-
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి/సాక్షి, అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిల్లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3.30 గంటలకు వేమగిరిలో, 5.45 గంటలకు రాజుపాలెంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళతారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాల్గొంటారు. 8న మళ్లీ రాష్ట్రానికి.. ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. -
నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... మోదీ వారసత్వం అంటే ఇదే.. ‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి, కన్నౌజ్, ఎటావా లోక్సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది. 2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు కాంగ్రెస్తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అయోధ్య బాలరాముడి సేవలో మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. -
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
లక్నో: జార్ఖండ్, బీహార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్లోని ధౌరాహ్రా, అయోధ్యలో ఆదివారం ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. ఇప్పటికే మోదీ రాక కోసం నగర వీధులు బీజేపీ జెండాలతో ముస్తాబవుతున్నాయి.నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇటావాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.45 గంటలకు ధౌరాహ్రాలో మరో సభ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అయోధ్యలోని రామమందిరంలో ప్రార్థనలు, పూజలు చేస్తారు.ప్రధాని మోదీ రోడ్షో సుగ్రీవ కోట నుంచి ప్రారంభమై లతా చౌక్ వరకు కొనసాగుతుంది. రోడ్షో జరిగే మార్గాన్ని 40 బ్లాక్లుగా విభజించారు. ఈ కార్యక్రమంలో సింధీలు, పంజాబీలు, రైతులు, మహిళలు పాల్గొంటారు. బాలరాముని ప్రాణప్రతిష్ట తరువాత మోదీ అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి.#WATCH | Uttar Pradesh: Ayodhya has been decorated ahead of Prime Minister Narendra Modi's visit to Ram Janmabhoomi temple and roadshow today. pic.twitter.com/QnENKFwfyt— ANI (@ANI) May 5, 2024ప్రధాని మోదీ పర్యటనకు ముందు, రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అయోధ్యలో రామ్ లల్లా దర్శనం, రోడ్షో కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఐదవ దశలో (మే 20) అయోధ్యలో ఓటింగ్ జరగనుంది. జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతాయి. అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలున్న (80 సీట్లు) రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో 62 స్థానాల్లో బీజేపీ పతాకం ఎగురవేసింది.#WATCH | Ayodhya, Uttar Pradesh: On PM Modi's visit and roadshow in Ayodhya today, Chief Priest of Ram Janmabhoomi temple, Acharya Satyendra Das says, "... This is the first time that he (PM Modi) is coming after the Pran Pratishtha... He will do Darshan first and then there will… pic.twitter.com/5AoyEsikuw— ANI (@ANI) May 5, 2024 -
కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో
సాంబశివుడు.. గోవిందరెడ్డి.. సుబ్బారావు.. ఎవరు వీళ్లంతా?రామోజీరావు రహస్య సంతానమా? లేకపోతే చంద్రబాబు దత్తపుత్రులా? లేని పేర్లను సృష్టించి.. లేని రిజిస్టరులో వీళ్ల పేర్లు వివాదంలో చిక్కుకున్నట్లుగా రాసి పారేసి... లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? రాష్ట్రాన్ని రాచపుండులా పీడిస్తున్న రామోజీరావు తన చంద్రబాబు కోసం ఇంకెంత దిగజారుతారు? అసలు అమల్లోకే రాని ‘ల్యాండ్ టైట్లింగ్ చట్టం’ గురించి ఎందుకు జనాన్నింతలా భయపెడుతున్నారు? జనం గనక మాకు వద్దంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చట్టాన్నయినా తెస్తుందా? అలా తెచ్చిన దాఖలా ఒక్కటయినా ఉందా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన చట్టం ఈ ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ అన్ని రాష్ట్రాలకూ పంపితే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసి ముసాయిదా చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవీ ఇప్పటిదాకా విడుదల కాలేదు. అంటే ఈ చట్టం కింద టైటిల్ రిజిస్టరు ఎలా ఉంటుంది? టైటిల్ రిజిష్ట్రారుగా ఎవరిని నియమించాలి? రెవెన్యూ అధికారులనా... లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి జ్యుడీíÙయల్ అధికారులనా? ఇలా ఈ చట్టం అమలుకు సంబంధించి ఉండే సమగ్ర నియమ నిబంధనలేవీ ఇంకా రూపు దిద్దుకోనేలేదు. ఈ రూల్స్ విడుదలయ్యాక వీటిపై గ్రామ స్థాయి నుంచి సభలు నిర్వహించి.. ప్రజల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నియమాలు (రూల్స్) రూపొందిస్తారు. ఆ రూల్స్కు లోబడే చట్టాన్ని అమలు చేస్తారు.ఇవేవీ జరగకుండానే... చట్టం అమలయిపోతున్నట్లుగా, ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేయటం ఎంత దుర్మార్గం రామోజీరావ్? అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఒక మాటంటూ ఉంటారు. తాను పోరాడుతున్నది మాయా యుద్ధం చేసే మారీచులతోనని. ఈ ఎల్లో ముఠా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఎంతటి విపత్తులనైనా సృష్టిస్తుందని. నారా వారిని ఎలాగైనా గద్దెనెక్కించాలని మాయా యుద్ధం చేస్తున్న ‘ఈనాడు’ బుద్ధి... అందుకే ఇపుడు భూ మార్గం పట్టింది. చట్టం రావాలంటే సర్వే పూర్తి కావాలి..మూడేళ్ల కిందట కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపిన తర్వాత.. నీతీ ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా చట్టానికి రూపకల్పన చేయటంతో పాటు.. రాష్ట్రంలోని గ్రామాల్లో రీ సర్వే చేపట్టింది. నిజానికి వందేళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్ప.. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ భూముల సమగ్ర సర్వే చేపట్టలేదు.కొత్తగా సర్వేయర్లను నియమించి.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తాన్ని మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సర్వే జనరల్ సైతం రాష్ట్రానికి వచ్చి రీ సర్వే చేస్తున్న తీరును ప్రశంసించారు. ఈ రీ సర్వే చేస్తూ... కింది స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న చిన్న వివాదాల కోసం మొబైల్ న్యాయ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. మరో 2 వేల గ్రామాల్లో తుది దశలో ఉంది. కాకపోతే రాష్ట్రంలో మొత్తం 17 వేల గ్రామాలున్నాయి. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది.మొత్తం అన్ని గ్రామాల్లోనూ రీసర్వే పూర్తయ్యాక వివాదాలు లేని భూములకు సంబంధించి వాటి యజమానులకు హక్కు పత్రాలు అందజేస్తారు. ఆ హక్కు దారుల వివరాలే చివర్లో టైటిల్ రిజిస్టరులో ఉంటాయి. ప్రజలంతా అంగీకరించి.. ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవటానికి కొన్నేళ్లు పడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనక... మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే.. అప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టరు నిర్వహించడానికి వీలవుతుంది.కేంద్రం ఆశిస్తున్నది అదే. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడి భూమినయినా కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినా విజయవాడ రిజిస్టరు కార్యాలయంలోనే దాన్ని రిజిస్టరు చేసుకోవచ్చు. పైపెచ్చు ఒక భూమిని ఎక్కడ ఎవరు కొనుగోలు చేసినా... విక్రయించినా, లేక ఆ భూమిపై ఎక్కడ రుణం తీసుకున్నా ఆ వివరాలన్నీ టైటిల్ రిజిస్టరులో నమోదవుతాయి.కాబట్టి రుణం వంటి వివరాలు దాచి మరొకరి దగ్గర రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇదిగో ఇలాంటిది వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదు కనకనే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పారిశ్రామిక వేత్తల ముసుగులో ఒకే పరిశ్రమకు సంబంధించిన భూముల్ని పలు ఆర్థిక సంస్థల దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. చివరకు బ్యాంకుల్ని ముంచేశారు. ఇప్పుడేమో తాను ఆ వ్యాపారాల నుంచి తప్పుకున్నానని, తనకేమీ సంబంధం లేదని శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు.టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ సమగ్రంగా రీ సర్వే జరిపి... వివాదాలేవీ లేవని తేలి్చన మీదట ఆ భూములకు టైటిల్ పత్రాలిస్తారు కనక.. అక్కడి నుంచి ఆ టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం టైటిల్ ఇచ్చాక కూడా ఆ భూమి అసైన్డ్ అనో, డీ పట్టా అనో వివాదం గనక తలెత్తితే ఆ టైటిల్ దారుకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వమే ఆయా భూములకు బీమా చేస్తుంది. బీమా సొమ్మును టైటిల్ దారుకు చెల్లిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ఈ చట్టం విషయంలో ముందుకు అడుగులు వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది. మోదీతో చెప్పించగలవా బాబూ?ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చంద్రబాబు ముఠా, ఎల్లో మీడియా ఉధృతంగా విష ప్రచారం చేస్తున్నాయి. పత్రికల్లో కథనాలు రాయించటంతో పాటు పనికిమాలిన వ్యక్తులకు లాయర్ల కోటు తొడిగి నిపుణుల ముసుగులో ఎల్లో చానెళ్లలో మాట్లాడిస్తోంది. సోషల్ మీడియాలో అబద్ధాలను జోరుగా వైరల్ చేస్తోంది.వీటిలో ఏ ఒక్క శాతం నిజం ఉన్నా.. ఈ చట్టం కేంద్రానిది కనుక ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, కాబట్టి దీన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని మోదీతో చెప్పించగలవా? మరి అవేవీ చెయ్యలేనపుడు ఎందుకీ విష ప్రచారం? ఎందుకు బీజేపీతో కలిసి పోటీ చేయటం? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి గట్టడమెందుకు? వారు చేస్తున్న చట్టం ప్రజలకు మేలు చేసేది కాదని, దాన్ని తెలుగుదేశం అంగీకరించదని నేరుగా చెప్పలేని నీ బతుకెందుకు? అబద్ధాల పునాదులపై నిరి్మంచుకున్న నీ రాజకీయ కోట పునాదులతో సహా పేలిపోయే రోజు అతి దగ్గరలోనే కనిపించటం లేదా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement