నామినేషన్లు నల్లగొండ: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి, టీడీపీ నుంచి ముండ్ర మల్లికార్జునరావు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్, నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి కర్ని రవి సమర్పించారు. అంతేకాక స్వతంత్రులగా పులిపాక సుజాత, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతికుమార్, అయితగోని రాఘవేంద్ర, బక్క జడ్సన్, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్కుమార్, దేశగాని సాంబశివరావు తమ నామినేషన్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్.మహేందర్కు అందజేశారు. -
రైలునుంచి పడి వ్యక్తి మృతి
మధిర: జిల్లాలోని తొండల గోపవరం – మధిర రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి రాత్రి గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ మధిర ఔట్పోస్ట్ ఇన్చార్జ్ ఎస్.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. మృతుడికి ఆచూకీ తెలిసిన వారు 87126 58589, 87126 58607 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంప్ గోడ కూలి వ్యక్తి... కూలీ కోసం వచ్చిన కుటుంబంలో విషాదం సత్తుపల్లిరూరల్: నిర్మాణంలో ఉన్న సంప్ గోడ కూలి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కామరాజుపేటకు చెందిన శ్రీకాకుళపు శ్రీరామమూర్తి(45) యాతాలకుంటలోని సీతారామ ప్రాజెక్టు టన్నెల్ ఓబీ పనుల్లో కూలీగా వచ్చాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం గది వద్ద బ్రష్ చేస్తూ ఆదివారం నిర్మించిన నీటి సంపు గోడ వద్ద నిలబడగా అది కూలిపడింది. దీంతో శ్రీరామమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్ల లు ఉండగా.. ఘటనపై సత్తుపల్లి సీఐ టి.కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వడదెబ్బతో వ్యక్తి మృతి ఎర్రుపాలెం: మండలంలోని పెద్దగోపవరానికి చెందిన రాసమంటి వెంకటకృష్ణ(45) వడదెబ్బతో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఆయన మృతి చెందగా సోమవారం విషయం వెలుగుచూసింది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం... పశువుల కాపరిగా పనిచేస్తున్న వెంకటకృష్ణ ఆదివారం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతుకుతుండగా, సోమవారం ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ సమీపాన కొందరు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహం వెంకటకృష్ణదిగా గుర్తించి కుటుంబీకులకు తెలిపారు. ఖమ్మంలో వృద్ధురాలు.. ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం త్రీటౌన్ ప్రకాష్నగర్కు చెందిన సోమారపు వెంకటమ్మ(85) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈమేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు సోమవారం ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించి వెంకటమ్మ కుమారుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ కార్యవర్గ సభ్యుడు సుధీర్కుమార్ను పరామర్శించారు. చాంబర్ గౌరవ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నాయకుడు.. ఖమ్మంరూరల్: మండలంలోని కామంచికల్కు చెందిన సీపీఐ నాయకుడు జి.లక్ష్మయ్య(75) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు సీపీఐ నాయకులు దండి సురేష్, పుచ్చకాయల కమలాకర్ తదితరులు లక్ష్మయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. సీపీఎం నాయకురాలు, శతాధిక వృద్ధురాలు... ఖమ్మంరూరల్: మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సీపీఎం నాయకురాలు, శతాధిక వృద్ధురాలు లింగనబోయిన పెద్దపుల్లమ్మ(103) సోమవారం మృతి చెందింది. ఈమేరకు ఆమె మృతదేహం వద్ద సీపీఎం జిల్లా, మండల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, నండ్ర ప్రసాద్ నివాళులర్పించారు. ఈ ప్రాంతంలో పేదల సమస్యలపై పోరాడిన పెద్దపుల్లమ్మ సేవలు మరువలేనివని తెలిపారు. నాయకులు వేగినాటి వెంకటనారాయణ, చావా నాగేశ్వరరావు, సూరిబాబు, పి.సత్యనారాయణ, ఏపూరి వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
● గాలివానకు విరిగిన స్తంభాలు, కూలిన ట్రాన్స్ఫార్మర్లు ● పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులుఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వైపరీత్యంతో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురవగా.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో పాటు విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఇక పందిళ్లపల్లి, ధంసులాపురం మధ్య 33 కేవీ టవర్లు ధ్వంసం కావడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు 205 స్తంభాలు కూలిపోగా, 13 డీటీఆర్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సంస్థకు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. సోమవారం నాటికి ఇందులో పలు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను సరిచేసి సరఫరా పునరుద్ధరించారు. ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ పర్యవేక్షణలో ఉద్యోగులు యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యుత్ సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు ఎస్ఈ తెలిపారు. వైర్లు తెగిపడినా, సమస్య తలెత్తినా సమస్యల 94408 11525 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వండి ప్రకృతి వైపరీత్యంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జిల్లాలో కోత దశలో ఉన్న మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించగా ఇప్పటికే ప్రాథమిక నివేదిక రూపొందించిన అధికారులు మంగళవారం నుంచి సర్వే చేయాలని నిర్ణయించారు. -
అంతకు మించి...
● జిల్లాలో గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం ● గత ఏడాదితో పోలిస్తే మరింత పైకి... ● గృహ వినియోగమే అధికం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైన విద్యుత్ శాఖఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కొద్ది రోజులుగా కేటాయింపు(కోటా)కు మించి జిల్లాలో వినియోగం నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. అక్కడక్కడ బోర్లు, బావుల కింద పంటలు సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 1.85 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. కానీ ఎండల కారణంగా ఇళ్లలో ఉపకరణాల వాడకం ఎక్కువవడంతో గృహ విద్యుత్ వినియోగం మాత్రం గణనీయంగా నమోదవుతోంది. మండుతున్న ఎండలు ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా.. రాష్ట్రంలోకెల్లా జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలంతా 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈనెల 1న ఏకంగా 17 ప్రాంతాల్లో 45 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తుండగా జిల్లాకు కేటాయించిన దానికి కన్నా విద్యుత్ వినియోగం జరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా ఖమ్మం టౌన్ డివిజన్లో వినియోగం నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 4.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగాల్సి ఉండగా, 5.80 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు జిల్లా కోటా 14.19 మిలియన్ యూనిట్లు కాగా, 17.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఇక 4, 5వ తేదీల్లో అదే పరిస్థితి ఉన్నా 6వ తేదీ సోమవారం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మే నెలంతా ఎండలు మండిపోనుండడంతో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిలో నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే మరింత గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం భారీగా పెరగడానికి వర్షాబావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలే కారణమని తెలుస్తోంది. గత ఏడాది జిల్లాకు కేటాయించిన కోటా కన్నా తక్కువ వినియోగమే నమోదైంది. కానీ ఈసారి అంతకు మించి వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు 6.60 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గృహ కనెక్షన్లు 4.75 లక్షలు, వ్యవసాయ రంగంలో 1.13 లక్షలు, వాణిజ్య కనెక్షన్లు 57 వేలు, పరిశ్రమలకు 875 కనెక్షన్లు, ఇతరత్రా 11 వేలకు పైగా ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది గృహ కనెక్షన్ల విద్యుత్ వినియోగమే పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అవాంతరాలు లేకుండా.. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు అవాంతరాలు లేకుండా సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గడిచిన ఏడాదిలో జిల్లాలోని పమ్మి, అల్లీపురంతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్లు నిర్మించారు. అయినా ఖమ్మం నగర విస్తీర్ణం పెరిగి అంతరాయాలు చోటు చేసుకోవడంతో మమతా రోడ్డులోని సబ్ స్టేషన్లో 5 ఏవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇక ఏడాది కాలంగా జిల్లాలో 441 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయగా.. అంతరాయం లేకుండా సరఫరాకు అధికారులు కృషి చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఈ ఏడాది గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం. ప్రస్తుతం నిత్యం ఒక మిలియన్ యూనిట్ల మేర అదనపు విద్యుత్ వినియోగం నమోదవుతోంది. – ఏ.సురేందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ గత ఏడాది, ఈ ఏడాది విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో) ఏడాది మార్చి ఏప్రిల్ 2023 161.40 202.19 2024 175.65 225.19 ఈనెలలో జిల్లా కోటా, వినియోగం (మిలియన్ యూనిట్లలో) తేదీ కోటా వినియోగం 01 4.73 5.65 02 4.73 5.79 03 4.73 5.80
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement