-
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. అసలు అలాంటి ఆలోచన మా ఎజెండాలోనే లేదు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలు చాలా ఎక్కువ. అలాంటి కారణాలతో ప్రభుత్వం కూలిపోతే మాకు సంబంధం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు కావొస్తుంది. మరో నాలుగున్నరేళ్ల పాటు మాకు వేచి చూసే ఓపిక ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాం. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడి అధికారం సాధించే దిశగా కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి పదేళ్లు పట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్లు చాలా ఎక్కువ’ అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు దేశంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన మాకు ఏమాత్రం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉద్ఘాటించారు. జహీరాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లను తొలగించేది లేదని మోదీ చెప్పిన తర్వాత కూడా సీఎం హోదాలో ఉండి రేవంత్రెడ్డి నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అర్థం చేసుకున్న రేవంత్.. కాంగ్రెస్లో తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఆవిధంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ’’ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర ఎవరిది?. పత్రికాస్వేచ్ఛను హరించిందెవరు?’’. అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా, ఓడినా దేశానికి ఏ మాత్రం లాభం ఉండదన్నారు. తెలంగాణకు కేంద్రం 9.5లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం రూ.9.5 లక్షలకోట్లు తెలంగాణకు ఇస్తే.. గాడిద గుడ్డు అని విమర్శిస్తారని,, ఈ విమర్శలు చూసి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కిషన్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల గేమ్ ఛేంజర్గా రూ.26వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తన చొరవతో వచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ పనులకు శంకుస్థాపన చేయొద్దనే కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందన్నారు. ‘మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలకు ఆత్మగౌరవాన్ని కాపాడింది మోదీ ప్రభుత్వం. అందుకే దేశంలోని ముస్లిం మహిళలు మోదీని అన్నగా, తమ్ముడిగా భావిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఆ రెండు దేశాలతో మాట్లాడి 25వేలమంది భారతీయులను బయటకు తీసుకొచ్చిన ఘనత మోదీదే. ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్.. ‘ఆయుష్మాన్ భారత్’పేదలకు అందించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’మోదీ ఘనత. దీన్ని మరో ఐదేళ్లవరకు ఈ ఉచిత ఆహార పథకాన్ని పేదలకు అందించాలని నిర్ణయించాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలనేది మోదీ ఆలోచన. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేది బీజేపీ నినాదంగా కాకుండా ప్రజానినాదంగా మారింది. మణిపూర్ సున్నితమైన అంశం. ప్రాణనష్టం పెద్దమొత్తంలో లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉక్కు నాణ్యత సరిపోదని స్పష్టమైంది. ఓటు రాజకీయాల కోసం కాదు.. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వ్యర్థం చేసే ఆలోచన మాకు లేదు. సికింద్రాబాద్లో రూ.720 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 25% పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం తరహాలో ఈ రైల్వేస్టేషన్ ఉండబోతోంది. నాంపల్లి రైల్వేస్టేషన్, కాచిగూడ స్టేషన్ రీ డెవలప్ మెంట్ చేస్తున్నాం. రూ.300 కోట్లతో చర్లపల్లిలో కొత్త టరి్మనల్ నిర్మించాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ. బీజేపీలో ఇతర పారీ్టల నాయకులు చేరితే స్వాగతిస్తాం. అలాగని వారిపై ఉన్న కేసుల దర్యాప్తు ఆగదు.’’అని కిషన్రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్రెడ్డి
కె.రాహుల్తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకే అనుకూల వాతావరణం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్బూత్ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. హైదరాబాద్ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. రేవంత్కు ముందుంది ముసళ్ల పండుగ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం. -
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కిషన్రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్.. దద్దమ్మ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో లెక్కలేనన్ని హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ వాగ్దానాలతో లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో శుక్రవారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ కల్ల»ొల్లి హామీలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి.. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పారీ్టకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఉచిత విద్యుత్ ఎక్కడా అమలు జరగడం లేదనీ, అందరికీ కరెంట్ బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్ప టికే ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్న కిషన్రెడ్డి.. ఊళ్ల లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీ ల అమలు ఏమైందంటూ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేశారు. అలాగే రైల్వేల కో సం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. మోదీ వచ్చాక ఎన్ని నిధులు వచ్చాయో చర్చకు రావాలని రేవంత్రెడ్డిని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. చేతి గుర్తు బదులు గాడిద గుడ్డు పెట్టుకున్నారేమో? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి పసలేదని విమర్శించిన కిషన్రెడ్డి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి కింద పడేసి చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. ’’గ్యారంటీల పేరుతో గాడిద గుడ్డు ఇచ్చారు. తమ ఎన్నికల చిహ్నం చేతి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు గుర్తు పెట్టుకున్నారేమోనని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ధ్వజమెత్తిన కిషన్రెడ్డి.. దానికి కర్త కర్మ క్రియ బీజేపీనే అని స్పష్టం చేశారు. ప్రజావాణి దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారని నిలదీశారు. ప్రజావాణిలో కనీసం సీఎం ఒక్క రోజు కూడా పాల్గొనలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది? తెలంగాణలో ఏ మార్పు మొదలైందని హైదరాబాద్లో బోర్డులు పెడుతున్నారని కిషన్రెడ్డి నిలదీశారు. కేసీఆర్ కుటుంబ పాలన పోయి సోనియా కుటుంబ పాలన వచి్చందని ఆరోపించారు. ‘28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉంచిన నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. అవన్నీ ఏమయ్యాయి? తెలంగాణలో రేషన్ కార్డులు ఇస్తున్నారా? సింగరేణి కార్మికులకు కోటి బీమా కల్పించారా ? ఒక్క మహిళ సంఘానికైనా వడ్డీ లేని రుణం ఇచ్చారా’అని కిషన్రెడ్డి నిలదీశారు. ఇప్పటికీ ఒక్క తెల్లరేషన్ ఇవ్వకపోగా ఇచి్చనట్లు హోర్డింగులతో అడ్వర్టైజ్మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామంటూ, దావోస్ నుంచి రూ.40 ,232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల బీమా కల్పించినట్లు మెట్రో పిల్లర్లపై హోర్డింగులతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మార్కును చూపించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఐటీ కంపెనీల యజమానులు చేరిక శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ఐటీ కంపెనీల యజ మానులు, ఉద్యోగులు, వరంగల్ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్రావు ఆధ్వర్యంలో పలు వురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి కిషన్రెడ్డి పారీ్టలోకి ఆహా్వనించారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. -
తప్పుడు ప్రచారంతో బురదచల్లే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, మాకు కవచం తెలంగాణ ప్రజలే. నరేంద్రమోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను పాతరేయడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. బుధవా రం పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవ ర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కల్పన, డివిజన్ అధ్యక్షులు, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లా డారు.‘బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్గాంధీ నాయకత్వం అవసరం లేదని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మోదీ మాత్రమే సమగ్రమైన, సుస్థిర మైన, సమర్థవంతమైన పాలన ఇవ్వగలరనే ఉద్దేశంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజలంతా ఆదరిస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోయి బీజేపీపై ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు నోట్లు కేసులో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టుగానే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవి నీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తోంది.బీజేపీని గెలవనీయొద్దనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్–బీఆర్ఎస్ డూ ప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్–కాంగ్రెస్ రాజకీయ డ్రామా కార్య క్రమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. వారంరోజులుగా సీఎం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల వేళ తలపై గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నడు. ఆ గుడ్లు తలపై పెట్టుకొని 5 నెలల పాలనలో తాను ప్రజలకిచ్చే ది ఇదేనంటూ ప్రజలకు వివ రిస్తున్నడు. ఆస్థాయికి దిగజా రిండు. ఎన్నికలకు వెళ్లేటప్పు డు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిన పనులు చేయాల్సిన పనులను వివరిస్తుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొది లేసింది. మళ్లీ ఆగస్టు 15న రుణమాఫీ అంటూ ఊదరగొడుతున్నా రు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడటం లేదు’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ది దిగజారుడుతనం‘రాష్ట్రంలో మోదీ, బీజేపీకి ఆదరణ, మద్దతు పెరుగుతోంది. దీనిని తట్టుకోలేక మార్ఫింగ్ వీడియోలతో బీజేపీపై బురదజల్లుతూ కాంగ్రెస్ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. టెలిఫోన్ ట్యాపింగ్తోపాటు హోంమంత్రి వీడియో మార్ఫింగ్ అంశాలు రెండు నేరమే. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధా లు చెబుతుంటే, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఈ విషయంలో మొదటి ముద్దాయి సీఎం. మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అందులో ఏ వ్యక్తి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. రేవంత్రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మి దిన్నరేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చా రనే దానిపై చర్చకు సిద్ధం కావాలి. ప్రెస్క్లబ్లో లేదా తెలంగాణ అమరవీరుల స్థూపంలేదా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం..ఏ చోటనైనా రేవంత్రెడ్డితో చర్చకు నేను సిద్ధం. గాడిద గుడ్లు నెత్తిన పెట్టుకోవడం కాదు.. తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.రేవంత్రెడ్డి.. ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా..? ‘పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ మాట్లాడిన రేవంత్రెడ్డి.. ఈరోజు తన కాళ్లకింద భూమి కదిలిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోజుకో విధంగా మాట్లాడుతున్నాడు. గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి పోటీ అని రేవంత్రెడ్డి అంటున్నడు. రేవంత్రెడ్డి అసలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా? టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్రెడ్డి. ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. మీ ఇటలీ పౌరుషానికి, అవినీతి పౌరుషానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. గుజరాత్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే ఇటలీది. ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఒకరికొకరం తోడు అంటూ కేసీఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నరు’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement