-
కాపురంలో చిచ్చుపెడుతున్నాడని..
సజావుగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెడుతున్నాడని అనుమానించాడు... తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. అదును చూసి.. ఆదమరచి నిద్రిస్తున్న వేళ గొడ్డలితో వేటేసి మట్టుబెట్టాడు .. ఇదీ.. పక్షం రోజుల క్రితం హుజూర్నగర్ మండలం అమరవరంలో ఓ వ్యక్తి దారుణహత్య వెనుక ఉన్న ప్రధాన కారణం. హుజూర్నగర్ : వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటు ంబ కలహాలకు కారణమయ్యాడనే ఉద్దేశంతో సమీప బంధువే దారుణానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ నర్సింహారెడ్డి నిం దితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. హుజూర్నగర్ మండలం అమరవరానికి చెం దిన పోసాని బాలసైదులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నా డు. సైదులు భార్య గ్రామంలోని ఓ వ్యక్తితో సఖ్యతగా మెలుగుతోందని.. అందుకు అదే గ్రామానికి చెందిన తన సమీప బంధువు పోసాని లింగస్వామి (35) ప్రోత్సహిస్తున్నాడని అనుమానించాడు. అదును చూసి వేటేసి.. లింగస్వామి తీరుపై విసిగివేసారిన సైదులు అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన లింగస్వామి భార్య తిరుపతమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి దైవదర్శానికి తిరుపతికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగస్వామి ఈ నెల 7వ తేదీన ఉదయం పూటుగా మద్యం సేవించి ఇంట్లోనే మంచంపై నిద్రపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సైదులు అతడి ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న గొడ్డలితో లింగస్వామి తలపై నరికి పారిపోయాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న లింగస్వామిని అతడి తల్లి గమనించింది. చికిత్స నిమిత్తం లింగస్వామిని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అనుమానంతో.. మృతుడు లింగస్వామి బావమరిది లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లింగస్వామి, బాలసైదులుకు ఉన్న తగాదాల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. సైదులును అనుమానంతో అదుపులోకి తీసుకుని విచా రించగా ఘాతుకానికి ఒడిగట్టింది తానేనని అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ రంజిత్రెడ్డి, పోలీస్, ఐడీ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పలుమార్లు ఘర్షణలు బాలసైదులు తన భార్య విషయంలో పలు మార్లు లింగస్వామితో పలు మార్లు ఘర్షణ ప డ్డాడు. వీరిద్దరి తగా దాలు గ్రామ పెద్దల స మక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయితే, లింగస్వామి తన తీరు మార్చుకోవడం లేదని సైదులు కక్ష పెంచుకున్నాడు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రూ. 10.52 లక్షల సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం : అతనొక అంతర్రాష్ట్ర దొంగ. అతనిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 100కు పైగానే దొంగతనాల కేసులు ఉన్నాయి. పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు కాకినాడ క్రైం పోలీసులు అరెస్టు చేసి నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 10.52 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఏఎస్పీ ఆర్ దామోదర్ గురువారం కాకినాడ త్రీ టౌ¯ŒS క్రై ం పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ బాపూనగర్ కాలనీకి చెందిన బుర్రా శ్రీనివాసగౌడ్ (శ్రీను) (43) చెడువ్యసనాలకు లోనై 1994లో చోరీల బాట పట్టాడు. అతనిపై హైదరాబాద్, మహబూబ్నర్, ఖమ్మం, నందిగామ, మంగళగిరి, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ త్రీ టౌ¯ŒS క్రైం పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 100 దొంగతనాల కేసులు ఉన్నాయి. నిందితుడు శ్రీను కొంత కాలంగా కాకినాడ సాంబమూర్తినగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పగలంతా ఖాళీగా తిరుగుతూ రాత్రి సమయాల్లో సిటీ పరిధిలోని 11 దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆకేసులు నమోదు చేసి క్రైం డీఎస్పీ ఎ. పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు కేవీ రామారావు, రవికుమార్, శేషుకుమార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సాంబమూర్తినగర్ బ్రిడ్జి కింద ఎర్రరోడ్డు బాలాజీనగర్లో పోలీసులు శ్రీనును అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ .10.52 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతనిని గురువారం కోర్టుకి తరలించినట్టు ఏఎస్పీ దామోదర్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
పాఠశాలల అభివృద్ధి ఇలా...
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement