-
రహస్యంగా యంగ్ హీరోయిన్ వివాహం.. ఇప్పటికీ అది సస్పెన్సే
హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించి చేసుకుంటే.. మరికొందరు పెద్దల చూపించిన అబ్బాయితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్.. గతేడాది 'గుడ్ నైట్' చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు 'ముదల్ నీ ముదువమ్ నీ' చిత్రంలో హీరోయిన్గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కుండబద్దలు కొట్టేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?) పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
సినిమాటోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్గా చేస్తున్న కుర్రాడితోనే ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరూ సదరు హీరోయిన్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!) ముంబయి బ్యూటీ అక్ష.. 2004లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'ముసాఫిర్' అనే సినిమా చేసింది. 2007లో 'గోల్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో 'యువత' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరసగా తెలుగులోనే 'రైడ్', 'అది నువ్వే', కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్, రాధ చిత్రాల్లో నటించింది. అయితే 2017 తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 'జమత్రా', 'కాట్మండు కనెక్షన్', 'రఫుచక్కర్' లాంటి వెబ్ సిరీసుల్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వెబ్ సిరీసులు చేస్తున్న టైంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఆ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా. ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V — Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024 View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
చిరు-మహేశ్తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో ఇలా!
ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్. చాలా చిన్న వయసులోనే ఏకంగా చిరంజీవి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్, నాగార్జున లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కెరీర్ సాఫీగా సాగుతోందనుకునే టైంలో సడన్గా సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు సాక్షి శివానంద్. ఇప్పటి జనరేషన్కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1993లో 'అన్నా వదిన' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే 1997లో చిరంజీవి 'మాస్టర్'తో పూర్తిస్థాయి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2001 వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్దారకుడు, యువరాజు, సింహరాశి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. 2001లో రాజశేఖర్ 'సింహరాశి' సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్గా హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో ఛాన్సులు సరిగా రాలేదు. 2008లో 'హోమం', 2010లో 'రంగా ది దొంగ' చిత్రాల్లో చివరగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు చిత్రాలకే దూరమైపోయింది. అనంతరం సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా గృహిణిలా మారిపోయింది. ఈమెకు ఒహానా శివానంద్ అనే చెల్లెలు ఉంది. పైన చూసిన ఫొటోలో సాక్షితో పాటు ఉన్నది ఒహానే. అయితే సాక్షి అప్పుడెలా ఉందో ఇప్పటికీ అంతే అంతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
Advertisement