-
ఏపీలో ‘పంటల నమోదు’ ఆదర్శం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ‘పంటల నమోదు’ విధానం ఆదర్శనీయమని తెలంగాణా వ్యవసాయశాఖ అధికారుల బృందం కితాబిచ్చింది. తెలంగాణా రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ బాలు నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం ఏపీలో పర్యటించింది. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్తో పాటు ఇతర వ్యవసాయాధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంటల నమోదు అమలు తీరును ఏపీ అధికారులు వివరించారు. ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగానే సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంటల రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఇలా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకూ పంటల బీమానే ప్రామాణికంగా తీసుకుంటున్నామని వివరించారు. సీజన్ ప్రారంభం నుంచి పంట కొనుగోళ్లు పూర్తయ్యే వరకు పంటల నమోదు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏపీ వ్యవసాయ శాఖ ఈ క్రాప్ డీడీ జెడ్.వెంకటేశ్వరరావు, బీఎల్ స్వామి తదితరులు పంటల నమోదు ఏ విధంగా చేస్తున్నారో.. ప్రయోగాత్మకంగా చూపించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఏడీఏ ఎంఏ మసూద్ఖాన్, ఐటీ సెల్ ఇన్చార్జి బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయశాఖలో జేడీఏ వ్యవస్థ రద్దు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సంయుక్త సంచాలకుల(జేడీఏ) వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ యోచిస్తోంది. జేడీఏలను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ)గా నియమించాలని భావిస్తోంది. అందుకోసం ఆర్జేడీ పోస్టును సృష్టించి రెండు మూడు జిల్లాలతో ఒక ప్రాంతీయ సంచాలకు ల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుం టోంది. అలాగే జేడీఏల స్థానంలో వ్యవసాయ ఉప సంచాలకుల (డీడీఏ)ను జిల్లా బాస్లుగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలి సింది. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో సంస్కరణలపై చర్చించేందుకు ఆ శాఖ... జేడీఏలతో మేధోమథనం నిర్వహించింది. అదనంగా ఎంత సిబ్బంది అవసరమో చర్చించింది. అనంతరం ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే జేడీఏ వ్యవస్థను రద్దు చేయొద్దని.. ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంచాలని కొందరు అధికారులు కోరుతున్నారు. కొత్త పోస్టులు వద్దు... సర్దుబాటు మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పడినా కొత్త పోస్టుల మంజూరు ఉండదని... ప్రస్తుతం ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేయాలని... ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు తేల్చి చెప్పింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అదనంగా పోస్టులు మంజూరు చేయకుంటే కష్టమని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయశాఖలో 2,246 పోస్టులున్నాయి. అందులో రెండు అదనపు సంచాలకులు, 12 జేడీఏలు, 34 డీడీఏలు, 204 ఏడీఏలు, 882 ఏవోలు, 1,112 ఏఈవోల మంజూరు పోస్టులున్నాయి. వీటికితోడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెయ్యి ఏఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే కొత్త జిల్లాలకు ఈ సిబ్బంది సరిపోరని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 1.07 కోట్ల ఎకరాల సాధారణ సాగు భూమి, దాదాపు 55 లక్షల మంది రైతులకు సేవలందించాలంటే ఉన్న మంజూరు పోస్టులు సరిపోవని చెబుతున్నారు. 1,571 పోస్టులు సృష్టించాలి: డీడీఏ కొత్త జిల్లాలు ఏర్పడితే అదనంగా 1,571 పోస్టులను సృష్టించాలని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వ్యవసాయశాఖ డీడీఏ కె.రాములు ఉన్నతాధికారులను కోరుతున్నారు. అందులో రెండు అదనపు సంచాలకులు, 16 జేడీఏలు, 52 డీడీఏలు, 68 ఏడీఏలు, 25 ఏవోలు, 1,408 ఏఈవోల పోస్టులను కొత్తగా మంజూరు చేయాలని కోరారు. జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న జేడీఏ వ్యవస్థనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా జేడీఏకు అవసరమైన సహకారం అందించేందుకు ఒక డీడీఏ, ఇద్దరు ఏడీఏలు, ముగ్గురు ఏవోలు, ఒక పరిపాలనా అధికారిని ఇవ్వాలన్నారు. ఆ ప్రకారం జేడీఏ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement