-
పెద్ద సినిమాలకు ఓటీటీ వర్కౌట్ కాదు
‘‘కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్వల్ల అన్ని పరిశ్రమల్లో ఉన్న పరిస్థితే సినిమా రంగంలోనూ ఉంది.. సినిమా పరిశ్రమ మామూలు పరిస్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. జనవరి వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని నా అంచనా’’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నిర్మాత పి.రామ్మోహన్ రావు అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు. అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ థియేటర్స్ పరిస్థితి మెరగవదు. అప్పటి వరకూ పెద్ద సినిమాల విడుదల ఆపాల్సిందే. షూటింగ్స్ మొదలు కావడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చని అనుకుంటున్నా. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. వారి బడ్జెట్లు ఓటీటీ మీద వర్కవుట్ కావు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే రెడీగా ఉన్న సినిమాలు కొన్ని ఓటీటీ మీదకు వస్తాయేమో కానీ 90 శాతం సినిమాలు ఓటీటీ మీద రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రారు. పరిశ్రమలో ఎక్కువగా ఇబ్బంది పడే కార్మికుల కోసం చిరంజీవిగారు మొదలు పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఆ కార్మికులను కాపాడుకోవటమే ఇప్పుడు సినిమా పరిశ్రమ ముందు ఉన్న పెద్ద సవాల్. ప్రభుత్వ సహాయం వీరికి అందేలా చూసి, మద్దతుగా నిలుస్తాం. కరోనా లేదనే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు థియేటర్స్ దగ్గర సందడి కనబడుతుంది. అది ఆరు నెలలు పడుతుందా? ఏడాది పడుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం.. కానీ థియేటర్స్ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది’’ అన్నారు. -
చెన్నైలో హైదరాబాద్ ఐటీ బృందం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఐటీ దాడులు మరిం కాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఐటీ అధికారులు శనివారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నారు. తమిళనాడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు తదితరుల ఇళ్లు, ఆఫీసులు, సహకార బ్యాంకులపై ఐటీ దాడులు జరగడం తెలిసిందే. శేఖర్రెడ్డి, రామ్మోహన్ రావుల డైరీల్లో పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, అధికారుల పేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి ఆధారంగా దాడులు కొనసాగించేందుకు హైదరాబాద్ నుంచి ఐటీ బృందం చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం. మరోపక్క.. శేఖర్రెడ్డి భాగస్వాములుగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలున్న రామచంద్రన్, దిండుగల్లు రత్నం ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు శనివారం దాడులు చేశారు. వీరు నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ.150 కోట్ల పాతనోట్లను డిపాజిట్ చేశారనే ఆరోపలున్నాయి. మరోపక్క.. కడలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత ఐదురోజుల్లో రూ.50 కోట్ల పాత నోట్లను డిపాజిట్ చేసినట్లు తేలింది. రామ్మోహన్రావుకు గుండెపోటు! తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు శనివారం చెన్నైలోని రామచంద్రా మెడికల్ వర్సిటీ ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారు. అవినీతి కేసులో రామ్మోహన్ రావు, కొడుకు వివేక్లకు గురువారం కోర్టు సమన్లు జారీ చేసింది. శుక్రవారం వారు హాజరుకాకపోవడంతో వారితోపాటు వారి న్యాయవాదిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రావు ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఆత్మహత్యకు యత్నించారని వదంతులు వస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement