-
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
జూన్ 4 బీజేడీ సర్కార్కు ఆఖరిరోజు: ప్రధాని మోదీ
భువనేశ్వర్: ఒడిశాలోనూ రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, జూన్లో జరగబోయే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను వస్తానంటూ బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బెహ్రాంపూర్ గాంజాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన నేరుగానే నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు.ఒడిషాను కాంగ్రెస్.. ఆ తర్వాత బీజూ జనతా దళ్ డెబ్బై ఏళ్లపాటు దోచుకున్నాయి. ఒడిషాలో నీరు ఉంది. సారవంతమైన భూములు ఉన్నాయి. ఖనిజ లవణాలతో కూడిన నేలలు ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది. భగవంతుడు ఈ నేలకు అపారమైన సంపద ఇచ్చాడు. అయినా కూడా రాష్ట్రం పేదరికంలోనే మగ్గుతోంది. అందుకు కారణం ఏంటి?..కాంగ్రెస్, బీజేడీ నేతలు కొనసాగించిన దొపిడీనే ఇందుకు కారణం. బీజేడీలో ఉన్న చోటా నేతలకు కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయంటే అర్థం ఏంటి?... ఇక్కడి కూలీపనులు చేసుకునేవాళ్లు వలసలు వెళ్లడానికి కారణాలు ఏంటి?. ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?. బడికి వెళ్లని చిన్నారుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?.. ఒడిషా ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోవడం లేదు. గర్భవతులకు కేంద్రం నెలకు రూ.6వేలు ఆసరా ఇచ్చేది. దానిని ఒడిశా ప్రభుత్వం రద్దు చేసిందంటే మీరు ఆశ్చర్యపోతారు.యూపీఏ పదేళ్ల కాలంలో కేంద్రం ఒడిషాకు ఇచ్చింది లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, మోదీ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల ఇచ్చింది. జల జీవన్ మిషన్ కింద పది వేల కోట్లు కేటాయించింది. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. మోదీ ప్రభుత్వం మీ కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటే.. బీజేడీ ప్రభుత్వం మాత్రం ఆ ప్యాకెట్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటోంది.ఒడిషా ప్రజలు ఆలోచనతో బీజేపీకి ఓటేయాలి. జూన్ 4వ తేదీ బీజేపీ ప్రభుత్వానికి ఆఖరి తేదీ. ఒడిషాలో కమలం వికసించడం ఖాయం. బీజేపీ సీఎం ప్రమాస్వీకారానికి నేనుస్తాను. అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఒడిషా యూనిట్పై, అది రూపొందించిన మేనిఫెస్టోపై మోదీ ప్రశంసలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమికి దూరంగా బీజేడీ.. పార్లమెంట్లో మాత్రం కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్లో ఒడిషాలోని 21 లోక్సభ సీట్లతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ 147 స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్ను సూపర్సీఎంగా పిలుస్తాయి. -
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
భువనేశ్వర్: ఒడిశాను అన్ని రంగాల్లో అగ్రగామికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' పక్కా ప్రణాళికతో ఉన్నారని, రాష్ట్రం నుంచి వలసలు పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ అన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతాదళ్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ అన్నారు. పట్నాయక్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి నవీన్ పట్నాయక్.. ఆరో సారి ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా? వారిలో ఏమైనా అలసట కనిపించిందా? అనే ప్రశ్నకు పాండియన్ సమాధానమిస్తూ.. మంచిపని చేస్తే అలసట ఎలా వస్తుంది, ప్రతి ఎన్నికల్లోనూ అయన గొప్ప విజయం సాధిస్తారని అన్నారు.ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాలకు, 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్కు ఒక్క సీటు మాత్రమే లభించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ సంఖ్య 117 నుంచి 112కి పడిపోయింది. ఆ సమయంలో బీజేపీ 19 నుంచి 23 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్కు తొమ్మిది స్థానాలు మాత్రమే రాగా, ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు.పంచాయితీ, మునిసిపాలిటీ, అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల ఏవీ నవీన్ పట్నాయక్ విజయాన్ని అడ్డుకోలేవు. ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఆయన ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరని పాండియన్ అన్నారు. ఇప్పటికే క్రీడలు, విపత్తు నిర్వహణ, పేదరిక నిర్మూలన లేదా ఆహారోత్పత్తి వంటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే ఒడిశా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. -
ఎన్నికల బరిలో సినీ నటి.. ఎవరో తెలుసా (ఫోటోలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement