-
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
పెళ్లిళ్ల విషయాల్లో మనకూ వాళ్లకున్న స్పష్టమైన తేడా , మనవి చాలావరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ కాగా వాళ్ళవి ప్రేమ వివాహాలు. అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడమంటే ఒక తేనె తెట్టెను కదిల్చినట్లే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో దినదినం తగ్గిపోతున్నారు. పెళ్ళి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడంతో అసలు పెళ్లెందుకు ? అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు . పెళ్ళైనా కాకున్నా తప్పవు చికాకులు అందుకే పెళ్ళి.. బెటర్ విందువినోదాలు బెల్లమైనా పెళ్ళామైనా కొత్తలో చాలాతీపి పాతబెల్లం మందులకు.. పెళ్ళాం పిల్లలకు నచ్చినవాడే కాదు మెచ్చినవాడు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడే కళ్యాణం కలిసివుండడం గుడ్.. కుదరనప్పుడు నిత్యకలహాలకన్నా విడిపోవడం వెరీగుడ్ఇందులో మొదటి రెండు భారతీయుల మనస్తత్వాన్ని , చివరి రెండు అమెరికా వాళ్ళ ఆలోచనా ధోరణిని తెలిపే కవితలు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు , సేమ్ సెక్స్ ( స్వలింగులు ) జంటలు ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. వీళ్లను అదుపు చేయగలగిన కుటుంబ పెద్దల వ్యవస్థ అక్కడ బలహీనమై పోయింది. పేరెంట్స్ డే నాడు కలుసుకోడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో పెద్దలకు తెలిసే పరిస్థితులు. మన దేశంలో పొద్దున్నుండి రాత్రి వరకు స్త్రీ చేసిన ఇంటి వంట పనులు, పిల్లల పోషణ లెక్కలోకి రావడం లేదు. కులాలు, మతాలు ప్రాతిపదికనళ్లు పెళ్లిళ్లే ఉండవు..ఆమె భర్త చాటు అబల మాత్రమే, సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొనివున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. బయటకు వెళ్లి మగవాడు చేసిందే సంపాదన , ఆయనే కుటుంబ యజమాని. అమెరికాలో పరిస్థితి భిన్నం. మహిళ సబల, భర్త వెనక నడిచే భార్య కాదు. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా షికార్లకు వెళ్లి రాగలదు. అక్కడ భార్యభర్తలు ఇద్దరూ ఏదో ఓ ఉద్యోగం చేసేవారే. తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసివున్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పనిలేదు.తేడాలు వస్తే , కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు. అమెరికాలో కులాలు, మతాల ప్రాతిపదికన పెళ్లిళ్లు ఉండవుఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎంచుకోవచ్చుపెళ్లికి ముందే తప్పనిసరిగా పరిచయం అయి ఉంటుందిఒకరి గురించి మరొకరికి సంపూర్ణంగా అవగాహన కలిగే వారకు కలిసి ఉంటారుఇద్దరి అభిప్రాయాలు ఒక్కటై.. కలిసి ఉంటామన్న నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటారుఅమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెళ్లికి సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పద్ధతులున్నాయివయస్సులో భర్త పెద్దగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం, ఇష్టం ఉంటే చాలుఅమెరికాలో పెళ్లిళ్లకు ముందే చాలా మంది కౌన్సిలర్లను కలుస్తారు. భాగస్వామితో కలిసి ఒకరి గురించి మరొకరు చర్చిస్తారు. బంధం ధృడమయ్యేందుకు చర్చలు జరుపుతారుఆడ-మగ అనే కాదు, స్వలింగ వివాహాలు కూడా ఇక్కడ చట్టబద్ధమేపెళ్లికి ఎంతో విలువ ఇస్తారు. చట్ట ప్రకారం ఇద్దరికి అన్ని హక్కులు సమానంగా ఉంటాయిభారతదేశంతో పోలిస్తే విడాకులు ఇక్కడ సర్వసాధారణంవిడాకుల విషయంలో కోర్టులు విధించే భారీ పరిహారమే భయపెట్టేలా ఉంటుందిభారత్లో జరిగినట్టుగా పెళ్లిళ్లు భారీ హడావిడితో జరగవు.డెస్టినేషన్ వెడ్డింగ్లు కూడా జరుగుతాయి. మంచి పర్యాటక ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడమంటే అమెరికన్లకు ఇష్టంపెళ్లి ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు. వర్చువల్గా విషెస్ చెబుతారు.చాలా వరకు పెళ్లిల్లు వీకెండ్లోనే జరుగుతాయి.మన దగ్గర పెళ్లి చీరకు ఎంత విలువ ఉంటుందో.. అక్కడ వెడ్డింగ్ గౌన్కు అంత ప్రాధాన్యత.భారత్ నుంచి వెళ్లి సెటిలయ్యే వారిలో కొందరు అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వెనక కూడా లీగల్ పాయింట్లు లాగే వారున్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాట పడ్డా.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్లను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడ పరిచయం, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు? పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది? ఇలాంటి ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించమంటున్నారు. పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్నవారే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పై పడుతుంది వాస్తవం. వీటికి తోడు పెళ్లికాని టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం, అసలు పెళ్లే చేసుకోకుండా కలిసివున్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు . నల్ల జాతీయుల్లోనైతే వివాహేతర జననాలు 25 శాతం వరకు ఉంటాయంటున్నారు !.వేముల ప్రభాకర్(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?) -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో 133 మందిని అరెస్ట్చేశారు. -
టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!
సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సందేశాన్ని భావితరానికి తెలియజేయడంతో పాటు వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మిడిల్ స్కూల్ పిల్లలు 10 మంది పెద్దలు కలిసి అనాథ పిల్లల కోసం శాండ్విచ్లను తయారు చేశారు.. ఇలా చేసిన వాటిని టంపా లోని అనాధశ్రమానికి అందించింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు మనం కూడా సామాజిక బాధ్యతగా ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, నాట్స్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సేవాభావాన్ని చాటారు. నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు.(చదవండి: టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement