-
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ, అలాగే తెలంగాణలోనూ లోక్సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్ఫోన్తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు.మీ సెల్ఫీ గ్యాలరీల కోసం 👇 క్లిక్ చేయండిమేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు) -
Elections 2024: మొదలైన మాక్ పోలింగ్
హైదరాబాద్, గుంటూరు/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్పై బూత్ ఏజెంట్స్కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు.ఉదయం 7 గం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. -
రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది. -
లోక్సభ పోరు నేడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగించనున్నారు. ఈ మేరకు పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ ప్రకటించారు. బరిలో 525 మంది..: లోక్సభ ఎన్నికల్లో 1,65,28,366 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,32,32,318 మంది ఓటేయనున్నారు. 17 లోక్సభ స్థానాల నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. ఇందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఎన్నికల సిబ్బంది సంబంధిత లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్కు తీసుకెళ్లి ఈవీఎంలను అప్పగిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. గందరగోళ పడకుండా ఓటేయండి..: సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో 7 లోక్సభ స్థానాల పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లతో, 9 లోక్సభ స్థానాల పరిధిలో రెండు బ్యాలెట్ యూనిట్లతో, ఒక లోక్సభ స్థానంలో ఒక బ్యాలెట్ యూనిట్తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. ఈవీఎంలో అభ్యర్థుల క్రమాన్ని పోలింగ్ బూత్ల బయట ప్రదర్శనకు పెట్టనున్నట్టు సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్.. రాష్ట్రంలో మొత్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్ట్యాప్లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఆ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి అప్పగిస్తారు. గడువు ముగిసే సరికి.. క్యూలో ఉంటే ఓటేయవచ్చు.. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అలా క్యూలో ఉన్నవారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునేవారికి ఓటేసేందుకు అవకాశం ఉండదు. ఎండ పెరగక ముందే ఉదయమే ఓటేస్తే మంచిదని.. వానలతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం ఊరట కల్పించే అంశమని అధికారులు చెప్తున్నారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆదివారం రాత్రే తరలించామని అధికారులు వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించనున్నారు. 10 మంది ఓటర్లకే పోలింగ్ కేంద్రం ఈసారి అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అత్యల్పంగా 10 మంది, 12 మంది, 14 మంది ఓటర్లున్న మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 25మందిలోపు ఓటర్లున్నవి 11, 50 మందిలోపు ఉన్నవి 22, 100 మంది లోపు ఉన్నవి 54 పోలింగ్ కేంద్రాలు ఉండటం గమనార్హం. హోరాహోరీగా పోరు! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గట్టిగా పోరాడినా అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్, కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. 16 లోక్సభ స్థానాల్లో మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడనుండగా.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో.. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. -
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ, అలాగే తెలంగాణలోనూ లోక్సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్ఫోన్తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రతా చర్యలు
సికింద్రాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు తరలి వెళ్లేందుకు పెద్దసంఖ్యలో ప్రయాణికులు రైల్వేస్టేషన్కు తరలివస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించడం, గందరగోళ పరిస్థితులు నివారించడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు శనివారం ప్రత్యేక చర్యలు అమలులోకి తెచ్చారు. ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ బీఎస్ సరస్వత్ నేతృత్వంలో 60 మంది అదనపు రక్షణ బలగాన్ని రైల్వేస్టేషన్కు తరలించారు. రైళ్లు వచ్చి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రయాణికుల క్యూలైన్లు ఏర్పాటు చేసి గందరగోళ పరిస్థితులను నివారిస్తున్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు గస్తీని పెంచారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా 139 టోల్ఫ్రీ నంబర్కు డయల్ చేసి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. -
ప్రత్యామ్నాయంగా..
12 రకాల గుర్తింపు కార్డులకు ఈసీ అనుమతి సాక్షి, సిటీబ్యూరో: ఓటరు జాబితాలో పేరుండి, గుర్తింపు కార్డు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటి చూపించినా ఓటు వేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. చాలా మందికి ఎపిక్ కార్డులు లేకపోవడంతో కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఇటువంటి వారి కోసం ఎన్నికల సంఘం అనుమతి పొందిన ఏ గుర్తింపు కార్డు తెచ్చినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తారు. మరోవైపు ఓటు ఉన్నా పోలింగ్ బూత్ వివరాలు తెలియని వారు 1950 నంబరుకు ఎపిక్ నంబర్ను ఎస్ఎంఎస్ చేస్తే పూర్తి వివరాలు రిజిస్టర్ మొబైల్ నంబరుకు వస్తాయి. లేదా www. ceotelangana.nic.in వివరాలు తెలుసుకోవచ్చు. ● ఆధార్ కార్డు ● డ్రైవింగ్ లైసెన్సు ● పాన్ కారు్డ ● భారత దేశ పాస్పోర్టు ● ఉపాధి హామీ జాబ్ కార్డు ● దివ్యాంగుల గుర్తింపు కార్డు ● ఫొటోతో కూడిన పింఛను పత్రాలు ● కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు ● ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు ● పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్ పుస్తకం ● కార్మిక శాఖ జారీ చేసిన ఇన్సూరెన్సు కార్డు ● ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం -
వివాదాలు.. సంచలనాలు.. కేసులు
హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని ఆయా పార్టీల నేతలు చేసిన ప్రసంగాల్లోని వ్యాఖ్యలు సంచలనాలుగా మారాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్కౌర్ తన ప్రసంగంలో పోలీసులు 15 సెకన్లు మౌనంగా ఉంటే ఒవైసీ బ్రదర్స్ను ఏం చేస్తామో చేసి చూపిస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆమైపె పోలీసు కేసు నమోదైంది. బీజేపీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ప్రచారాల్లో ప్రస్తావించారు. సామాన్య జనంపై ట్యాక్స్లు పెంచుతూ కార్పొరేట్లపై తగ్గిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు సైతం మోదీ హయాంలో చేసినన్ని అప్పులు .. దేశంలోని మిగతా ప్రధానులందరి హయాంలో కూడా కాలేదని విమర్శించారు. అంతేకాదు ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును తన మిత్రులకు లాభం చేసేందుకేనని ఆరోపించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందనీ హెచ్చరించారు. -
ఓటు ఎటో!
ఆశల పల్లకిలో..ఓటర్లు కోరిందల్లా ఇచ్చేందుకు తాము సిద్ధమని నాయకులు ప్రకటిస్తుండగా.. ఎన్నో ఏళ్ల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఓటు వేయబోమంటూ ప్రజలు భీష్మించుక్కూర్చుంటున్నారు. దీంతో ఓటర్లను బుజ్జగించే కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కొన్ని కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్లు రకరకాల కోరికలను అభ్యర్థుల ముందు పెడుతున్నాయి. తమ అపార్ట్మెంట్కు పూర్తిగా రంగులు వేయించాలని ఉప్పల్కు చెందిన ఒక కాలనీ వాసులు ఒక ప్రధాన పార్టీ అభ్యర్థిని డిమాండ్ చేశారు. అందుకోసం రూ.2 లక్షలు ఖర్చవుతుందని అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు చాలా చోట్ల వివిధ కాలనీలకు చెందిన నాయకులు కాలనీ ఓట్లన్నీ తమ చేతుల్లోనే ఉన్నాయంటూ అభ్యర్ధులతో బేరాలకు దిగుతున్నారు. ‘అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. వా ళ్లు గెలిచినా, ఓడినా మళ్లీ కనిపించరు కదా. ఇప్పుడు ఆశించింది రాబట్టుకోవడం మ ంచిది’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన ఒక కాలనీ నాయకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బేరసారాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా నాయకులు సైతం ముందంజలోనే ఉన్నారు. ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం అనివార్యమైనప్పుడు అభ్యర్థులు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు పేర్కొనడం గమనార్హం. మరోవైపు తమకు ఎంతో నమ్మకమైన వ్యక్తుల ద్వారానే నగదు, మద్యంపంపకాలు చేసేందుకు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. తమ గెలుపు నల్లేరు మీద బండి నడక అని భావించే నాయకులు కూడా పోల్ మేనేజ్మెంట్పైనే ఆశలు పెట్టుకోవడం గమనార్హం. మరోవైపు సోమవారం జరగనున్న ఎన్నికల్లో బూత్స్థాయిలో పని చేసే ఏజెంట్లు కూడా కీలకం. దీంతో వీరిని సమాయత్తం చేయడంపైనా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. -
No Headline
ఎల్బీనగర్లో..కౌంట్డౌన్ స్టార్ట్. మరో 24 గంటల్లో గ్రేటర్ ఓటర్లు బ్యాలెట్ బాక్సులో తమ తీర్పును నమోదు చేయనున్నారు. గల్లీ సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో కిర్రాక్ పుట్టించిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పైన దృష్టి సారించాయి. ఓటరును ప్రసన్నం చేసుకొనేందుకు పంపకాల ఘట్టానికి తెరలేపాయి. ఔర్ ఏక్ బార్ అన్నట్లుగా శనివారం సాయంత్రం 6 గంటలకే అధికారికంగా ప్రచారం ముగిసినప్పటికీ.. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కాలనీలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాల పెద్దలతో శనివారం రాత్రి జోరుగా విందు సమావేశాలు జరిగాయి. నగరమంతటా నిఘా మోహరించి ఉండడంతో అపార్ట్మెంట్లలోనే ‘పార్టీలు’ సమావేశమయ్యాయి. పంపకాలకు సైతం పలు చోట్ల అపార్ట్మెంట్లే కేంద్రంగా మారాయి. నగదుతో పాటు మద్యం బాటిళ్లను సైతం పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఆదివారం కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుందని పలు పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు. పలుచోట్ల త్రీస్టార్ హోటళ్లు. రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు సైతం కిటకిటలాడాయి. –సాక్షి, సిటీబ్యూరోసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద..ఓటు పాట్లుఅంతిమ నిర్ణయం ఓటరుదే.. పార్టీలు ఇచ్చే తాయిలాలు, నజరానాలు, నగదు, మద్యం సంగతి ఎలా ఉన్నా చివరకు ఏ ఓటరు ఎటు వైపు మొగ్గు చూపుతాడో తెలియదు. ఏ పార్టీకి పట్టం కడతాడో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఉద్ధృతంగా ప్రచారం చేసిన అన్ని పార్టీలు తాము తప్పనిసరిగా గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాయి. లోక్సభలో అడుగుపెట్టబోతున్నామనే అంచనాలతోనే అభ్యర్థులు కలలు కంటున్నారు. ఆ కలలు ఏ తీరాలకు చేరుతాయో తెలియాలంటే మే 13న నమోదు కానున్న తీర్పు కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. -
ఓటేయండి.. రాయితీ పొందండి
గ్రేటర్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలూ నడుం బిగించాయి. రకరకాల ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కమ్యూనిటీ యాప్ ర్యాపిడో ఓటర్లను పోలింగ్ రోజున ఉచితంగా సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఓటర్లు ర్యాపిడో యాప్లో ‘ఓట్ నౌ’ కోడ్ను ఉపయోగించి ఉచితంగా బైక్, ఆటో, క్యాబ్ సేవలను అందుకోవచ్చు. తాజాగా అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ఓటర్లకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. వేలిపై సిరా చుక్కను చూపిస్తే వండర్లా టికెట్పై 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15 తేదీల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వండర్లా హాలీడేస్ ఎండీ అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రముఖ డైనింగ్ ఔట్ ఫ్లాట్ఫాం స్విగ్గీ డైన్ఔట్ భోజన ప్రియులకు భలే ఆఫర్ను ప్రకటించింది. ఓటర్లు వేలిపై సిరా చుక్కను చూపించి స్విగ్గీ డౌన్ఔట్లోని ఎంపిక చేసిన రెస్టారెంట్ల బిల్లులో 50 శాతం తగ్గింపు ఆఫర్ను అందిస్తుంది. అంతేరా కిచెన్ అండ్ బార్, పపాయ, ఎయిర్ లైవ్, ఫుడ్ ఎక్స్ఛేంజ్–నోవాటెల్, రెడ్ రీనో, కాఫీ కప్ వంటి పలు రెస్టారెంట్లలో ఈ ఆఫర్ను అందుకోవచ్చని స్విగ్గీ డౌన్ఔట్ హెడ్ స్వప్నిల్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్వతంత్రుల ప్రభావం కొంతే!
సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రభావం తక్కువనే చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో పోలైన మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులకు దక్కిన ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే. గత ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో 47 లక్షల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనగా.. ఇండిపెండెంట్లకు 50 వేల కంటే తక్కువే ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ చర్రితలో నాలుగు లోక్సభ సెగ్మెంట్లలోనూ ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన దాఖలాల్లేవు. సెగ్మెంట్ల వారీగా స్వతంత్రుల ఓట్లు.. ● 2019 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో 9 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 5,173 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని 8.7 లక్షల ఓట్లలో వీరి బలం కేవలం 0.5 శాతం మాత్రమే. ● సికింద్రాబాద్ సెగ్మెంట్లోనూ ఇదే తీరు కనిపించింది. మొత్తం 9.1 లక్షల ఓట్లు పోలవగా.. ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగిన 15 మంది స్వతంత్రులు సాధించిన ఓట్లు 10,051 మాత్రమే. ● ఇక మల్కాజిగిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లకు 30 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి బరిలోకి 66 మంది.. ఈ నెల 13న జరగనున్న లోకసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 525 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వీరిలో 50 మంది మహిళలు, 475 మంది పురుష అభ్యర్థులున్నారు. మొత్తం 286 మంది స్వతంత్రులు పోటీపడుతున్నారు. అత్యధికంగా మెదక్ లోక్సభ నుంచి 29 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. గ్రేటర్లో చూస్తే.. చేవెళ్లలో 21 మంది, మల్కాజిగిరిలో 11, సికింద్రాబాద్లో 27, హైదరాబాద్లో 7 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక సమస్యలే ఎజెండా.. గ్రేటర్లోని స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణతో పాటు సామాజిక వర్గాలను నమ్ముకొని పోటీపడుతున్నారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎక్స్, ఇన్స్ట్రాగామ్ వేదికగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలు, వృద్ధ ఓటర్లను మెప్పించేందుకు స్థానికులు, కుటుంబీకులతో కలిసి పలు ప్రాంతాల్లో సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు, బేబీ వాకర్, రోడ్డు రోలర్ వంటి పలు గుర్తులను కేటాయించింది. 2019లో గ్రేటర్లో వీరికిపోలైన ఓట్లు ఒక్క శాతమే నాలుగు సెగ్మెంట్లలో కలిపి 50 వేల లోపే ఓట్లు ఈసారి బరిలో 66 మంది ఇండిపెండెంట్లు స్థానిక సమస్యలే వీరి ఎజెండాగా ప్రచారం గ్రేటర్ చరిత్రలో ఒక్కసారి కూడా గెలవని అభ్యర్థులు -
ఎందరెందరో..
జేబీఎస్లోప్రధాని మోదీ, అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోదీ గ్రేటర్ పరిధిలోని నియోజక వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మల్కాజిగిరిలో రోడ్షోలో, ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా ఓల్డ్సిటీలో రోడ్షోతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో, చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్లలో ప్రచారాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ పార్టీకి చెందిన మరికొందరు జాతీయ నాయకులు రాజ్నాథ్ సింగ్, తేజస్వీ సూర్య, నవనీత్కౌర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలు భూపేంద్ర పటేల్, మోహన్ యాదవ్, భజన్లాల్ శర్మలు సైతం గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారంటే ఎంతటి ప్రాధాన్యమిచ్చారో ఊహించుకోవచ్చు. మహాభారత కురుక్షేత్రంలో యోధానుయోధులు పాల్గొన్నట్లే.. ప్రజాస్వామ్య రణక్షేత్రంలో తమ పార్టీని గెలిపించేందుకు అతిరథ మహారథులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాము అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల కంటే ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు మాటల తూటాలనే ప్రధాన ఆయుధాలుగా మలచుకున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్న చందంగా అవినీతి, రిజర్వేషన్లు, కరెంటు, రాజ్యాంగం, యూటీ తదితర అంశాలను ప్రస్తావించారు. గ్రేటర్ పరిధిలో 4 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలిస్తే మూడొంతుల ప్రజల మనసులు గెలుచుకున్నట్లు కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాతబస్తీ పరిధిలో సైతం గతానికి భిన్నంగా పరిస్థితి మారింది. ప్రచారం కంటే చేసే పనులే గెలిపిస్తాయని నమ్మే మజ్లిస్ పార్టీ సైతం ఈసారి ప్రచారంలోకి దిగడం పోటీ తీవ్రతను చాటింది. మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారాలతో దుమారం రేపాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ హేమాహేమీలు ప్రచారం నిర్వహించారు. రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీ టింగ్ల్లో మాట్లాడారు. నేతల ప్రచారా నికి ప్రజలు భారీగానే హాజరయ్యారు. ఎవరికి వారుగా తామే గెలుస్తామని భావించేలా బ్రహ్మరథం పట్టారు. సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ పరిధిలో 4 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలతో సర్వశక్తులూ ఒడ్డిన ప్రధాన పార్టీలు ఓటర్లకు నగదు పంపిణీలో నిమగ్నమయ్యాయి. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు తమకే ఓటు వేయాలని ఓటర్లతో ఒట్టు పెట్టించుకుంటున్నట్లు వినికిడి. ప్రధాన పార్టీ ఎక్కువ నగదు పంపిణీ చేస్తే.. పోలింగ్కు ముందు రోజు మరోసారి నగదు ఇచ్చేందుకు మరో పార్టీ అభ్యర్థి సిద్ధమవుతున్నారు. ఓటరుకు ఇచ్చే డబ్బులు మధ్యవర్తులెవరూ స్వాహా చేయకుండా ప్రతీ రూపాయి కచ్చితంగా చేరేలా అభ్యర్థికి చెందిన ప్రత్యేక జట్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లిన వారిని ఓటు వేయడానికి సొంత ప్రాంతానికి రప్పించడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బస్తీలు, పట్టణాలు, గ్రామాల వారీగా అలాంటి ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేశారు. ప్రతి రోజు ఫోన్ చేసి.. పోలింగ్ సమయానికి వచ్చి ఓటేసి పోవాలంటూ కోరుతున్నారు. రవాణా ఖర్చులు భరిస్తామని హామీ ఇస్తున్నారు. కొందరైతే.. ఫోన్ నంబర్లు సేకరించి, వారితో గ్రూప్ కాల్స్ల్లో ఓటు కోరుతున్నారు. కుల సంఘాలు, వివిధ యూనియన్లు, కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక ,ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. సామాజిక వర్గాల నేతలతో కూడా ఫోన్ల ద్వారా మాట్లాడిస్తున్నారు. తక్షణ సాయంగా కొంత మొత్తాన్ని ప్రకటిస్తూ.. గంపగుత్తగా ఓట్లన్నీ తమకు పడేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్.. ప్రియాంక.. రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ తదితరులు పార్టీ విజయం కోసం ప్రచారాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. ప్రియాంకా గాంధీ తాండూరు, పటాన్చెరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బస్సుయాత్రతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. కాంగ్రెస్తోనే కష్టాలంటూ తనదైన శైలిలో ప్రసంగించారు. ఇలా ఎవరికి వారుగా అన్ని పార్టీల హేమాహేమీల ప్రచారాలకు ప్రజలు హాజరైనప్పటికీ, ఎవరికి ఓట్లేస్తారో చెప్పే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలోనేతలు వచ్చినా ఆ ప్రభావం పోలింగ్లో కనిపించకపోవడం తెలిసిందే. ఇక.. ‘నోటు’ మాటలే.. -
మల్కాజిగిరిలో గెలుపు నాదే
– బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్: కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఎత్తులు వేసినా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం మాత్రం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో లేకపోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎక్కడికి వెళ్లినా స్వాగతిస్తున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ స్పందన ఉందన్నారు. తనను పార్లమెంట్కు పంపితే జీవితాంతం సేవకుడిగా పనిచేస్తానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లు రేవంత్కు అవకాశం ఇస్తే ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చి చూడలేదని, అధికారంలోకి వచ్చినా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరని, పదేళ్ల అద్భుత పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, అందుకే బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారన్నారు. -
జస్ట్ రిలాక్స్.. ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case. The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst -
Telangana: సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్ జరగనుంది.తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ నారాయణన్లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు. -
ఇక మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. గత నెల రోజులుగా హోరెత్తిన లౌడ్ స్పీకర్లు, మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. శనివారం సాయంత్రం నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్రాజ్ ప్రకటించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఎక్కడా నలుగురుకి మించి గూమికూడి ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు.బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధంబల్క్ ఎస్ఎంఎస్లతో పాటు టీవీ చానళ్లు, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రసారంపై నిషేధం అమల్లోకి వచ్చిందని వికాస్రాజ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం వరకు వెల్లడించరాదన్నారు. శనివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం జరగాల్సిన పోలింగ్కు సర్వం సిద్ధం చేశామన్నారు.ఎక్కడికక్కడ గట్టి నిఘాపోలింగ్కి ముందురోజు ఆదివారం రాత్రి వేళల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీని అడ్డుకోవడం తమకు కీలకమని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వికాస్రాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా పెంచామని, అన్ని ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.320 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీ–విజిల్ యాప్, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మొత్తం 8600 కేసులు నమోదు చేయగా, అందులో 293 కేసులు నగదుకి సంబంధించినవి, 449 కేసులు ఐపీసీ, 7800 కేసులు మద్యానికి సంబంధించినవి అని వివరించారు. పోస్టర్ బ్యాలెట్లో అభ్యర్థిని చూడాలి..ఆదిలాబాద్ లోక్సభ స్థానం మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల పరిధిలో రెండు, లేదా మూడు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు గందరగోళానికి గురికావద్దని, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శనకు ఉంచిన పోస్టర్ బ్యాలెట్లో తాము ఓటేయాల్సిన అభ్యర్థిని ముందే గుర్తించాలని వికాస్రాజ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, వీరిలో 20,163 మంది ఇంటి వద్ద నుంచే ఓటేశారన్నారు. రాష్ట్రంలో తక్కువ పోలింగ్ జరిగే 5వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడి ప్రజలు ఓటేసేలా చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 9900 సమస్యాత్మకమైనవి అని, అక్కడ కేంద్ర బలగాలు, సూక్ష్మ పరిశీలకులు, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.సోమవారం ఉదయం 5.30 కి మాక్పోల్సోమవారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో మాక్పోల్ నిర్వహిస్తారని, అభ్యర్థుల ఏజెంట్లు అందరూ అందుబాటులో ఉండాలని వికాస్రాజ్ సూచించారు. మాక్పోల్/పోలింగ్ నిర్వహించేటప్పుడు ఈవీఎంలు పనిచేయకపోతే సెక్టోరల్ అధికారులు వచ్చి మారుస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఇద్దరు, ముగ్గురు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు పోలీసుల భద్రతతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తారన్నారు.కచ్చితమైన పోలింగ్ శాతం తెలిసేది మరుసటి రోజే..పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అంచనా పోలింగ్ శాతాన్ని అందిస్తామని వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసాక సాయంత్రం 6 గంటలకు మొత్తం పోలింగ్ శాతంపై తొలి అంచనాను, రాత్రి అయ్యాక సవరించిన అంచనాలను ప్రకటిస్తామన్నారు. మరుసటి రోజు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడిస్తామన్నారు.విద్వేష ప్రసంగాలపై దాటవేత ధోరణి..ప్రస్తుత లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ప్రచారంలో చిన్నపిల్లలను వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వికాస్రాజ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రత్యేకంగా ఒక్కో ఫిర్యాదు విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఇప్పుడు లేదన్నారు. రాజకీయ పార్టీల నుంచి మొత్తం 92 ఫిర్యాలొచ్చాయని, ఇద్దరు వ్యక్తులపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఫిర్యాదుల విషయంలో రాజకీయ పార్టీలకు నోటిసులు జారీ చేశామని, వివరణ కోసం వారు మరికొంత సమయం కోరినట్టు తెలిపారు.లోక్సభ ఎన్నికల్లో వాడనున్న ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు – 84,577+ 20వేలు రిజర్వ్కంట్రోల్ యూనిట్లు – 35,809+ 10వేల రిజర్వ్వీవీప్యాట్స్ – 35,809 + 15వేలు రిజర్వ్పోలీసుల బందోబస్తుకేంద్ర బలగాలు –160 కంపెనీలుపొరుగు రాష్ట్రాల నుంచి హోంగార్డులు, ఇతర బలగాలు– 20వేల మందిరాష్ట్ర పోలీసులు 60వేల మందిఇతర రాష్ట్ర యూనిఫార్మ్ సర్వీసుల సిబ్బంది– 12 వేల మంది -
Amit Shah: ఐదేళ్లూ మోదీయే
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత కూడా దేశాన్ని నరేంద్ర మోదీయే ముందుకు నడిపిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలంటూ వయోపరిమితి అనేది తమ పార్టీ రాజ్యాంగంలో లేదని అన్నారు. అమిత్ షా శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే వచ్చే ఏడాది నరేంద్ర మోదీ పదవి తప్పుకుంటారని, అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్కు, ఆయన కంపెనీకి, ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండితే మీరు సంతోíÙంచాల్సిన అవసరం లేదు. 75 ఏళ్లు దాటితే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాసి పెట్టిలేదు. మోదీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారు. దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ఈ విషయంలో మా పారీ్టలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని అమిత్ షా తేలి్చచెప్పారు. -
మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి/తాండూరు: ‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని, బీజేపీని ఓడించడం తెలంగాణ నుంచే మొదలుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ నాయకత్వానికి అండగా నిలవండి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీని మీరంతా సోనియమ్మ అంటున్నారు. నన్ను మీ సోదరిగా భావించండి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తెలంగాణ నుంచే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం తాండూరు, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్షోలు, కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు, కారి్మకులు, రైతులు, మహిళలకు ఎలాంటి మేలు జరగలేదని, తన మిత్రులకే దేశ సంపద దోచిపెట్టారని మండిపడ్డారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ ఫొటో ఎన్నికల సమయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ధ్వజమెత్తారు. కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందని, అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందన్నారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప, దేశానికి ఏం చేశారో ప్రధాని ఒక్క వేదికపైనా చెప్పలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డికి జాతీయా హోదా ఏదీ? చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం అంటే తనకెంతో ప్రేమ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాందీకి మీరంతా ప్రేమను పంచారని, తన తల్లిని సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చి తనకు సోదర సమానులయ్యారని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయిందని చెప్పారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను చట్ట పరిధిలోకి తెస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రిపుల్ ఆర్ సినిమా చూశారా అని ప్రజలను అడిగిన ప్రియాంక... మనకు డబుల్ ఆర్ అంటే రేవంత్రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ అని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లా బీజేపోళ్లు రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో కేవలం కందులే కాదు ఇతర పంటలనూ పండించేలా ప్రోత్సహించారు. నాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వేల కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేసి రద్దు చేసి గోదావరి జలాలను రాకుండా చేశాయని ధ్వజమెత్తారు. ‘మే 9న రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చాను. రైతు భరోసా అందిస్తే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్కు సవాల్ విసిరాను. మే 6న రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశా. కేసీఆర్ఆర్కు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలి’ అని పేర్కొన్నారు. ‘రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని హరీశ్రావు అంటున్నారు. తెలంగాణ రైతుల సాక్షిగా, అనంత పద్మనాభస్వామి వారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేస్తున్నా. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా’ అని తెలిపారు. మోదీ వెంట ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అంబానీ, అదానీ ఉంటే.. రాహుల్ వెంట ఇందిరమ్మ, రాజీవ్ గాం«దీల త్యాగం, సోనియమ్మ, ప్రియాంక గాంధీ, రేవంత్రెడ్డి, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మోదీ పరివారాన్ని ఓడించి, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి దామోదర రాజనర్సింహ, చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక లోక్సభ సీట్లను సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పది స్థానాలకుపైగా కచ్చితంగా గెలుస్తామని.. 13 సీట్లలో పార్టీ పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను బీజేపీయే గెలవబోతోందని పేర్కొన్నారు. ఈసారి 400 సీట్లు దాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు శనివారం సాయంత్రం కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్లతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రషు్టపట్టాయి. దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో 4% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైంది. సోనియా పుట్టినరోజున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ సోనియా ఎన్నో పుట్టినరోజున అనేది చెప్పలేదు. రైతులకు రూ.15 వేల భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు. అవేవీ చేయలేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు హైకమాండ్కు ఇచ్చిన ఒక హామీ ని మాత్రం పూర్తిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారు. పీవోకే భారత్లో భాగమే.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా.. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. కశీ్మర్ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోం. పీవోకే భారత్లో అంతర్భాగమే. రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలు అడుగుతున్నారు. అలా స్ట్రైక్స్ చేసిన మూడో దేశం భారత్ మాత్రమే. దేశ సరిహద్దులు, అంతర్గత అంశాల్లో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోం. వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడిచేస్తాం. ఇండియా కూటమి దేశాన్ని విభజిస్తోంది.. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు విభజన చేస్తున్నాయి. ఇప్పటికే దేశాన్ని కాంగ్రెస్ ఒకసారి విడగొట్టింది. వారికి అంతకన్నా ఇంకేం రాదు. బీజేపీ ఉన్నంత వరకు విభజన జరగనివ్వం. అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చింది. బెయిల్ రావడమే క్లీన్ చిట్ అనుకుంటే.. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ రాహుల్ గాం«దీని 20సార్లు లాంచ్ చేసినా విజయవంతం కాలేదు. 21వసారి కూడా అదే విఫల ప్రయత్నం చేస్తోంది. వారి తీరుతో ఆర్థికంగా వెనుకబాటు 2014లో తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా ఉంది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా రూ.80 వేల కోట్లు వడ్డీల కిందే కట్టాల్సిన దుస్థితి నెలకొంది. విభజనకు ముందు కేంద్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రూ.15వేల కోట్లు అందితే.. ఇవాళ ఒక్క తెలంగాణకే కేంద్రం నుంచి రూ.60వేల కోట్లు గ్రాంట్లుగా వస్తోంది. తెలంగాణలో మౌలిక వసతుల కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అందిన నిధులకంటే.. మోదీ సర్కారు గత పదేళ్లలో రెట్టింపు నిధులు ఇచ్చింది. రిజర్వేషన్ల రద్దు ఉద్దేశమేదీ లేదు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కాంగ్రెస్ ప్రచారాన్ని అవాస్తవం. గత పదేళ్లుగా ఎన్డీయేకు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. మేం రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేం మా మెజారిటీని ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దుకు, రామాలయ నిర్మాణానికి వాడాం. ఏవైనా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఆర్థికంగా, సామాజికంగా, విద్యపరంగా వెనుకబాటుదనం ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలు, క్రిస్టియన్లు పొందవచ్చు. దానికి మేం వ్యతిరేకం కాదు. నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. ఈ అంశంపై నా మాటలను మారి్ఫంగ్ చేసి ప్రచారం చేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఐదేళ్ల టర్మ్ను పూర్తిచేస్తారు. దానిపై బీజేపీలో ఎలాంటి అనుమానాల్లేవు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో 92 శాతం అమలు చేశాం. మూడు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. నాలుగో దశలోనూ మద్దతివ్వాలని కోరుతున్నాం’’అని అమిత్ షా పేర్కొన్నారు. మా ప్రగతి ఓవైపు.. వారి అవినీతి మరోవైపు.. ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి బరిలో ఉన్నాయి. ఓవైపు రూ.12 లక్షల కోట్ల అవినీతి కూటమి.. మరోవైపు 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా ఉన్న మోదీపై 25 పైసల అవినీతి కూడా లేని కూటమి. అధికార అహంకారం తలకెక్కిన ఇండి కూటమి అటు.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఇటు.. నోట్లో బంగారు స్పూన్తో పుట్టి, కాస్త ఎండలు కాస్త పెరగగానే థాయ్లాండ్కో. మరో చోటికో వెళ్లే యువనేత అటు.. పేదింట్లో పుట్టి పెరిగి, పేదల కష్టాలు తెలిసి వాటిని దూరం చేస్తున్న మోదీ ఇటు.. గత పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆరి్ధక వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా వంటివాటిలో గణనీయ ప్రగతి సాధించాం. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రచేస్తోందన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అయినా పెట్టుబడులు కావాలంటే ప్రధానిని కలసి, అడిగితే బాగుంటుంది. అనవసర విమర్శలు సరికాదు. ప్రాంతీయ పార్టీలు తమ వాణిని వినిపించే అధికారం ఉంటుంది. కేసీఆర్కు కూడా ఆ అధికారం ఉంది. అంతే తప్ప బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఎండోమెంట్ చట్టం తొలగింపు అంశం కోర్టు ముందుంది. కోర్టు ఏం చెబితే అదే చేస్తాం. -
రివర్స్ గేర్లో కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం.. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయకపోవడంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు.కాంగ్రెస్పై ఓటర్లకు విరక్తి కలిగిందని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అభాసుపాలైందని, రాష్ట్రంలో మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అనూహ్య ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హరీశ్రావు శనివారం సాక్షితో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారుఅసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త గ్యారంటీలంటూ అబద్ధపు మాటలతో ప్రజల ముందుకొస్తున్నారు. ఈ గ్యారంటీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఏది రాసిస్తే దాన్ని రాహుల్గాంధీ చదువుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోంది. రాహుల్ గాంధీ ఉదయ్పూర్లో చేసిన డిక్లరేషన్ అమలు చేయకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో విశ్వసనీయతను కోల్పోయారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని చెబుతూ వచ్చి చివరకు వారికే ఎక్కువగా టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారు. సర్కారు నుంచి వేధింపులురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగింది. హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభనే దీనికి నిదర్శనం. జనాలు రాకపోతే సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ బస్సులోనే ఉండిపోయారు. సభ ప్రాంగణంలోకి వెళ్లండంటూ స్వయంగా రేవంత్రెడ్డి గేట్ దగ్గరుండి కోరినా.. ప్రజలు లోపలికి పోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గాలిలో ఉన్న కాంగ్రెస్ను భూమి మీదకు దించాలంటే ఆ పార్టీ నేతలను ఓడించాలి. నిరుద్యోగులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయి. అక్రమ కేసులు పెట్టి గౌడన్నలను జైలు పాలు చేశారు, చంచల్గూడ జైలులో ఇప్పుడు సగం మంది వారే ఉన్నారు.బీజేపీ ఒరగబెట్టింది ఏమీలేదుపదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు, అందుకే దేవుని పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ట్రస్ట్ నిర్మించింది. ఆలయ నిర్మాణానికి చాలామంది ప్రజలు ఇచ్చారు... నేను కూడా విరాళం ఇచ్చా. అయితే, ఆ గుడిని తాము కట్టించామని బీజేపీ చెప్పుకుంటోంది. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ను దూరం చేసింది. బీడీ కట్టలకు జీఎస్టీ పెట్టడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తులం బంగారం తుస్సుపేదింటి ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన రూ.లక్ష చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం హామీ కూడా తుస్సుమంది. వడ్లకు తరుగు తీస్తున్నారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. వడ్లకు తరుగు తీస్తున్న కాంగ్రెస్కు రైతులు ఓట్లలో తరుగు పెట్టాలి. రాష్ట్రంలో అప్పులు చూపించి.. దివాళా తీసిందని ప్రభుత్వం చెబుతుండటంతో పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు నా సవాల్ను స్వీకరించలేదు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ 2లక్షల రుణ మాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పినా సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్ను స్వీకరించకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీలు బోగస్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నాయి. యువత వాటిని నమ్మొద్దు.(గజవెల్లి షణ్ముఖరాజు) -
Telangana: ఓటేద్దాం.. రండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.ఎపిక్లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.» ఆధార్ కార్డు» ఉపాధి హామీ జాబ్కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్,» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు » భారతీయ పాస్పోర్టు» ఫొటో గల పెన్షన్ పత్రాలు » కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)చాలెంజ్ ఓటు అంటే?ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్తో ఎన్నో సదుపాయాలు..ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చురాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం!పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్లో ఉంచాల్సిందే.మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు.జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?» ఎన్నికల సంఘం వెబ్సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి. » మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి). » 1950 నంబర్కి మీ ఎపిక్ నంబర్ను ఎస్ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతేపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న వేతనంతో కూడిన సెలవుసెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్మెంట్స్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. -
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
19 ఏళ్ల రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
పిఠాపురంలో జోరుగా పోలింగ్
తమిళనాడు ఎంపీ మృతి
మొరాయిస్తున్న ఈవీఎంలు.. భారీ వర్షంతో పోలింగ్కు అంతరాయం
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ భారతి
ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు)
తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!
పులివెందులలో ఓటేసిన సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement