-
పవన్ సభ అట్టర్ ప్లాప్
గుడివాడరూరల్: వారాహియాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు భారీ ఏర్పాట్లు చేశామని కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. ఉదయం 11 గంటలకు పవన్ హాజరవుతారని చెప్పగా 12.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పవన్ వచ్చే సరికి పట్టుమని మూడు వేల మంది కూడా లేరు. దీంతో కూటమి అభ్యర్థులు, నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి కేవలం 2 వేల మంది జనాలు లేకపోవడంలో పవన్ ప్రసంగం చప్పగా సాగింది. సభా ప్రాంగణం వద్ద సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సభ ఫెయిల్ కావడంతో కూటమి నేతల్లో ఓటమి భయం నెలకొంది. కుమ్ములాటలే కారణమా...? పవన్ బహిరంగ సభ ఫెయిల్ కావడానికి నియోజకవర్గం టీడీపీలో కుమ్ములాటలే కారణమా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఒంటెద్దు పోకడలతోనే టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ నాయకులే బాహాటంగా పేర్కొంటున్నారు. తాను జీతం ఇచ్చి నియమించుకున్న వారిని తప్ప జనసేన, బీజేపీ నేతలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులను రాము పట్టించుకోవడం లేదని అంటున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనేది వాపోతున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేపీ, జనసేన దళిత నేతలకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నా పొత్తు ధర్మాన్ని పాటించకుండా తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం పిలవకుండా రాము వ్యవహరిస్తున్న తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చిన సమయంలోనూ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై సొంత పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.తూతూ మంత్రంగా సాగిన పవన్ ప్రసంగం బహిరంగ సభలో జనం లేకపోవడంతో పవన్ ప్రసంగం తూతూ మంత్రంగా సాగింది. ఎప్పుడు గుడివాడ వచ్చిన ఒకే విధంగా పవన్ మాట్లాడటం, స్థానిక నాయకులు ఇచ్చే పేపర్లు చదివి వెళ్లిపోవడం మినహా గుడివాడకు తాము ఏమి చేస్తామనే అంశం చెప్పకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ పేకాట, మట్టికి సంబంధించి మాత్రమే పవన్తో గుడివాడ నాయకులు మాట్లాడించడం పట్ల ప్రజలు పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు, టీడీపీ అగ్రనాయకులు వస్తే మాత్రం మంచినీళ్ల ప్రాయంగా రాము డబ్బు ఖర్చు పెట్టే వాడని, పవన్ వస్తే కనీస ఏర్పాట్లు చేయడం అటు ఉంచితే ప్రజలను సైతం తీసుకురావడంలో విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు. మరోసారి ఓటమి ఖాయమనే భావనలోకి కూటమి నేతలు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదని, మరోసారి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ప్రజలు పేర్కొంటున్నారు. -
ప్రజలను భయాందోళనలకు గురిచేయడం పెద్ద నేరం
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా కథనాలు రాయడం పాపం, పెద్ద నేరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు, పవన్కు, పచ్చ మీడియాకు ఇంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ అని ప్రశ్నించారు. అసలు ఈ చట్టంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఏం తెలుసని ప్రశ్నించారు. అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి రాతలు రాయరని అన్నారు. వారిది క్రిమినల్ మైండ్ అని, అందుకే ఇలాంటి సున్నితమైన సమస్యపై ప్రజల్లో అపోహలు సృష్టించి, ఎన్నికల్లో దీన్నొక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ‘సీఎం జగన్ ఫొటో పట్టాదారు పాసుపుస్తకంపై వేస్తే ఆ స్థలం సీఎంకి చెందిపోతుందా? మరి అప్పట్లో మరుగుదొడ్లపై ఎన్టీఆర్ బొమ్మ వేశారు కదా. ఆ మరుగుదొడ్లన్నీ ఎన్టీఆర్ సొంతమైపోతాయా’ అని ప్రశ్నించారు. బొత్స శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూవివాదాల్లో అవినీతి, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా చేయడానికే ఈ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని సాక్షాత్తు సీఎంగారే చెప్పారన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా లోపభూయిష్టమైన విధానాలను మార్చి సామాన్యుడికి మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా భూ వ్యవస్థలో లోపాలను సవరించి, చట్టాలు తేవాలన్న కేంద్రనిర్ణయంలో భాగంగానే తమ ప్రభుత్వం కూడా అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తోందని, దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. తొలుత గ్రామాల్లో భూసర్వే జరగాలని, ఆ సమయంలో వివాదాలు వస్తే ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారని తెలిపారు. ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరని, ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీకి, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. ఇది కూడా కోర్టులో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదని స్పష్టం చేశారు. ఈ లోపే మీటింగులు పెట్టి.. ఒకరు జోగిపోయి, ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలు ఎన్నికల వరకేనని అన్నారు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల్లో వారి కూటమికి లాభం చేకూర్చాలన్నదే వీరి దురుద్దేశమని తెలిపారు.లిటిగేషన్ తగ్గించడానికే..దీనిలో జిల్లా అప్పిలేట్ విచారణ తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదని, అందుకే కొందరు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశామన్నారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తామని అన్నారు. సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివాదాలు వస్తున్నాయన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోందని, మొదటి దశ పూర్తయి, రెండో దశ కొనసాగుతోందని చెప్పారు. తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా సర్వే చేస్తామన్నారు.పవనేమన్నా పెద్ద మేధావా?పవ¯న్ కళ్యాణ్కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని, ఆయనేమన్నా పెద్ద మేధావా అని బొత్స ప్రశ్నించారు. ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా అని మండిపడ్డారు. జిరాక్స్ కాపీలు తీసుకోవడానికి ప్రజలు అమాయకులనుకుంటున్నారా, వారు ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారం తప్పు అని చాలాసార్లు చెప్పానని అన్నారు. ఆయనొక రాజకీయ నాయకుడు.. ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా అని పవన్పై మండిపడ్డారు. అన్నం తినే వాడెవ్వడూ పవన్ మాటలను హర్షించరన్నారు. తెలిసీ తెలియని అంశాలపై ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. -
తారస్థాయికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్
నూజివీడు/దర్శి/బోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కరప/కాకినాడ సిటీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజురోజుకు తన స్థాయిని మర్చిపోయి రెచ్చిపోతున్నారు. ఆయన, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు ప్రజాస్పందన లేకపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తప్పదని స్పష్టం కావడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.కొద్దిరోజుల క్రితం జగన్ను చంపేస్తే ఏమవుతుందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు శనివారం నూజివీడు, దర్శి, కాకినాడల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మరింత రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయనకు ప్రజలు ఉరేయాలని పిలుపునిచ్చారు. సీఎంపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. దూషణలపర్వానికి దిగారు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని తేలడంతోనే ఇలా దిగజారి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల అరాచకానికి ఫుల్స్టాప్ పెట్టాలి.. రాబోయే ఎన్నికల్లో జగన్ ఐదేళ్ల అరాచకానికి ప్రజలు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సీఎం లుచ్ఛా ముఖ్యమంత్రి, మోసగాడు, అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, బందిపోటు దొంగ, నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల సంపద అంతా తన దగ్గరే ఉండాలనుకుంటారని మండిపడ్డారు. ఈ నెల 13న జరిగే పోలింగ్లో వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలన్నారు. ఈ సైకోకు తోడు కాకినాడ సిటీలో మరో సైకో ఉన్నాడన్నారు. కాకినాడను గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్గా, దొంగ బియ్యం అక్రమ రవాణా కేంద్రంగా తయారు చేశారన్నారు. జగన్కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బినామీ అని విమర్శించారు. ‘భూమి మీదా.. జగన్దా.. జగనన్న భూహక్కు చట్టం అంటా తమ్ముళ్లూ.. మీ భూమి మీద జగన్ కన్నుపడింది’ అని ఆరోపించారు. భవిష్యత్లో భూముల రికార్డ్స్ ఏమీ ఉండవని, జిరాక్స్ కాపీలే ఇస్తారని, వాటితో ముడ్డి తుడుచుకోవడమేనని చెప్పారు. అమెరికాలో ఉన్న జగన్ బినామీ కంపెనీకి జిరాక్స్ కాపీలను స్టోర్ చేసే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ల్యాండ్టైట్లింగ్ చట్టం నల్ల చట్టమని, మీ భూమిని కాజేసే చట్టమని, దొంగోడు, బూచోడు మనందరి భూమిపై కన్నేశాడని తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని, 25 ఏళ్ల క్రితం సెల్ఫోన్ తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశానన్నారు. దుర్మార్గుడు సర్వనాశనం చేశాడు.. జగన్ మెడకు ఉరేసే అవకాశం ఉందని.. మే 13న జగన్ పార్టీకి, ఫ్యాన్కు ఉరివేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిని దేశంలోనే నంబర్వన్ చేయాలనుకున్నానన్నారు. అయితే దుర్మార్గుడు వచ్చి మూడు ముక్కలు ఆడి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. అమరావతి వచ్చి ఉంటే నూజివీడు పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లేదన్నారు. టీడీపీని గెలిపిస్తే నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతానన్నారు. వలంటీర్లను ప్రజలకు సేవ చేసేందుకు పెట్టండి కానీ రాజకీయాలకు కాదని తానే చెప్పానని చంద్రబాబు తెలిపారు. వలంటీర్లను పింఛన్ల విధుల్లో పెట్టవద్దన్నది తానేనని చెప్పారు. పేదలపై కక్ష కట్టి ఏప్రిల్లో 33 ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో అని ధ్వజమెత్తారు. కాగా నూజివీడుకు వచ్చిన చంద్రబాబు జనం లేక 40 నిమిషాలపాటు బస్సులోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. కాకినాడలోనూ జనం హాజరుకాలేదు. దీంతో నాయకులపై చంద్రబాబు మండిపడ్డట్టు తెలిసింది.సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభిమానుల ఫ్లెక్సీలు దర్శి సభలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘జై జూనియర్ ఎన్టీఆర్.. సీఎం కావాలి జూనియర్ ఎన్టీఆర్’ అంటూ చంద్రబాబు ముందే నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు పక్కన ఉన్న నేతలు ఫ్లెక్సీ దించి పక్కకు పోవాలని హెచ్చరించినా అభిమానులు నినాదాలు చేశారు. దీంతో కింద ఉన్న కేడర్ వారిని బలవంతంగా అక్కడ నుంచి పంపేశారు. -
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
-
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement