-
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్కేర్, వినీ కాస్మెటిక్స్లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
Pune:హోటల్లో దారుణం.. పాయింట్ బ్లాంక్లో కాల్చి హత్య
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చారు. తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి -
రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది?
న్యూఢిల్లీ, పుణె: దేశ రాజధాని ఢిల్లీ, పుణెలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్(ఎండీ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా మ్యావ్ మ్యావ్ అని పిలువబడే దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిందితుల విచారణ అనంతరం ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో దాడులు నిర్వహించి 400 కిలోల సింథటిక్ ఉద్దీపనను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పుణెలోని కుర్కుంభ ఎమ్ఐడీసీ ప్రాంతంలో ని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్లో 700 కిలోల డ్రగ్ను సీజ్ చేశారు. కాగా మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. అంతేగాక దేశంలోనే అత్యంత ముఖ్యమైన డ్రగ్స్ బస్ట్లలో ఒకటి. ఈ ఘటనపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వీరిలో ముగ్గురు కొరియర్ బాయ్స్తోపాటు మరో ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలిపారు. ఫార్మా ప్లాంట్ ఓనర్ను అరెస్టు చేశామని, భీంజీ అలియాస్ అనిల్ పరశురాం, కెమికల్ ఇంజినీర్ యువరాజ్ బబన్ భుజ్భాయ్కు దీంతో సంబంధం ఉందని పేర్కొన్నారు. పుణె బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని చెప్పారు. డగ్స్ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇక మెఫెడ్రిన్ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement