-
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
● కలెక్టర్ యాస్మిన్ బాషా జగిత్యాల: లోక్సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. ఇప్పటివరకు 1430మంది ఓటర్లు దరఖాస్తు చే సుకున్నారని, 660మంది మాత్రమే పోస్టల్ బ్యాలె ట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం జరి గిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వంమేడిపల్లి: కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మోత్కురావుపేట, రాజలింగంపేట్, పసునూరు, గోవిందారం, దేశాయిపేట, ఈదుల లింగంపేట, మాన్నెగూడం, కమ్మరిపేట, వెంకట్రావుపేట, రాగోజీపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాజేందర్రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. పలువురు పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నా రు. పార్టీ మండల అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, రమేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, మార్గం నర్సరెడ్డి, సాయిని గంగారెడ్డి, మాదం వి నోద్, రేండ్ల మధు, భర్కం రాజశేఖర్ పాల్గొన్నారు. -
విద్యుత్లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ సూచించారు. గతనెల 18 నుంచి ఈనెల 6 వరకు జిల్లాకేంద్రంలో 451మంది విద్యుత్ సిబ్బందికి బ్యాచ్ల వారీగా అంతర్గత శిక్షణ అందించారు. ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో లోడ్ పెరిగే అవకాశం ఉన్నందున చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లైన్ల మరమ్మతు పనులు చేసుకోవాలని సూచించారు. శిక్షణ ఇచ్చిన టెక్నికల్ డీఈ గంగారాం, మెట్పల్లి ఏడీఈ మనోహర్, లైన్ ఇన్స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు. టెక్నికల్ ఏడీఈ నగేశ్కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అందించండి
● నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్రెడ్డిసారంగాపూర్: ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులను ఓటరుకు అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్రెడ్డి అన్నారు. సోమవారం బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిప్పల్ల గంగరాజం తన అనుచరులతో కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి, నాయకులు ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి
కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కొనసాగాలంటే బీజేపీని ఓడించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి మద్దతుగా కోరుట్లలో పర్యటించారు. పట్టణంలోని జువ్వాడి భవన్లో మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, సీఎంలను ఐటీ, ఈడీ దాడులతో జైలుపాలు చేస్తోందని విమర్శించారు. దేశాన్ని మతోన్మాదం వైపు నడిపించిన వ్యక్తికి భారతరత్న బిరుదును ఇంటికెళ్లి ఇవ్వడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దేశంలో సబ్కా సాత్, సబ్కా వికాస్ ఎక్కడుందో మోదీ చెప్పాలన్నా రు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ తిరుమల గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
అంతా నకిలీమయం
● మోసపోతున్న జనం ● కనిపించని అధికారుల తనిఖీలుజిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్, బైపాస్ రోడ్లలో నిర్వహిస్తున్న శానిటరీ దుకాణాల్లో నకిలీ పైపులు గుర్తించారు. ఆశీర్వాద్ బ్రాండెడ్ కంపెనీకి చెందిన పైపులను అదే పేరుతో నకిలీవి విక్రయించగా.. ఒరిజినల్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల తనిఖీలు నిర్వహించి నకిలీవిగా గుర్తించారు. ఆ రెండు షాపులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఓ సూపర్ మార్కెట్లో ఓ బ్రాండెడ్ కంపెనీకి చెందిన నకిలీ చాయ్పత్తి అమ్ముతున్నారని కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించగా.. అవి నకిలీవని తేలింది. జగిత్యాల: ప్రస్తుత హైటెక్ యుగంలో తినే వాటిలోనే అంతా కల్తీ జరుగుతుండగా.. తాజాగా ప్రతి వస్తువు నకిలీవే ఉంటున్నాయి. ముఖ్యంగా తినే వస్తువులైన బియ్యం, పప్పు, ఉప్పు, నూనెల్లో అత్యధికంగా కల్తీ జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇవేకాకుండా ఇంటి నిర్మాణానికి వాడే పైపులు, సాధారణంగా వినియోగించే ఫెవిక్విక్లు, పెన్సిళ్లు, శానిటరీకి సంబంధించిన వస్తువులు మార్కెట్లో నకిలీవి విరివిగా అమ్ముతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా నకిలీ వస్తువులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. శానిటరీ, కిరాణం, సూపర్ మార్కెట్లు, షాపుల్లో ఇవి అత్యధికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. శానిటరీ షాపుల్లో విక్రయిస్తున్న పైపులు, కరెంట్ పైపులు, ఇతరత్రా వస్తువులన్నీ నకిలీవి అంటగడుతున్నారు. గతంలో టవర్ సర్కిల్లో ఓ హోల్సేల్ షాపులో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన చాయిపత్తి ప్యాకెట్లు సైతం విక్రయించగా.. ఆ కంపెనీకి చెందినవారు గుర్తించి పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ శానిటరీ షాపుతోపాటు ఎలక్ట్రికల్ షాపుల్లో నకిలీవి అమ్ముతున్నారని గుర్తించిన ఒరిజినల్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ లాంటి బ్రాండ్లతోనే వీటిని సైతం ముద్రించి అలాగే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. శానిటేషన్, ఎలక్ట్రికల్ వస్తువులే ఎక్కువ.. జిల్లా కేంద్రంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారికి శానిటరీ, ఎలక్ట్రికల్ వస్తువులు ఖచ్చితంగా అవసరముంటాయి. కొనుగోలు చేసుకునే యజమానులు నకిలీ ఏవో, అసలివి ఏవో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ కంపెనీకి చెందిన పైపులు, ఎంసిల్స్ నకిలీవి పట్టుబడ్డాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు. డిస్కౌంట్ల పేరుతో ఆఫర్లు చూపుతూ కొందరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. దీంతో మన్నిక లేనివి కావడంతో కొద్దికాలమే నిలువ ఉండి చెడిపోయే అవకాశాలున్నాయి. నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఎక్కువగా పైపులైన్ నిర్మాణం, కరెంట్ వైరింగ్ అండర్ గ్రౌండ్లో వేస్తుంటారు. ఒకసారి అండర్ గ్రౌండ్లో పైపులు వేశామంటే.. మళ్లీ తీయలేని పరిస్థితి ఉంటుంది. ఇవి మన్నిక లేనివి కావడంతో తొందరగా చెడిపోయి మళ్లీ ఇల్లు గోడలను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకొని నిఘా పెంచాలని కోరుతున్నారు. సంబంధిత ఒరిజినల్ కంపెనీలు నిర్వాహకులు సైతం తమ వాటితో పోలిన వస్తువులను విక్రయిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతీది గమనించి కంపెనీవా కాదా అని తెలుసుకొని కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. తినుబండారాలకు సంబంధించినవి అనారోగ్యంపాలుజేస్తే, నకిలీ వస్తువులేమో నూతనంగా నిర్మించే ఇళ్లకు ముప్పు తెస్తున్నాయి. ఏదేమైనా నాణ్యత లేని ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
విద్యుదాఘాతానికి ఏనుగు బలి
లాక్ డౌన్లో ఏం జరిగింది?
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement