-
ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు
అడ్డగుట్ట, బన్సీలాల్పేట్, నాంపల్లి: లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్ఎస్కు వస్తే ఏడాది లోపే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్లో, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బన్సీలాల్పేట్ కమాన్ వద్ద, నాంపల్లి నియోజకవర్గం నోబుల్ టాకీస్ చౌరస్తాలో జరిగిన రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, ఇక చేసేది కూడా ఏమీ లేదని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఇక పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు.తెలంగాణకు మోదీ ఏం చేశారుమాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ప్రతీ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని, నల్లధ నం వెలికితీస్తామని చెప్పిన మోదీని.. ఇప్పుడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్ చేసిందేంటి?ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఒకటే ఒక్క పని కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేయడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు రూపాయి పని కూడా చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కరకు రాని చుట్టమని నిందించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలను కష్టాల్లోకి తోసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇవి తప్పనికిషన్ రెడ్డి రుజువుచేస్తే రేపటికల్లా నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.గ్రేటర్ ప్రజలు గ్రేట్గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలివిని ప్రదర్శించి బీఆర్ఎస్కు 16 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని, ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ప్రజలు అప్పుడే కరెంట్ కోతలు...నీటి కష్టాలతో బాధపడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తరువాత కచ్చితంగా రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ ఆరోపించారు. ’’రాహుల్ గాంధీ ఏమో మోదీని చౌకీదార్ చోర్ అంటే మోదీ బడే భాయ్ అని రేవంత్రెడ్డి అంటున్నారు.రాహుల్ ఏమో గౌతమ్ అదానీ ఫ్రాడ్ హై అని అంటే... గౌతమ్ అదానీ హమారా ఫ్రెండ్ హై అని రేవంత్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లేదనీ. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం సరికాదని రాహుల్ గాంధీ అంటే... కేసీఆర్ కూతురును అరెస్టు చేయడం కరెక్టేనని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఈ మాటలను బట్టి రేవంత్ తీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు’’ అని కేటీఆర్ అన్నారు. -
ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
ప్రాంతీయ శక్తులే..ప్రజాస్వామ్య పరిరక్షకులు
(కల్వల మల్లికార్జున్రెడ్డి) ‘లోక్సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నడుమ కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతోంది. ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకొనే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులే’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్ప 28 రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయ పార్టీలే లేవన్నారు. బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, వైఎస్సార్సీపీ, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేక పోయిందని విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్ను యూటీ చేసే కుట్ర ‘హైదరాబాద్పై పట్టు చేజిక్కించుకోవడంతోపాటు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్సభలో మూడింట రెండొంతుల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తోంది. వీటిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ వంటి సమాఖ్య స్ఫూర్తిగల ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ శక్తులు గట్టిగా గొంతు విప్పితే కేంద్రాన్ని శాసించడంతోపాటు దక్షిణాదిని రక్షించుకోవచ్చు. రూ. వేల కోట్ల స్కాంలు చేసినా బీజేపీలో చేరగానే క్లీన్చిట్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ‘ఉంటే జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’అనేలా వ్యవహరిస్తున్నాయి. జగన్పై కేసులు, జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు. ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకొనేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే.వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ వచ్చింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, అజిత్ పవార్ రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా మోదీతో చేతులు కలిపిన వెంటనే వారికి క్లీన్చిట్ లభించింది.3 వేల మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా? రూ. 100 కోట్ల కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను జైల్లో పెట్టారు. ఇదే ఆరోపణలపై అరెస్టు అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలు అవుతారా? ఈ అరాచకాలను ప్రజాశక్తితోనే ఎదుర్కొంటాం. షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే మోదీ 2014లో, రేవంత్రెడ్డి 2023లో ప్రజలకు రంగుల కల చూపి అధికారంలోకి వచ్చారు. ప్రజలను ఊహల పల్లకిలో కూర్చోబెట్టడంతోపాటు కేసీఆర్ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు అనేక శక్తులను వాడారు. వై.ఎస్. షర్మిలను తెలంగాణలో ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలో కేసీఆర్ను బదనాం చేయడం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులను బీఆర్ఎస్కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ పని కాగానే షర్మిలను ఆంధ్రాలో ప్రయోగిస్తున్నారు. షర్మిలతో అక్కడా అదే ప్రయోగం చేయడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం. కాంగ్రెస్ నేతలే కూల్చుతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అసవరం లేదు. రేవంత్ చుట్టూ కాంగ్రెస్కు చెందిన ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. ప్రజలు 10–12 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ ప్రతిష్ట క్షేత్రస్థాయిలో దిగజా రుతోంది. ‘ఆర్ ట్యాక్స్ కడితేనే భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ఢిల్లీకి డబ్బు సంచులు పంపేందుకు బిల్డర్లు, రైస్మిల్లర్లను బెదిరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత ధోరణి రేవంత్రెడ్డి సీఎం పదవికి తగని చిల్లరగాడు. ఆయనవి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. రేవంత్ ప్రసంగాలను కుటుంబంతో కూర్చుని చూడలేని పరిస్థితి. ప్రజలను చిరకాలం ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని అనుకుంటున్నాడు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన మూడు పిల్లర్లను ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయట్లేదు. కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసేందుకే పంటల ను ఎండబెట్టారు. డిసెంబర్ 3న కేసీఆర్ తిరిగి సీఎం అయ్యుంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలను కాపాడేవారు.కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసిందిఇతర పార్టీల నుంచి చేరిన కొందరిని పూర్తిగా చదవకుండానే పదవులు ఇచ్చాం. కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది. పార్టీని వీడిన కడియం, రంజిత్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, దానం నాగేందర్ వంటి వారిపై బీఆర్ఎస్ కేడర్ కసితో ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ద్రోహులను దగ్గరకు తీయకుండా గుణపాఠం నేర్పుతాం. లోక్సభ ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటించి రిజర్వుడ్ స్థానాల్లోనూ ఉద్దండులను బరిలోకి దించాం. కనీసం 10–12 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉంది.రెఫరెండం ప్రకటనకు కట్టుబడి ఉండాలి మాట ఇచ్చి తప్పడం రేవంత్కు అలవాటు. కొడంగల్లో రాజకీయ సన్యాసమని మల్కాజిగిరిలో పోటీ చేశాడు. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అంటున్న రేవంత్ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు రాకుంటే పదవి నుంచి తప్పుకుంటారా? జిల్లాల సంఖ్య తగ్గిస్తామని రేవంత్ అనడం తుగ్లక్ పని. 33 జిల్లాల్లో ఒక్కటి టచ్ చేసినా తెలంగాణ తిరగబడుతుంది.జగన్ మళ్లీ గెలుస్తారు గుంటూరులో ఇంటర్ చదివా. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న దానిని బట్టి ఏపీలో వై.ఎస్. జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. జగన్ మళ్లీ గెలిచి వస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్ వంటి 13 పార్టీలు కూటముల రూపురేఖలను మార్చేస్తాయి. కాంగ్రెస్ను వెంటాడతాంకేసీఆర్ సీఎంగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను వెంటాడుతాం. ఏడు పదుల వయసులో మేజర్ సర్జరీ జరిగినా.. కర్ర సాయంతో నడుస్తూ, కూతురు జైల్లో ఉన్నా, ఎర్రటి ఎండలున్నా, నమ్ముకున్న నాయకులు పార్టీని వీడుతున్నా, రేవంత్ పరుషంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూరేలా కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
హైదరాబాద్పై కన్నేశారు.. జాగ్రత్త!
కరీంనగర్/ వేములవాడ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటీలతో కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్పై కన్నేశారు.. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే ఉంది.వారితో ఒరిగేదేమీ లేదు..2014 నుంచి కేంద్రంలో బడేభాయ్ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్ అమలు చేయలేదు. హైదరాబాద్కు ప్రకటించిన ఐటీఐఆర్ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement