-
మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
నిర్మల్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రతి ఇంట్లో నుంచి ఓ మహిళను ఎన్నుకుని, ఆమె ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.30 వేలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తోందని.. కేంద్రంలోనూ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో, జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన జన జాతర సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపించాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హామీలను అమలు చేస్తాం. ప్రస్తుతం మహిళలు, పురుషులు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు ఎనిమిది గంటలపాటు ఉద్యోగం చేస్తారు. మహిళలు ఇంట్లో అదనంగా మరో ఎనిమిది గంటలు పనిచేస్తారు. ఆ అదనపు పనికి ఎలాంటి చెల్లింపు ఉండదు. అందుకే వారికోసం విప్లవాత్మక పథకాన్ని తీసుకొస్తాం. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆర్థిక సర్వే చేపడతాం. ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎన్నుకుని.. ఆమె ఖాతాలో ప్రతీనెలా రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష జమ చేస్తాం. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు అదనంగా జమ అవుతాయి. అంటే రాష్ట్ర మహిళలు ఏడాదికి రూ.1.30 లక్షలు అందుకుంటారు. యువతకు పక్కాగా ఉద్యోగాలు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగువేల కిలోమీటర్లు నడిచా. ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తమ భవిష్యత్ను మోదీ నాశనం చేశారని నిరుద్యోగ యువత నా దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత కోసం.. ‘పహలే నౌకరీ పక్కీ (మొదట ఉద్యోగం గ్యారంటీ)’స్కీమ్ తీసుకువస్తాం. నిరుద్యోగ యువతకు ఒక ఏడాది ఇంటర్న్షిప్తోపాటు నెలకు రూ.8,500 చొప్పున రూ.లక్ష అందజేస్తాం. స్కిల్ ఉన్నవారికి ప్రైవేటు రంగంలో రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. కులగణనతో.. దేశ ముఖచిత్రం మారుతుంది దేశంలో 50శాతం కంటే ఎక్కువగా వెనుకబడిన కులాలవారు, 15 శాతం దళితులు, 7–8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు, 5–6 శాతం అగ్రకుల పేదలు ఉన్నారు. వారి గురించి ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదు. అన్ని రంగాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం. మేం అధికారంలోకి రాగానే దేశంలో కులగణన చేపడతాం. దానితో ఎవరు ఎంత శాతం ఉన్నారో బయటికి వస్తుంది. దేశ ముఖచిత్రమే మారిపోతుంది..’’అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము తెలంగాణలో ‘నఫ్రత్ కే బజార్ మే.. మొహబ్బత్ కీ దుకాణ్ (విద్వేషంతో కూడిన మార్కెట్లో.. ప్రేమ దుకాణం)’తెరిచామని.. రేపు ఢిల్లీలో కూడా తెరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ‘‘ఈసారి ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య సాగుతున్నాయి. కాంగెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయి. దేశంలో పేదలు, దళితులు, ఎస్టీలకు ఏవైనా ఫలాలు అందాయంటే.. అవి ఈ రాజ్యాంగం వల్లనే. గాం«దీజీ, అంబేడ్కర్ లేకుంటే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు. అంబేడ్కర్, గాందీజీ దేశానికి చేసిన సేవలు, పనులను బీజేపీ తుడిచిపెట్టాలని చూస్తోంది. రాజ్యాంగాన్ని చించివేయాలని చూస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నేతలు నేరుగానే చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే.. రిజర్వేషన్లు కూడా రద్దు అవుతాయి. పేదలు, దళితులు, గిరిజనుల హక్కులను లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఎక్కడా ఆయన ప్రసంగాలలో రిజర్వేషన్ పెంచుతామని చెప్పలేదు. రిజర్వేషన్లను తొలగించడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశంలో రిజర్వేషన్లను 50 శాతంకన్నా ఎక్కువకు పెంచాల్సిన అవసరం ఉంది. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పెంచుతాం..’’అని రాహుల్ గాంధీ తెలిపారు. పక్కాగా రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్రెడ్డి నిర్మల్, గద్వాల సభల్లో రాహుల్ గాంధీతోపాటు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పక్కాగా రుణమాఫీ చేస్తామని, రైతులందరికీ రైతు భరోసా సొమ్ము అందజేస్తామని స్పష్టం చేశారు. ‘‘రైతు భరోసా పడటం లేదని కేసీఆర్ అంటున్నారు. ఈనెల 9 తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులు వేసే బాధ్యత మాది. రుణమాఫీ గురించి హరీశ్రావు మాట్లాడుతున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆరు గ్యారంటీల అమలెక్కడా? అని కేటీఆర్ అడుగుతున్నరు. దీనిపై కేటీఆర్కు ఓ సూచన చేస్తున్నా.. మంచిగా చీర కట్టుకుని, ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఇంద్రవెల్లి, నాగోబా జాతర, భద్రాచలం, యాదగిరిగుట్ట ఎక్కడికి వెళ్లు.. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే’’అని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. 70ఏళ్ల చరిత్రలో ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా గోండు ఆడబిడ్డ ఆత్రం సుగుణకు పోటీ అవకాశం వచ్చిందని.. కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తిగా ఆమెను గెలిపించుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. రుణమాఫీ.. పంటలకు మద్దతు ధర.. బీజేపీ కేవలం 2, 3 శాతమున్న ధనిక వర్గాల కోసమే పనిచేస్తోంది. గత పదేళ్లలో మోదీ 2–3 కుటుంబాల కోసమే పనిచేశారు. అదానీ, అంబానీ వంటి వ్యక్తులకు సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. దేశంలో విమానాశ్రయాలు, రక్షణ, ఓడలు, మౌలిక వసతుల కల్పన పరిశ్రమలను అమ్మి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. రుణాలు మాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. రైతుల పంటలకు చట్టబద్ధతతో కనీస మద్దతు ధర అందేలా చూస్తాం. -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్తో కాంగ్రెస్కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్గఢ్లో క్లీన్స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ఢిల్లీ: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఇండియా కూటమిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ప్రతిపక్షాల కూటమి అసత్య ప్రచారం చేసి, ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని దుష్ప్రచారం చేస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని 85 సార్లు సవరించింది. రాజ్యాంగంలో పీఠికలో సైతం మార్పులు చేసింది. అలాంటిది ప్రస్తుతం బీజేపీని నిందిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోదు’’అని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.‘‘పాకిస్తాన్ రాహుల్ గాంధీపై అంత ప్రేమ చూపించటం వెనుక భారత్ను అస్థిర పరచాలనే కుట్ర ఉంది. అసలు పాక్ మాజీ మంత్రి రాహుల్ గాంధీపై చూపిన ప్రేమ చాలా ఆందోళన కలిగించింది. దానికి గల బలమైన కారణాన్ని భారత్ తెలుసుకోవాలనుకుంటుంది. సంపద పంపిణీతో వెనుజులా దేశం వలే ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకుంటోంది. ...ద్రవ్యోల్బణం పెంచాలని చూస్తోంది. పాకిస్తాన్ భారత్లోని ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తోంది’’అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభావం చూపనుందా? అని అడిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ దేశానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు. ఇక.. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోను ‘ఎక్స్’పోస్ట్ చేసి.. ‘రాహుల్ ఆన్ ఫైర్’అని క్యాప్షన్పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయకులు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్లను తొలగించడమని చెప్పారు. -
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement