-
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గాజాపై దాడుల ఎఫెక్ట్.. అమెరికాలో బైడెన్కు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్ర రాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో, ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్లకు మీదకు వచ్చి భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. *BREAKING NEWS* Israel supporters put up pictures of people killed on October 7th outside the pro Palestinian encampment at Columbia University. Meanwhile, over 400 students have been arrested as division continues to grow. pic.twitter.com/YFCU9IU9YN— MorrisNews (@morrisnews12) April 24, 2024 కాగా.. అమెరికాలోని యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్కు హైబ్రీడ్ పద్దతిని అనుసరించనుంది. ఇక, తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. A view from the Mario Savio steps of Sproul Hall, where I’m standing with Faculty and Staff for Justice in Palestine. Happening now at UC Berkeley! #Divest #BDS #FromTheRiverToSeaPalestineWillBeFree #UCDivest #StudentsForJusticeInPalestine #UCBerkeley pic.twitter.com/zmbyUaryrV— Brooke Lober (@brookespeeking) April 22, 2024 ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక, సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్, హార్వర్డ్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. Puluhan Mahasiswa dan Dosen Pengajar New York University ditangkap kepolisian Amerika karena mendukung dan melakukan aksi solidaritas terhadap Gaza dan Palestina. Selasa (23/4)Sumber: QudsN pic.twitter.com/cjN0F93cEl— Lembayung Senja 🐾👣 (@Lembayungsyahdu) April 24, 2024 న్యూయార్క్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేసినట్టు తెలుస్తోంది. ఇక, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను వైట్ హౌస్ ఖండించింది. Hundreds of faculty members at Columbia University in New York held a mass walkout on Monday in solidarity with students advocating for Palestine. #WeAreAllGaza pic.twitter.com/2L1UBOWaH1— MuslimWomensCouncil (@MWC_Bradford) April 24, 2024 -
బీజేపీకి రాజ్పుత్ల హెచ్చరిక
గాంధీనగర్: లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్కోట్ సెగ్మెంట్లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్కోట్లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్సిన్హ చద్వా హెచ్చరించారు. ఈ సమతి రాజ్కోట్లో ‘రాజ్పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్పుత్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్పుత్ వర్గాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్పుత్ల నేత తృప్తి బా తెలిపారు. కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్పుత్లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు. -
సీఎం జగన్ పై దాడి...ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు
-
సీఎం జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన
సాక్షి,అమరావతి: చంద్రబాబుకు ఏ దురుద్దేశమూ లేకపోతే ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం జగన్ను రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్ టీడీపీని డిమాండ్ చేశారు. బాబు అన్న కొద్ది గంటల్లోనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ యూకే విభాగం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం యూకేలో సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్తీక్ మాట్లాడుతూ.. విజయవాడలో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, దాన్ని చంద్రబాబు ఓర్చుకోలేక పోయారని అన్నారు. యాత్ర ఇలాగే సాగితే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించే సీఎం జగన్పై ఘాతుకానికి తెగబడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచి్చతంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, మలిరెడ్డి కిషోర్, వడ్డూరి అప్పాజీ, వీర పులిపాకల, వజ్రాల రాజశేఖర్, భీమిరెడ్డి ప్రతాప్, మాదిరెడ్డి శ్రీకాంత్, వెంకట్ రమణ మామిడిశెట్టి, వంశీ కృష్ణా రెడ్డి కూకటి, గుండం సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ పై దాడి...రాష్ట్రమంతా నిరసన
-
చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
-
సీఎం జగన్పై దాడి ఘటనను ఖండిస్తూ నిరసనలు(ఫోటోలు)
-
ఆర్య వైశ్యులపై అనుచిత వ్యాఖ్యలు..చిక్కుల్లో చంద్రబాబు..
-
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్మకాలు.. చంద్రబాబుకు మరో వర్గం దూరం..
-
చంద్రబాబు వేస్ట్...వాలంటీర్లే బెస్ట్
-
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీలో సమూల మార్పులు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు. అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
బాబుకు అసమ్మతి సెగ..ఆరని ఆగ్రహ జ్వాలలు
-
నమ్మక ద్రోహం.. సైకిల్ దహనం
ఇటీవల ఓ సభలో కుర్చీలు మడతబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా అర్థం చేసుకున్నారో గానీ.. ఆయన తీరుపై రగిలిపోయి పార్టీ ఎన్నికల గుర్తయిన సైకిల్నే మడతపెట్టి తగలెట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘పచ్చ’దండు అధిష్టానం తీరుపై దండెత్తుతోంది. టికెట్ల కేటాయింపుపై మండిపడుతోంది. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తున్నారని ఆశావహులు రెబల్స్గా మారుతున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమవుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/పెనుగంచిప్రోలు/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి/అరకు: అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోయాయి. ఆగ్రహంతో ఊగిపోయాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి జరిగిన ద్రోహానికి కార్యకర్తలు భగ్గుమన్నారు. నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో గురువారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. టీడీపీ కరపత్రాలు, పార్టీ జెండాలు కుప్పగా పోసి తగులబెట్టారు. అందులో సైకిల్ను వేసి దహనంచేశారు. ఇంటిపైకి వెళ్లి దూకేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు. చంద్రబాబుకు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లమిల్లికి టికెట్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. కట్టప్ప రాజకీయాలు మానుకోవాలని బాబును హెచ్చరించారు. దీంతో రామవరం గ్రామం అట్టుడికింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి భావోద్వేగానికి గురయ్యారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంతో ఆడుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం ఐదేళ్ల పాటు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టానని ఆవేదన చెందారు. కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానన్నారు. తాను, తన కుటుంబం ఐదురోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తామని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. నల్లమిల్లి టీడీపీ రెబల్గా బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి సీటును బీజేపీకి కేటాయిస్తారని మూడురోజులుగా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి నల్లమిల్లి వర్గం ఆందోళన చెందుతోంది. నిరసన వ్యక్తం చేస్తోంది. బీజేపీ బుధవారం అభ్యర్థిని ప్రకటించగానే ఒక్కసారిగా నల్లమిల్లి అనుచరులు రగిలిపోయారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఏ పార్టీ అయినా పొత్తు ధర్మాన్ని పాటించాలని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి సహకరించాలని కోరతానని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ♦ వై నాట్ పులివెందుల అంటూ ప్రగల్బాలు పలికే చంద్రబాబుకు వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ స్థానంలో పోటీకి అభ్యర్థి దొరకడం లేదు. దీంతో రకరకాల పేర్లతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతోంది. తాజాగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి పేరుతో గురువారం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ఈ సీటులో పోటీకి ఇప్పటికే ఐదుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఈ స్థానానికి అభ్యర్థిగా ఏడాది క్రితమే ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. శ్రీనివాసులురెడ్డి పోటీకి విముఖత చూపడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, జమ్మలమడుగు, బద్వేల్ ఇన్చార్జిలు భూపేష్రెడ్డి, రితీష్రెడ్డి పేర్లతోనూ టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ఓదశలో వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేరూ వినిపించింది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీచేస్తారని వార్తలు వచ్చాక సౌభాగ్యమ్మ పేరు కనుమరుగైంది. తాజాగా ఆరోవ్యక్తిగా గండ్లూరు ప్రవీణ్కుమార్రెడ్డి పేరును టీడీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈయన ప్రొద్దుటూరు అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో ప్రవీణ్ను కడప లోక్ సభ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ♦ రాష్ట్ర బీజేపీలో అభ్యర్థులనూ చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటూ బద్వేల్ బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ద్వారా ప్రజల్లోంచి వచ్చిన తనలాంటి దళిత నాయకులకు అన్యాయం చేస్తూ టీడీపీకి చెందిన రోశన్నకు టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం ఇకనైనా పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు గుర్తింపు ఇవ్వాలంటూ గురువారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. 20ఏళ్లపాటు పార్టీకి సేవ చేసిన తనలాంటి యువకుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కోరారు. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని ఆయన కుమారుడు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవకుండానే పదవులు అనుభవించారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. పెనుగంచిప్రోలు మండలం మునేరు అవతల నూతలపాటి కన్వెన్షన్లో గురువారం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, ఓ చానల్ ఎండీ బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తాతయ్య మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వైఎస్సార్ సీపీ నుంచి వచ్చానని చెబుతున్నారని, తాతయ్య కాంగ్రెస్లో నుంచే టీడీపీలోకి వచ్చిన సంగతి మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా ఖర్చుచేశానని, అందుకే సీటు ఆశించానని పేర్కొన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని తాతయ్య ఆరోపించడం అసంబద్ధమని, ఆయన మీడియా ముఖంగా క్షమాపణ కోరాలని, లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటుతానని వెల్లడించారు. -
కాంగ్రెస్ అభ్యర్థిపై ఎస్పీ కార్యకర్తల తిరుగుబాటు!
ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలకు ఇది మింగుడుపడటం లేదని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొరాదాబాద్ సీటు కేటాయింపు విషయంలో గతంలో ఎస్టీ హసన్ , రుచి వీర మధ్య వివాదం తలెత్తింది. ఇప్పుడు సమాజ్వాదీ మిత్రపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీ.. ఎస్పీ కార్యకర్తల నిరసరనను ఎదుర్కోవలసి వచ్చింది. అమ్రోహా జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ కార్యకర్తలు డానిష్ అలీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీని చూసిన వెంటనే ఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట తోపులాట జరిగింది. వేదికపై కూర్చున్న నేతలు వారిస్తున్నప్పటికీ కార్యకర్తల నిరసన మాత్రం ఆగలేదు. ఎస్పీ కార్యకర్తలు కార్యాలయం వెలుపల డానిష్ అలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డానిష్ అలీని అభ్యర్థిగా నిలబెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. డానిష్ అలీ బీఎస్పీని వీడి కాంగ్రెస్లో చేరారు. పార్టీ అతనిని అమ్రోహా స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలబెట్టింది. -
కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేశారంటూ ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు.. అరవింద్ కేజీవ్రాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. Delhi Police allows BJP's Protest, yet the same Delhi Police is pulling apart the turban of AAP Cabinet Minister @harjotbains@ECISVEEP, Delhi Police is under your supervision after declaration of Model Code of Conduct for General Elections. Free & Fair Elections...!? 🤡🤡🤡 pic.twitter.com/bI5mNPFPcP — Dr Ranjan (@AAPforNewIndia) March 26, 2024 అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధానిమోదీ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ గేరావ్ చేపట్టగా.. బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. మెగా మార్చ్ను చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని బీజేపీ మండిపడుతోంది. బీజేపీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు మార్చ్ చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. Massive protest at Patel chowk metro station by AAP Volunteers pic.twitter.com/4RndrfoRhM — Jitender Singh (@jitenderkhalsa) March 26, 2024 చదవండి: కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్ ఆప్ కార్యకర్తలకు నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. ‘ఆప్ కార్యకర్తలు నిరసనలు చేయటానికి అనుమతి లేదు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము’ అని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దేవేశ్ కుమార్ తెలిపారు. BJP can protest when section 144 is imposed. Delhi police have no problem with it. But AAP cannot protest. Dictatorship 101pic.twitter.com/xFlcdGl40F — Analyst 🕵🏽 (@bharat_builder) March 26, 2024 -
నిప్పు రాజుకుంది
-
కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంతప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్కు కూడా వర్తిస్తుంది’అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్టుపై వివాదాస్పద ప్రకటన చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చ్ 21న అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. 26న ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. బీజేపీ ఖాతాల్లోకే లిక్కర్ సొమ్ము -
AAP: కేజ్రీవాల్ అరెస్ట్.. 26న ప్రధాని మోదీ ఇంటి ముట్టడి!
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఈనెల 26న ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం(మార్చి 23) ఢిల్లీలోని హహీదీ పార్క్న ఉంచి ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. పంజాబ్ సీఎం భఘవంత్ మాన్తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు అంతదర ఈ నిరసనల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు,. 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తామని, 25న తమ పార్టీ హోలీ పండుగను జరుపుకోబోదని తెలిపారు. మార్చి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్నందున, మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆప్ తన పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తూ ఆప్ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని ఐటీవో జంక్షన్ వద్ద ఆందోళనకు దిగిన ఆప్ మంత్రులు అతిషీ, సౌరవ్ భరద్వాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. చదవండి: Delhi liquor scam: ఆమ్ ఆద్మీ భవితవ్యం ఏమిటీ? -
‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఎలా వచ్చింది?
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు ‘జై జవాన్, జై కిసాన్’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నినాదాన్ని ఎవరు తొలుత లేవనెత్తారు? ఏ సందర్భంలో ఇది జరిగింది? ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని 1965లో భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వినిపించారు. శాస్త్రి చేసిన నాటి ఈ నినాదం ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ప్రభావవంతంగానూ నిలిచింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1964, మే 27న కన్నుమూశారు. దీంతో నెహ్రూ వారసులెవరనే ప్రశ్న నాడు కాంగ్రెస్ మదిలో మెదిలింది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధాని అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే దేశాయ్ ప్రధానిగా ఉండేందుకు పార్టీలోని పలువురు నేతలు అంగీకరించలేదు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ (2007)లో ఇలా రాశారు. ‘ప్రధాని అభ్యర్థిగా దేశాయ్ని ఎంపిక చేయడం సరికాదని కొద్దిరోజుల్లోనే పార్టీలో స్పష్టమైంది. అతని శైలి దూకుడుగా ఉంది. దేశాయ్ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. శాస్త్రి మంచి నిర్వాహకుడు. హిందీ బెల్ట్ నుండి వచ్చారు. ప్రజలకు మరింత చేరువైన వ్యక్తి’ అని రాశారు. నెహ్రూ మరణానంతరం దేశానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భారత్పై తిరుగుబాటుకు పాకిస్తాన్ ప్లాన్ చేసి, బరితెగించింది. సరిహద్దుల్లోని వంతెనలను పేల్చివేసింది. ప్రభుత్వ భవనాలపై బాంబులు వేసింది. అయితే భారత సైన్యం ఎదురుదాడికి పాక్ వెన్నుచూపింది. ఈ పరిణామం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి (1965) దారితీసింది. శాస్త్రి నాయకత్వంలో భారత సైన్యం తన శక్తియుక్తులను ప్రదర్శించింది. 1965, సెప్టెంబరు 23న ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండో-పాక్ యుద్ధ సమయంలో శాస్త్రి 1965లో యూపీలోని అలహాబాద్ జిల్లాలోని ఉరువా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని వినిపించారు. వీరిద్దరూ దేశ శ్రేయస్సు, భద్రతకు మూల స్తంభాలని శాస్త్రి భావించారు. ఆయన తన హయాంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ను మరింత పెంచారు. హరిత విప్లవానికి శాస్త్రి పునాది వేశారు. -
తగ్గని అసంతృప్త స్వరాలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ అభ్యర్థులుగా బయటివారికి ప్రాధాన్యమివ్వడంపై బీజేపీలో ఇంకా అసంతృప్త స్వరాలు తగ్గడం లేదు. ఇప్పటివరకు 15 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఏడుగురు ఇటీవలే చేరినవారికి (ఒకరు పార్టీలో కూడా చేరకున్నా) టికెట్లు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్డ్ సీట్లను (మూడు ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు) పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి కాకుండా ‘వలస’ నేతలకే ఇవ్వడం ఏమిటని (ఇంకా వరంగల్ ఎస్సీ సీటు ఖరారు కాలేదు) ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమకు టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో పార్టీ మారొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మహబూబ్నగర్ సీటును పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించడంతో.. ఆ స్థానాన్ని ఆశించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు. దీనికితోడు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర నేతలు గురువారం జితేందర్రెడ్డి నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రకటించారు. వేధించిన వారికి టికెట్లా? నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ గుర్రంపోడు ఎస్టీల భూముల పోరు అంశంలో బీజేపీ నాయకులపై అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేసులుపెట్టి జైలుకు పంపారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శ్రేణులను వేధించిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకుని నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోసం టికెట్ త్యాగం చేసి, తర్వాత చేరిన మరో కాంగ్రెస్ నేతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సహకరించిన పార్టీ నేత జి.మనోహర్రెడ్డికి నల్లగొండ ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీస్తున్నాయి. ఇక నాగర్కర్నూల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ ఎంపీ కుమారుడికి ఇచ్చి.. పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతికి మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సబబు అని బీజేపీ అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. 20ఏళ్లకుపైగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన శ్రీనివాస్కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్పై కేసులకు కారణమైన అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాం, పార్టీలోకి రావాలంటూ పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అరూరి రమేశ్ను పార్టీలోకి తీసుకోవద్దని, వరంగల్ ఎంపీ సీటు ఇవ్వొద్దని గురువారం రాష్ట్ర నాయకత్వానికి మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్, ఇతర ఎస్సీ వర్గ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్తో వరంగల్ జిల్లా నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన కూడా చేశారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంపై.. ఆశావహులు, ఇతర నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే టికెట్ల కేటాయింపులో తమ ప్రమేయం పెద్దగా లేదని, జాతీయ నాయకత్వమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తోందని ముఖ్య నేతలు బదులిస్తున్నట్టు సమాచారం. -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
అనకాపల్లిలో టీడీపీ విధ్వంసం..ఫర్నిచర్ ధ్వంసం
-
జయరాం చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
-
రాహుల్ గాంధీకి ఖలిస్థానీ సిక్కుల నిరసన సెగ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం. పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
ప్రజలు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా మంచి వైపే నిలబడతారు
మధ్యప్రదేశ్: గతం కన్నా తగ్గుతున్న ఓటింగ్?
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటింగ్
కేజ్రీవాల్కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్
మహిళలు ఓటు వేస్తున్నారా..! ఈ ఎన్నికల్లో మీదే కీలక తీర్పు..!
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement