-
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
లక్నో: లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని కీలకమైన అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిసన తలిపారు. దీంతో కార్యకర్తలను నిరసనను పోలీసులు శాంతింపచేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలపారు.మరోవైపు.. ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ‘‘స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలు గూండాల్లా కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు. కార్లను ధ్వసం చేశారు. అక్కడితో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులపై కూడా బీజేపీ రౌడీలు దాడి చేశారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ అమేథీలో దారుణంగా ఓడిపోతుందని అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై మండిపడింది. బీజేపీ కార్యకర్తల దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనతే మండిపడ్డారు. -
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... మోదీ వారసత్వం అంటే ఇదే.. ‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి, కన్నౌజ్, ఎటావా లోక్సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది. 2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు కాంగ్రెస్తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అయోధ్య బాలరాముడి సేవలో మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. -
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement