-
బాధితుల కులమతాలను మార్చేస్తారా?
అమలాపురం టౌన్: శిరోముండనం కేసులో నిందితులను కాపాడే ఎత్తుగడతో కేసును కొత్త మలుపు తిప్పుతూ బాధితుల కుల మాతాలను మార్చేస్తారా? అంటూ ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రశ్నిస్తూ అమలాపురంలో గురువారం సాయంత్రం నిరసన చేపట్టింది. పలు ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటరు నుంచి బుద్ధవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. శిరోముండనం కేసు తుది తీర్పునకు వస్తున్న సమయంలో.. కేసు 21 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగి.. ఇప్పుడు నిందితులను కాపాడేందుకు ఈ కేసులోని బాధితులు అసలు ఎస్సీలే కాదని.. బీసీలని తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని ఐక్య ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపించారు. ఆ ఆరోపణలను అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించకుండా నిందితుల ప్రలోభాలకు లొంగిపోయి బీసీలుగా తప్పుడు నివేదిక ఇస్తున్నారని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి ధ్వజమెత్తారు. జిల్లాలో 18 ప్రజా సంఘాల నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఆ ఆధారాలు, ఆరోపణలు నకిలీవని వారి బాగోతం బయట పెట్టామని ఆమె స్పష్టం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన రామచంద్రపురం ఆర్డీవో, ఎమ్మార్వోలను సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ఆ పదవి నుంచి తొలగించాలని ర్యాలీలో ప్రజా సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. తీర్పు ఏ విధంగా వచ్చినా అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిను రూపాందించామని రాజామణి అన్నారు. ఈ ర్యాలీలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఉపాధ్యక్షుడు అమలదాసు బాబూరావు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దీపాటి శివప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకుడు మచ్చా నాగయ్య, మమత స్వచ్ఛంద సేవా సంస్థ నాయకుడు కోరుకొండ జాన్ తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన రజకులు
► ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ మహా ధర్నా ► కర్నూలులో గాడిదలతో భారీ నిరసన కర్నూలు(న్యూసిటీ): తమ ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ సోమవారం రజకులు కదం తొక్కారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ముందుగా రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు గాడిదలతో భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా రజక సంఘాల ఐక్యవేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. దేశంలో 18 రాష్ట్రాలలో, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారన్నారు. ఆంధ్రప్రదేశలో 1985వ సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారని గుర్తు చేశారు. రజక వృత్తిదారులకు (చేనేత, గీత కార్మికలకు ఇచ్చేవిధంగా) పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ప్రతి జిల్లాలో రజక విద్యార్థులకు ప్రత్యేక ఆశ్రమం పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్మోహన్కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో రాష్ట్ర నాయకులు నాగరాజు, సీపీ వెంకటేశ్వర్లు, కె.మధు, సత్యసాయి, రామకృష్ణ, లింగమయ్య, గణేష్, న్యాయవాది, చంద్రశేఖర్, శ్రీనివాసులు, గోపాల్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement