-
పుష్ప స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ఆమ్ఆద్మీపార్టీకి ‘ఈసీ’ షాక్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి ఎన్నికల కమిషన్(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్న పాటలో పలుసార్లు రిపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్ను ఆదేశించింది. పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్ కె జవాబ్ మే హమ్ ఓట్ సే దేంగె’అన్న నినాదం వచ్చినపుడు కేజ్రీవాల్ జైళ్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. కాగా, తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆప్ మండిపడింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సీబీఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. -
శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్ రిలీజ్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. సాంగ్ చాలా ప్రత్యేకంగా..పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు. చదవండి: లావైపోయా.. సడన్గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప–2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ తొలి లిరికల్ వీడియో ్రపోమోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాటని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్’ (2021) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీకి సీక్వెల్గా రూపొందుతోన్న ‘పుష్ప–2 ది రూల్’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈఓ: చెర్రీ. -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement