-
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్తో స్పెషల్గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్
-
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. -
ఎన్టీఆర్పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement