-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఏకపక్షమే..
సాక్షి, అమరావతి: గత రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్సీపీ తన ఆధిక్యతను చాటుకుంది. జమ్మలమడుగుతో సహా 11 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఫలితాలను ప్రకటించగా 8 చోట్ల వైఎస్సార్సీపీ విజయభేరీ మోగించింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది. 129 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించగా 85 వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 33 చోట్ల టీడీపీ నెగ్గింది. ఐదు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ, సీపీఎం రెండు చోట్ల, సీపీఐ ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. ఏకగ్రీవాలతో కలిపి 12 జెడ్పీటీసీలు.. మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఒకటవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వీటికి తోడు సెప్టెంబరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్లు తడిచిపోవడంతో లెక్కించేందుకు వీలు కాక ఫలితాల ప్రకటన నిలిపివేసిన జమ్మలమడుగు జెడ్పీటీసీ, మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని బూత్లకు కూడా తాజాగా ఎన్నికలు జరిగాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాగా నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసిన విషయం తెలిసిందే. ఏకగ్రీవమైన నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ దక్కించుకోగా ఎంపీటీసీ స్థానాల్లో 46 వైఎస్సార్సీపీ, మూడు టీడీపీ, ఒక చోట స్వతంత్రులు గెలిచారు. ఈ నేపథ్యంలో మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 12 వైఎస్సార్సీపీకి దక్కగా 179 ఎంపీటీసీ స్థానాల్లో 131 అధికార పార్టీ విజయం సాధించింది. + -
ప్రజాహిత పాలనదే గెలుపు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించింది. జిల్లా పరిషత్ స్థానాల్లో 99%, మండల పరిషత్ స్థానా ల్లో 90% సీట్లు సంపాదించి తనకు తిరుగులేదని రుజువు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ ఓట్లు వేసింది ఈ ఓటర్లే. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తు ప్రాధాన్యం వహించినా, పార్టీలకు అతీతంగా అభ్యర్థి మంచితనం, బలం, పనివిధానం కూడా లెక్కలోకి వస్తాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా నూటికి తొంభై శాతంపైగా వైసీపీ మీద నమ్మకంతోనే ఓటు వేసినట్టు స్పష్టం. ఇది జగన్ రెండు సంవత్సరాల పైచిలుకు పాలనకు మెజారిటీ ప్రజలు తెలిపిన ఆమోద ముద్ర. దశాబ్దాలుగా తమ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్న సామాన్య ప్రజలకు జగన్ పాలన అభయహస్తం ఇచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వంపై సానుకూలత, ప్రతిపక్షంపై వ్యతిరేకత పెరుగుతోంది. బహుళ ప్రజల అనుకూల వైఖరి వల్ల జగన్ ప్రజల హృదయాలను గెలువగలిగారు. ప్రతిపక్షం పేరుతో చంద్రబాబునాయుడు చేయిస్తున్న అభివృద్ధి నిరోధక ఉద్యమాలు, ఉత్తుత్తి పోరాటాలను ప్రజలు నమ్మడం లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పాలనలో ఐదేండ్లూ ఆంధ్రప్రజలు ఏ మార్పునూ చూడకుండా శుష్క వాగ్దానాలను మాత్రమే అనుభవించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకుండా ప్రజల చిరకాల వాంఛయైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకించడం, అభివృద్ధి వికేంద్రీకరణకు తావిచ్చే బహుళ రాజధానులను వ్యతిరేకించే పేరుతో ప్రతీఘాత ఉద్యమాలను చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖరరెడ్డి గెలిచినప్పుడూ, రెండేళ్ళ క్రితం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పడూ ఒకే తీరు మాటలన్నారు చంద్రబాబు. తనను ఓడించిన తెలుగు ప్రజలు పశ్చాత్తాప పడాలి అన్నారు. అలా తన వైఫల్యాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పు పడుతున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీని అవసాన దశకు తీసుకొచ్చారు. వైసీపీకి పడుతున్న ఓట్లు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వల్ల వస్తున్నవి కాదు. జగన్ గత రెండేళ్లుగా చేస్తున్న పనుల వల్ల అనుకూలంగా పడుతున్న ఓట్లు. ఏ ప్రాపంచిక దృక్పథమూ, అభివృద్ధి నమూనా లేకుండా అధికార పార్టీ వైఫల్యాలతో మాత్రమే గెలవాలనుకునే పార్టీలకు జగన్ గెలుపు చక్కని గుణపాఠం. పాజిటివ్, పర్మనెంట్ ఓటుబ్యాంకును పెంచుకోవడానికి జగన్ అవలంభిస్తున్న విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయిక విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నవరత్నాలు, అమ్మఒడి, జగనన్న దీవెన, ఆరోగ్యశ్రీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం లాంటి అనేక అంశాలతో విలువలతో కూడిన రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఆధునిక వసతులు సమకూర్చడం, పూర్తి స్టాఫ్ను ఇవ్వడం, దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్–19ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల పాలిట పెన్నిధి పాలకుడిగా జగన్ వార్తల్లోకి ఎక్కారు. రెండేళ్ల స్వల్ప కాలంలోనే గణనీయమైన మార్పులు తెచ్చి ప్రజల హృదయాల్లో స్థానాన్ని స్థిరం చేసుకుంటున్నారు. తనది వాగ్దాన, వాగాడంబర ప్రభుత్వం కాదు; ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు కాబట్టే ప్రజల మెప్పు పొందుతున్నారు. బద్వేల్ ఉపఎన్నికలోనూ జగన్ పాలన వైసీపీకి ఘన విజయాన్ని చేకూర్చుతుందన్నది వాస్తవం. డా.కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా, నవలా రచయిత. మొబైల్: 91829 18567 -
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జడ్పీటీసీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే ఎల్లో మీడియా పరిమితం: సజ్జల
-
ఆత్మవిమర్శకు బదులు.. అపనిందలేస్తారా?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా సీఎం వైఎస్ జగన్పై అపనిందలేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు గెలిపించగలిగారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో నివాసం ఉంటూ వలస పక్షుల్లా రాష్ట్రానికి వచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, బాబు భాగస్వామి పవన్ కళ్యాణ్.. సీఎం వైఎస్ జగన్కు నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ►ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 69.55 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 22.27%, జనసేనకు 3.83%, బీజేపీకి 2.32% ఓట్లు వచ్చాయి. ►ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 64.8%, టీడీపీకి 25.27%, జనసేనకు 4.34%, బీజేపీకి 1.48% ఓట్లు వచ్చాయి. ►2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం అయితే.. ఇప్పుడు జెడ్పీటీసీల్లో దాదాపుగా 70శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సా«ధించింది. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల ఆదరణ, విస్పష్టమైన అభిమానం వ్యక్తమైంది. ►గత రెండున్నరేళ్లుగా ఏపీలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎల్లో మీడియా అయితే రోజూ అసత్య కథనాలతో సీఎం ప్రజాస్వామ్య పరిపాలనపై దాడిచేస్తున్నాయి. చెంప చెళ్లుమనిపించేలా తీర్పిచ్చినా.. ►‘పరిషత్’ ఫలితాలు వచ్చాకైనా టీడీపీకి సిగ్గు వస్తుందనుకున్నాం. అసలు ఎక్కడ లోపం ఉందో చూసుకోకుండా తాము ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఎన్నికలు బహిష్కరించి ఉంటే.. ఎందుకు అభ్యర్థులను పోటీకి దింపారు.. అయినా ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారు. ►ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా చూస్తే అచ్చెన్నాయుడు 4, బాలకృష్ణ 7, దేవినేని ఉమా 3, పరిటాల సునీత 9, ధూళిపాళ నరేంద్ర 12 స్థానాల్లో మాత్రమే వారి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కానీ, అత్యంత హీనంగా సాధించింది చంద్రబాబే. అయినా ఆయనకు బుద్ధిరాలేదు. ►ఎక్కడో గుజరాత్లో హెరాయిన్ దొరికితే.. దానికి సీఎం వైఎస్ జగన్కు ముడిపెడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ►ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు జరిగాయే తప్ప టీడీపీ, ఒక వర్గం మీడియా ఆశించినట్లు ఏమీ జరగలేదు. తప్పుడురాతలతో వంకరబుద్ధి చూపిస్తే ఎలా.. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చంద్రబాబుతోపాటూ ఆయన్ని మోసే మీడియాలో ఏమాత్రం మార్పురాలేదు. నిధులు మళ్లించేస్తున్నారంటూ ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కుతూ కథనం అచ్చేసింది. నిజానికి.. సివిల్ సప్లైస్ నుంచి రూ.5,800 కోట్లు, స్టేట్ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ నుంచి రూ.940 కోట్లు, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నుంచి రూ.1,200 కోట్లు, రైతు సాధికార సంస్థ నుంచి రూ.450 కోట్లు మొత్తం రూ.8,390 కోట్లను 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు పసుపు–కుంకుమకు మళ్లించేసింది. అదే సమయంలో ఆర్బీఐ నుంచీ రూ.5వేల కోట్లు డ్రా చేసి.. పసుపు–కుంకుమకు మళ్లించారు. మరి ఆ రోజు మీ పత్రిక ఎందుకు వీటి గురించి రాయలేదు? మీ బాధ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదు.. కేంద్రం మద్దతు ఇవ్వకూడదు.. కోర్టులు ద్వారా ఆడ్డుకోవాలి.. ఇవే మీ కుట్రలు, కుతంత్రాలు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే సంతోషం కేంద్రంతో పవన్ కళ్యాణ్కున్న సత్సంబంధాలు ఉపయోగించి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని ఆ క్రెడిట్ వాళ్లే తీసుకుంటే చాలా సంతోషం. ఇక ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. కాపు, వైశ్య కార్పొరేషన్లు టీడీపీ హయాంలోనే బీసీ శాఖ పరిధిలో ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉత్తర్వులపై విమర్శలు చేయడం అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడంలాంటిదే. వీటన్నింటినీ ఈబీసీ కిందకు మార్చే అవకాశముంది. మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా సృష్టిస్తూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించాం. చదవండి: Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే! ‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement