-
అప్డేటెడ్ ఐటీఆర్ల రూపంలో రూ.400 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది. దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
5.83 కోట్ల రిటర్నులు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలయ్యాయి. జూలై 22 వరకు, గతేడాది ఇదే సమయానికి పోల్చి చూస్తే 40 శాతం రిటర్నులు (2.48 కోట్లు) దాఖలు కాగా.. చివరి 10 రోజుల్లో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చి రిటర్నులు వేశారు. గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపన్ను శాఖ తేల్చి చెప్పడంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజుల్లో త్వరపడ్డారు. ముఖ్యంగా ఆఖరి రోజైన జూలై 31న 72.42 లక్షల రిటర్నులు వచ్చాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన పన్ను రిటర్నులు 5.87 కోట్లతో పోలిస్తే 4 లక్షల మేర తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వడం అనుకూలించింది. అంతకుముందు 2020లోనూ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు లభించింది. రికార్డులు.. చివరి రోజున ఒక దశలో సెకనుకు 570 చొప్పున, నిమిషానికి 9,573, గంటకు 5,17,030 చొప్పున రిటర్నులు ఫైల్ అయినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. మొత్తం 5.83 కోట్ల రిటర్నుల్లో 50 శాతం ఐటీఆర్–1 కాగా, 11.5 శాతం ఐటీఆర్–2, 10.9 శాతం ఐటీఆర్–3, 26 శాతం ఐటీఆర్–4 ఉన్నాయి. -
డిసెంబర్ 25 నాటికి 4.43 కోట్ల రిటర్నులు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4.43 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్లు) డిసెంబర్ 25 నాటికి దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో ఒక్క డిసెంబర్ 25వ తేదీన 11.68 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపింది. 2.41 కోట్ల ఐటీఆర్–1లు కాగా, 1.09 కోట్ల ఐటీఆర్–4లు ఉన్నట్టు వెల్లడించింది. ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్ ద్వారా పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు గుర్తు చేస్తూనే ఉన్నామని ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. జూలై 31 రిటర్నుల దాఖలుకు అసలు గడువు. కరోనా కారణంగా ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర సర్కారు గతేడాది మాదిరే.. ఈ ఏడాది కూడా డిసెంబర్ ఆఖరు వరకు గడువును పొడిగించడం గమనార్హం. -
రిటర్న్స్ దాఖలు చేయని వారు 67.54 లక్షల మంది
సీబీడీటీ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారి సంఖ్య 67.54 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. వీరందరూ 2014–15 ఆర్థిక సంవత్సరంలో అధిక విలువ కలిగిన లావాదేవీలను నిర్వహించారని, కానీ ట్యాక్స్ రిటర్న్స్ను మాత్రం దాఖలు చేయలేదని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నేతృత్వంలోని నాన్–ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎస్) వీరిని గుర్తించింది. ఈ 67.54 లక్షల మంది 2014–15 ఆర్థిక సంవత్సరంలో అధిక విలువ కలిగిన లావాదేవీలను నిర్వహించారు. కానీ వీరు 2015–16 అసెస్మెంట్ సంవత్సరానికి వారి ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదు’ అని సీబీడీటీ వివరించింది. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న ప్రకారం పన్ను చెల్లింపుదారులు వారి నిజ ఆదాయాన్ని వెల్లడించాలని, లేనిపక్షంలో వీరు తమ వద్ద నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. -
ఈ-ఫైలింగ్ ఇక మరింత సరళం
- ప్రీ-ఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్ జారీకి కసరత్తు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రూపంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు పద్ధతిని ఇంకా సులభం చేసి చేరువ చేయడానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్) మరిన్ని మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఐటీ రిటర్న్ వేసేవారికి ముందుగానే పూరించిన (ప్రీ ఫిల్డ్) రిటర్న్ ఫారాలు అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఈ ఫారాల్లో సదరు పన్నుదారుకు సంబంధించిన ఆదాయం, ఇతర ముఖ్య వివరాలన్నీ అప్పటికే నింపేసి ఉంటాయి. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని సీబీడీటీ యోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఆధార్ నంబరు, ఇం టర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు తదితరాల ఆధారంగా ఆన్లైన్ ఈ-ఫైలింగ్ను, ఈ-వెరిఫికేషన్ను ఆరంభించిన ఐటీ శాఖ... తాజాగా ప్రీ-ఫిల్డ్ ఐటీ ఫారాల యోచన చేస్తోంది. రూ.5 లక్షల లోపు సంపాదన ఉండి, రిఫండ్లు లేనివారు ఆన్లైన్లో ఫారాలు దాఖలు చేసేటపుడు ఈ-వెరిఫికేషన్ కోడ్ సదరు వ్యక్తి తాలూకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయటం ద్వారా ఆన్లైన్లోనే దాఖలు చేయొచ్చు. ఇటీవలే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది కూడా. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారు ఆదాయం, ఇతర కీలక అంశాల్లో ఏదైనా సవరణలు చేయదలచుకుంటే.. అవి అప్పటికప్పుడు చేసి అప్లోడ్ చేసుకునేలా ప్రీ-ఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్ను అందుబాటులోకి తేనున్నట్లు సీబీడీటీ చైర్పర్సన్ అనితా కపూర్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement