-
టైపింగ్ రానక్కర్లేదు.. చాట్జీపీటీతో పనిచేసే టైప్ రైటర్ వచ్చేసిందోచ్!
టైప్ రైటర్తో పనిచేయాలంటే, మనకు టైపింగ్ రావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న టైప్ రైటర్తో టైప్ చేయాలంటే, మనకు టైప్ రాకున్నా ఫర్వాలేదు. ఇది తనంతట తానే టైప్ చేసేస్తుంది. పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ టైప్ రైటర్కు ‘చాట్ జీపీటీ’ ద్వారా సరిగ్గా మార్గనిర్దేశనం చేస్తే చాలు, మిగిలిన పనిని ఎలాంటి సాయం లేకుండా తానే పూర్తి చేస్తుంది. ప్రస్తుతం కోపెన్హాగెన్లో స్థిరపడిన కేరళకు చెందిన డిజైనింగ్ నిపుణుడు, ఇంజనీర్ అరవింద్ సంజీవ్ ఈ టైప్ రైటర్కు రూపకల్పన చేశారు. విలక్షణంగా పనిచేసే ఈ టైప్ రైటర్కు దీని పనికి తగినట్లే ‘ఘోస్ట్ రైటర్’ అని పేరు పెట్టడం విశేషం. ఓఎల్ఈడీ స్క్రీన్, రెండు నాబ్స్, తేలికగా వాడుకునేందుకు వీలయ్యే కీబోర్డ్ ఈ టైప్రైటర్కు ప్రత్యేక ఆకర్షణలు. దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. -
ఏడుపదుల వయసులోనూ..
ఒకప్పుడు చిన్న మ్యాటర్ రాయాలన్నా టైప్ సెంటర్ల వద్దకు క్యూ కట్టాల్సి వచ్చేది.. కొన్ని ఉద్యోగాలకు టైపు రైటింగ్ తప్పనిసరి. టైప్ రైటింగ్ నేర్చుకునేందుకు సెంటర్ల వద్ద టైమ్ ఫిక్స్ చేసుకొని బ్యాచ్లు ఏర్పాటు చేసుకునేవారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలనీలో చూసినా ఆన్లైన్, మీసేవ, నెట్ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఏ సేవలైనా కంప్యూటర్ కావాల్సిందే.. దాదాపు టైప్ ఇనిస్టిట్యూట్స్ మూతపడ్డాయి. కానీ 70 సంవత్సరాల వయసులోనూ ఓ వ్యక్తి టైప్ ఇనిస్టిట్యూట్ నడిపిస్తూ.. నామమాత్రపు ఫీజు తీసుకొని ఎంతో మంది విద్యార్థులకు టైపింగ్లో శిక్షణ ఇస్తున్నాడు. సూరారం గ్రామానికి చెందిన సామల యాదగిరి సూపరింటెండెంట్గా రిటైరయ్యారు. బోయిన్పల్లిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన ఆయన డిగ్రీ పూర్తి చేసి ఐడీపీఎల్లో పనిచేస్తూ, మరోపక్క అమీర్పేట్లో టైపు నేర్చుకొని లోయర్, హైయర్లో ఉత్తీర్ణత సాధించాడు. 1969లో పరిశ్రమల శాఖలో టైపిస్ట్గా చేరి నెలకు రూ.130 జీతం తీసుకున్నాడు. 1979లో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాడు. పనిలో మరింత చురుగ్గా వ్యవహరించడంతో 1996లో ఆఫీస్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ పొంది మహబూబ్నగర్కు వెళ్లాడు. 2004లో పదవి విరమణ అనంతరం సూరారంలో కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శ్రీచక్ర టైపు ఇనిస్టిట్యూట్ను స్థాపించి నామమాత్రపు ఫీజు తీసుకుని యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా నిముషానికి 45 పదాలు టైప్ చేస్తూ తనకుతానే సాటి అనిపించుకున్నాడు. శిక్షణ కోసం పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. ఫీజు గురించి వారిపై ఎప్పుడూ ఒత్తిడి పెంచకుండా వారికి టైప్ రైటింగ్లో తర్ఫీదునిస్తున్నాడు. టైప్ మిషన్ మరిచిపోయారు నేటి యువత కంప్యూటర్ వాడుతున్నారు. కొంతమంది టైప్ చేసేందుకు బద్దకిస్తూ ఫోన్లో వాయిస్ టైపింగ్ చేస్తున్నారు. చాలామంది టైప్ మిషన్ అనేది ఉందనే విషయాన్ని మరిచిపోయారు. టైప్ రైటింగ్ నేర్చుకుంటేనే కంప్యూటర్పై రాణించగలుగుతారు. ప్రభుత్వం టైప్ మిషన్ నేర్చుకోవాలనే రూల్ పెడితే నేటి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. – సామల యాదగిరి -
కంప్యూటర్ దెబ్బకు పాతదైపోయిన టైప్ రైటర్
టైప్ రైటర్. అక్షరాలను అందంగా చెక్కే అపురూప శిల్పి. కాలంతో పోటీపడి అక్షరాలను పరుగెత్తించిన యంత్రం. చెట్టుకింది ప్లీడర్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో యూడీసీలు, ఎల్డీసీలు, కోర్టుల్లో రిజిస్టర్లు, అకౌంటెంట్లు.. ఇలా ఒక్కరా, ఇద్దరా ప్రతి ఒక్కరి చేతిలో టైప్రైటర్ ఒక శక్తిమంతమైన సాధనమైంది. అక్షరాలను పరుగులు పెట్టించింది. రహదారులకు ఇరువైపులా టైప్రైటింగ్ ఇనిస్టిట్యూట్లతో టకటకమంటూ వినిపించే లయబద్ధమైన కీబోర్డు శబ్దాలు, ఉద్యోగాల కోసం టైప్రైటింగ్ నేర్చుకొనే విద్యార్థుల కళ్లల్లో మెరిసే ఆత్మస్థైర్యం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించాయి. విద్యార్హతలతో పాటు ‘టైప్ లోయర్, హయ్యర్’ తప్పనిసరైంది. ఇది ఒకప్పటి మాట. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కంప్యూటర్తో పోటీపడలేక నేడు టైప్రైటర్ మనుగడ కష్టసాధ్యంగా మారింది.కొత్త తరానికి ఇది పాతదైపోయింది. దీని అస్తిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. టైప్రైటింగ్లో కనీసం 18 రకాల ఫార్మెట్లు ఉంటాయి. ప్రభుత్వ జీఓలను ఒక విధమైన ఫార్మెట్లో టైప్ చేస్తే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలను మరో రకమైన ఫార్మెట్లో టైప్ చేస్తారు. ఉద్యోగాల కోసం చేసుకొనే దరఖాస్తులు, గవర్నమెంట్ స్టేట్మెంట్లు, అకౌంట్స్లో డెబిట్, క్రెడిట్లు, ఇన్వాయిస్లు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, న్యాయస్థానం వెలువరించే తీర్పులు, ఒక ఐఏఎస్ మరో ఐఏఎస్కు రాసే లేఖలు, పోలీస్స్టేషన్ ఎఫ్ఐ ఆర్లు, నివేదికలు.. ఇలా ప్రతిదానికి ఒక్కో ఫార్మెట్ ఉంటుంది. టైప్ నేర్చుకొనే వాళ్లు ఈ అన్ని ఫార్మెట్లలో లోయర్ హయ్యర్ స్థాయిలను పూర్తి చేస్తారు. లోయర్ స్థాయిలో నిమిషానికి 30 పదాలు, హయ్యర్లో 60 పదాల చొప్పున టైప్ చేయాలి. ఒక్కో కోర్సుకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికే ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, పలు సంస్థల్లో కంప్యూటర్లపై పని చేసే ఉద్యోగులు టైప్ నేర్చుకొనేందుకు మాత్రం కొంత వరకు టైప్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 250 వరకు టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో సుమారు 400 మిషన్ల ద్వారా 7వేల మంది శిక్షణ పొందుతున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది. ఇనిస్టిట్యూట్ల పరిస్థితి ప్రశ్నార్థకం.. టైప్రైటింగ్ ఇనిస్టిట్యూట్లు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్నాయి. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉపాధి పొందుతున్నాయి. ఇటు నిర్వాహకులకు, అటు ఉద్యోగార్థులకు టైప్రైటర్లు ఉద్యోగావకాశంగా మారాయి. కానీ కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ఉద్యోగ భర్తీ ప్రకటనల్లో అభ్యర్థులు తప్పనిసరిగా టైప్ లోయర్, హయ్యర్, షార్ట్హాండ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలనే’ నిబంధన లేకపోవడంతో ఈ కోర్సులకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఇనిస్టిట్యూట్ల మనుగడ ప్రశార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్రైటింగ్/షార్ట్హాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ చైర్మన్ మర్రి రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఇటీవల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ను సంప్రదించింది. టైప్ రైటర్లను కనుమరుగు చేయొద్దని, ఉద్యోగార్థులకు టైప్రైటింగ్, షార్ట్హాండ్ తప్పనిసరి చేయాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులువినతిపత్రం అందజేశారు. నాడు వేల సంఖ్యలో.. ఒకప్పుడు సిటీలో అడుగడుగునా టైప్రైటింగ్ శిక్షణ కేంద్రాలు ఉండేవి. వీటిలో వేలాది మంది ట్రైనింగ్ పొందేవారు. కానీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత టైప్ రైటర్ ప్రాభవం సన్నగిల్లింది. ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో టైప్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటి మనుగడ కూడా చాలా కష్టసాధ్యంగా మారింది.– రాజేశ్వర్, టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు, ఈసీఐఎల్ ఇదే ఆధారం.. 1979లో టైప్ ఇనిస్టిట్యూట్ పెట్టాం. మా కుటుంబ జీవోనోపాధికి ఇదే ఆధారం. పిల్లల్ని బాగా చదివించాం. మా ఇనిస్టిట్యూట్ ద్వారా లక్షలాది మందికి శిక్షణనిచ్చాం. అంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మొదట్లో నెలకు రూ.8 ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.1000 వరకు ఉంది. – కృష్ణవేణి, వేణి టైప్రైటింగ్ఇనిస్టిట్యూట్, వారాసిగూడ ఇనిస్టిట్యూట్లనుఆదుకోవాలి ప్రభుత్వం టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్లను గుర్తించాలి. క్రమం తప్పకుండా రెన్యువల్ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో టైప్ను తప్పనిసరి చేయడం ఒక్కటే పరిష్కారం. – సతీష్, వెంకటేశ్వర టైప్రైటింగ్ఇనిస్టిట్యూట్, తార్నాక -
'నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్'
లక్నో: తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన వృద్ధ టైప్ రైటర్ కిషన్ కుమార్ తనను వదిలేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండనీయండని, తన పని తనను చేసుకోనివ్వండంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. లక్నో జనరల్ పోస్టాపీస్ ముందు ఓ పాత టైప్ రైటింగ్ మిషన్తో పనిచేసుకుంటూ కిషన్ కుమార్ బతుకీడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత వారం ఓ ఎస్సై ఆయనను ఆ ప్రదేశం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడమే కాకుండా.. అతడిపై దాడికి దిగి టైప్ రైటర్ను ధ్వంసం చేశాడు. ఈ ఫొటోలు, వీడియో సామాజిక అనుసంధాన వేదికల్లో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆ పెద్దాయనపై సానూభూతి పెల్లుబుకింది. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఆయనకు కొత్త టైప్ రైటర్ కొనివ్వడమే కాకుండా లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీసులే ఎస్కార్ట్గా రోజు ఆయన ఇంటికి వెళ్లడం పనిచేసుకునే ప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తున్నారు. అయితే, ప్రశాంతంగా ఏ ఆందోళన లేకుండా 35 ఏళ్లుగా కొనసాగుతున్న తన జీవితంలో జరిగిన ఈ ఘటనతోనే ఆయన కలవరపడుతుండగా తాజాగా ఆయనకు కొత్త సమస్య వచ్చిపడింది. ఆయన పనిచేసే ప్రాంతానికి పలువురు వెళ్లి సానూభూతితో పలకరిస్తుండటంతోపాటు ఇంటర్వ్యూల పేరిట మీడియా వస్తుంటడంతో ఆయనకు ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం కరువైంది. దీంతో ఆయన నేరుగా' నా చుట్టూ ఇంతమంది ఉంటుంటే నేనేం పనిచేయలేకపోతున్నాను. గత రెండు రోజులుగా ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. ఇలాగే జరిగితే నాకుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఇక్కడికి నేను పనిచేసుకునేందుకు వస్తున్నాను. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కాదు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ పక్క నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండగా.. సహాయం చేస్తామని బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండంటూ కూడా మరికొన్ని ఫోన్లు వస్తున్నాయి. కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు' అని కుమార్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement