-
టీటీడీ బాధ్యత సాధువులకు అప్పగిస్తే అభివృద్ధి జరుగుతుంది
-
మోడీ దగ్గర చాలా కారణాలున్నాయట..
ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ను కొనసాగించాలా... వద్దా.. అనే అంశంపై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీలో ఫైర్ బ్యాండ్ గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ...రాజన్ పదవి కాల పొడిగింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజన్ ను వెంటనే తొలగించాలని ఆయన వల్లే దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం వాటిల్లిందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు ఎలా ఉన్న దేశ ఆర్థికాభివృద్ధిలో రాజన్ కీలకపాత్ర పోషించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి మోడీ దగ్గర చాలా కారణాలున్నాయట. అటు కేంద్ర బ్యాంకునకు, ప్రభుత్వానికి మధ్య గౌరవప్రదమైన సంబంధంగా నిలిచారనే ఖ్యాతిని రాజన్ దక్కించుకున్నారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీనే ఆర్బీఐ గవర్నర్ పై బహిరంగంగానే పొగడ్తల వర్షం కురిపించారు. సంక్లిష్ట ఆర్థిక సమస్యలను పెర్ ఫెక్ట్ గా విశ్లేషించారని ప్రశంసించారు కూడా. ఇవన్నీ ఎలా ఉన్నా బ్యాంకులకు తలనొప్పిగా మారిని మొండి బకాయిల సమస్యకు ఓ పరిష్కారం రాజన్ నేతృత్వంలోనే దొరికింది. డిసెంబర్ నుంచే దీనిపై కసరత్తు కూడా ప్రారంభమైంది. వసూలు కాని రుణాల నుంచి బ్యాంకులకు భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా కార్పొరేట్ రుణాలపై ఆర్ బీఐ పరిమితులు విధించింది. దీంతో ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ సెక్టార్ కు ఆయన ఎంతో తోడ్పడ్డారు. బ్యాంకింగ్ సెక్టార్ నెలకొన్న మొండి బకాయిల సమస్యను పూరించడం అంత తేలికైన పనికానప్పటికీ రాజన్ దీనిని చాలా సీరియస్ అంశంగా తీసుకుని, మొండి బకాయిల సమస్యపై పోరాడతున్నారు. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్ లో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు రాజన్ కాలంలోనే ప్రవేశించాయి. ఈ ఏడాది దేశ ఆర్థికాభివృద్ధిని 7.75-8శాతం మధ్యలో నడిపించడానికి ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ సెక్టార్ ఎంతో దోహదం చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ సెక్టార్ కేవలం ఆర్ బీఐ వల్లే సాధ్యపడుతుందన్నారు. అదేవిధంగా 2013లో రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రెండు అంకెల ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి ఆయన కృషి అమోఘం. విదేశీ పెట్టుబడిదారుల్లో, రేటింగ్ ఏజెన్సీ లో భారత ఆర్థికవ్యవస్థపై శుభ సంకేతాలు తేవడానికి, రాజన్ ఎంతో సాయపడ్డారట. ప్రభుత్వంతో పాటు రాజన్ తీసుకున్న కీలక నిర్ణయాలే జీడీపీ వృద్ధి బాటలో నడిపించాయని తెలుస్తోంది. వడ్డీరేట్ల పెంపు కొంత మేర ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపినా.. అది కొంత మాత్రమేనని. అంతర్జాతీయ అంశాలు, నిర్మాణ వ్యవస్థలే వృద్ధిపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే ఆర్థికాభివృద్ధికి నష్టం వాటిల్లిలే చేశాయడంలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటివరకూ బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం కొంత ఆశ్చర్యకరం. బీజేపీ ప్రభుత్వంలో రాజన్ కు మద్దతు ఉండటం వల్లే ఈ కామెంట్లపై స్పందించడం లేదని తెలుస్తోంది. రాజన్ తీసుకున్న వడ్డీరేట్ల పాలసీ వల్లే ఆర్థికవృద్ధి పడిపోతుందని మోదీకి రాసిన లేఖలో స్వామి పేర్కొంటే అది చర్చించాల్సిన అంశమే, కానీ రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని.. అమెరికా ప్రభుత్వం రాజన్ కు జారీ చేసిన గ్రీన్ కార్డ్ ను పొడిగించడమే దీనికి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. స్వామి వ్యాఖ్యలను తోసిపుచ్చడానికి మోదీకి ఈ కారణం ఎంతో ఉపయోగపడుతుందని తెలుస్తోంది. స్వామి చేస్తున్న ఈ తప్పుడు ఆరోపణలు మోదీకి తలనొప్పిగా మారనున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement