-
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్చంద్రపవార్) నేత శరద్పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్పవార్తో కలిసే అవకాశం లేదని శరద్పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి
నూతనంగా కొలువుదీరిన 18వ లోక్సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో కూడా మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి.2024 లోక్సభ ఎన్నికలు ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పోకడను సూచిస్తాయి. దీనిపై విశ్లేషించడానికి, వేడుక జరుపుకోవడానికి చాలా ఉంది కానీ, ఒక రంగంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేశాం. 18వ లోక్సభలో 469 మంది పురుషులతో పాటు 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. 74 మందితో కూడిన ఈ మహిళా బృందంలో కచ్చితంగానే అనేక మంది శక్తిమంతమైన, చిత్తశుద్ధిగల, కష్టపడి పనిచేయగల ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతంగా మాత్రమే ఉన్నారు. ఈ వాటా దారుణంగా వక్రంగా ఉండటమే కాకుండా, 2019 ఎన్నికల్లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.2024 ఎన్నికలు జరిగిన సందర్భాన్ని పరిశీలిస్తే, మహిళా పార్లమెంటరీ ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ అభివృద్ధిని నమోదు చేసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. ఈ బిల్లు అమలులోకి వచ్చాక మహిళల సీట్లు వారికే కేటాయించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సరిపోదు!గత ఏడాది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడమే కాకుండా, ఈ చారిత్రాత్మక పరిణామంలో తమకూ పాత్ర ఉందని ప్రకటించుకున్నాయి. పైగా, ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమైన ఓటర్లుగా ఉన్నారు. పార్టీల మేనిఫెస్టోలు, అగ్ర నాయకుల ప్రచార ప్రసంగాల నుండి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వరకు, సుదీర్ఘకాలం సాగిన ఎన్నికల సీజన్లో భారతీయ మహిళ చాలా స్పష్టంగా (కొంతవరకు సమస్యాత్మకంగా) తన ఉనికిని కలిగి ఉంది.అయితే ఈ ఊహాగానంలో మహిళలు ఓటర్లు, లబ్ధిదారుల పాత్రకే పరిమితమయ్యారు, రాజకీయ సోపానక్రమాలలో సమానమైన భాగస్వామ్యానికి అర్హులైన మహిళా నాయకులు, ప్రతినిధులు లేకుండాపోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంకలనం చేసిన డేటా ప్రకారం, ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు (పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థుల్లో మహిళలు 11 శాతం మంది). అభ్యర్థులలో మహిళల వాటా తొమ్మిది శాతంగా ఉన్న 2019 సంవత్సరం నుండి చూస్తే ఇది చాలా కొద్ది మెరుగుదల మాత్రమే అని చెప్పాలి. పైగా పుండుపై కారం జల్లినట్టుగా, ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది మహిళలు తమ తోటివారి నుండి స్త్రీద్వేష వ్యాఖ్యలను, అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు.ఈ విధంగా కొద్ది మంది మహిళలే ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికైనవారిలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పార్లమెంట్లు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం దాని సహచర పార్లమెంట్ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు, 2023లో, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి. వీటిలో సగటున, 27.6 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని, ఇంటర్–పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న మొత్తం ఎంపీలలో మహిళలు 26.9 శాతం ఉన్నారు. 18వ లోక్సభ ఎన్నికలకు ముందు, ఐపీయూ డేటా ప్రకారం, ఈ పరామితిలో మొత్తం 185 దేశాలలో భారతదేశం 143వ స్థానంలో ఉంది. కొత్త పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో, మన దేశ ర్యాంకింగ్ మరో ఐదు లేదా ఆరు స్థానాలు పడిపోయే అవకాశం ఉంది.మెక్సికో నుండి ఒక ఉదాహరణభారతదేశంలో ఎన్నికల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు, ప్రపంచంలోని మరొక భిన్నమైన ప్రాంతంలో మరో చారిత్రక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రాజ్యాంగ పదవులకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి మెక్సికోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అక్కడ క్లాడియా షీన్బామ్ అత్యున్నత పదవికి చక్కటి మెజారిటీతో ఎన్నికయ్యారు. మెక్సికో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కానీ పురుషులకే పరిమితమైన దుర్బేధ్యమైన కంచుకోట బద్దలవడం ఒక ఉల్లంఘన కాదు, మెక్సికో తన రాజకీయాలను మరింత ప్రాతినిధ్యంగా మార్చే ప్రయాణంలో ఇదొక తార్కికమైన తదుపరి దశ మాత్రమే.గత కొన్ని దశాబ్దాలుగా, అట్టడుగు స్త్రీవాద ఉద్యమాల ద్వారా ముందుకు సాగిన మెక్సికో, తన రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి చట్టబద్ధమైన సంస్కరణల సమితిని ప్రవేశపెట్టింది; అమలు చేసింది కూడా. చట్టం ప్రకారం ప్రతిదానిలో, అంటే ప్రభుత్వంలోని అన్ని రంగాలలో సమానత్వం అవసరం. అలాగే ఎన్నికలలో లింగ సమానత్వంతో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఉంచాలని ఆదేశించింది. ఈ సంస్కరణల ఫలితంగా, మెక్సికో అనేక ముఖ్యమైన రాజకీయ ఉన్నత పదవులను ఆక్రమించిన మహిళలతో పాటు, దాని పార్లమెంటు ఉభయ సభలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కలిగి ఉంది. 2024లో, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం, ఆ దేశ చరిత్రలో దేనితోనూ పోల్చలేని అరుదైన పరిణామం.అయినంతమాత్రాన మెక్సికోలో సమస్యలు లేవని చెప్పలేం. అక్కడ రాజకీయ, లింగ ఆధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే లింగ నిర్ధారిత నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకమైన, ఆలోచనాత్మకమైన సంస్కరణల ద్వారా పురోగతి సాధ్యమవుతుందని ఇది చూపిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా తమ రాజకీయాలను, పార్లమెంట్లను మరింత ప్రాతినిధ్యంగా ఉంచుతూ, సమానంగా మహిళలను కలుపుకుపోయేలా, లింగపరమైన సున్నితత్వంతో మలచడానికి చిన్న, పెద్ద రెండు చర్యలనూ తీసుకున్నాయి.మనమందరం బాధ్యులమే!స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఎగువ నుండి సంస్కరణ అవసరం. కానీ పురోగతిని నిర్ధారించే అంతిమ బాధ్యత మన రాజకీయ పార్టీల భుజాలపైనే ఉంటుంది. మహిళా ప్రాతినిధ్యంలో ఈ పతనాన్ని చిన్నవిషయంగా చూడకూడదు. మహిళల (ప్రత్యేకించి సాంప్రదాయకంగా అట్టడుగున ఉన్న సమూహాల) భాగస్వామ్యాన్ని ప్రారంభించే విషయానికి వస్తే, పురోగతి చాలా అరుదుగా సరళంగా ఉంటుంది. పైగా దానికి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయంలో శాశ్వతమైన జాగరూకత చాలా అవసరం. అలాగే మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి.అక్షీ చావ్లా వ్యాసకర్త పరిశోధకురాలు, అశోకా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్’(సీఈడీఏ)లో పనిచేస్తున్నారు -
‘‘వయనాడ్, రాయ్బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
ఉద్ధవ్ థాక్రే నష్టపోయారు: బీజేపీ నేత కీలక కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్తో పాటు భూపేందర్యాదవ్కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్పాల్సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
ఒడిశా: పాలిటిక్స్కు వీకే పాండియన్ గుడ్బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
యూపీలో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లక్నో: లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది. సమాజ్వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ రాయ్బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్కు చెందిన దుర్గేష్పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
అమాత్య పదవిపై ఆశలు!
కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు అమాత్య పదవులపై కన్నేశారు. మంత్రి పీఠం ఎక్కేందుకు ముచ్చటపడుతున్నారు. దర్జాగా బుగ్గ కారులో తిరిగాలని ఆశపడుతున్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న కూటమి ప్రభుత్వంలో అధికారం అనుభవించాలని తహతహలాడుతున్నారు. కేబినెట్లో చోటు దక్కించుకుని పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఆశవహులు తమ అధినేతల ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కారులో ఉన్నత స్థానం పొందేందుకు చిత్తూరు ఎంపీ సైతం పోటీపడుతున్నారు.సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కూటమి గెలుపొందింది. త్వరలోనే కేబినెట్ కూర్పు జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. మంత్రి పదవులకు వచ్చేసరికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. జిల్లాలోనే సీనియర్ కావడం, గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, చంద్రబాబు, లోకేష్తో మంచి సంబంధాలు ఉండడం ఆయనకు కలిసిరానున్నట్లు సమాచారం. ఓసీ కోటా కింద ఒకరికి ఇవ్వాల్సి వచ్చినా.. చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్రెడ్డికే ఛాన్స్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓసీలకు అవకాశం లేదంటే.. ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు పూతలపట్టు నుంచి గెలుపొందిన మురళీమోహన్, మరొకరు గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే థామస్. ఈ ఇద్దరిలో మురళీమోహన్కి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కావడమే అందుకు కారణం . నగరి, చిత్తూరు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, జగన్మోహన్కి మంత్రి పదవి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.తిరుపతి జిల్లా జాబితా పెద్దదేజిల్లాలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి సారి గెలుపొందిన వారి జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా విజయశ్రీ ఉన్నారు. మహిళల కోటా కింద మంత్రి పదవి వరిస్తే.. విజయశ్రీకే అవకాశాలు ఉన్నాయి. బొజ్జల సుధీర్రెడ్డి విషయానికి వస్తే.. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ని దింపేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఆ కోణంలో ఆలోచిస్తే బొజ్జల సుధీర్రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశముంది. సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ కురుగొండ్ల రామకృష్ణ. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ల జాబితాలో ఇస్తే గిస్తే వెంకటగిరి ఎమ్మెల్యేనే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఎస్సీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. ఆదిమూలం లేదా పాశం సునీల్కుమార్.. వీరిలో ఎవరికో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం దక్కవచ్చు.జనసేన కోటాలో ఆరణికి అవకాశంకూటమిలో జనసేన పాత్ర కీలకం. ఈ కూటమి ఏర్పడడానికి జనసేన అధినేత పవన్కల్యాణ్ కారణం. బీజేపీని ఒప్పించి టీడీపీతో జట్టు కట్టించారు. ఈ మూడు పార్టీలు ఏకమవడంతోనే అధికారం దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో సారి ఎమ్మెల్యే కావడం కూడా ఆయనకు కలిసి రానుంది.కేంద్ర మంత్రి పదవిపైనా కన్ను!చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాద్రావు కేంద్ర మంత్రి పదవిపై కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. -
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్పూర్లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్లో ఈ విషయం తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్సభతోపాటు అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
మోదీ 3.0.. చిరాగ్కు కేబినెట్ బెర్త్ ?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్పాశ్వాన్కు ఒక కేబినెట్ బెర్త్తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు. -
చంద్రబాబు, నితీశ్కు అందరూ స్నేహితులే: సంజయ్రౌత్
ముంబై: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్ బెనర్జీ సెటైర్లు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో వెస్ట్బెంగాల్లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్లో తృణమూల్కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్కు ఒకటి వచ్చాయి. -
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. -
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
కీలక రాష్ట్రాల్లో ’ఇండియా‘కు అనూహ్య లీడ్
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంగళవారం 12 గంటల వరకు వెలువడ్డ ఫలితాలు బీజేపీకి కొంత మేర నిరాశ కలిగించినట్లు కనిపిస్తోంది. భారీ విజయం సాధిస్తామనుకున్న వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి సొంతగా మ్యాజిక్ ఫిగర్ను దాటడం బీజేపీకి అంత సులువుకాదని ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు ఫలితాల్లో బీజేపీ సొంతగా 238 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సొంతగా 95 స్థానాల్లో, ఇండియా కూటమి 230 సీట్లలో లీడ్లో కొనసాగుతోంది. ఇతరులు 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఎన్డీఏ,ఇండియా కూటముల వారిగా చూసుకుంటే ఎన్డీఏ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు బీజేపీ దూకుడుకు కళ్లెం వేశాయి. యూపీలో ఇండియా కూటమి 42, మహారాష్ట్రలో 28, తమిళనాడు 37, కేరళ 17 సీట్లలో లీడ్లో కొనసాగుతూ ఎన్డీఏ కూటమిపై ఆధిక్యాన్ని ప్రదిర్శిస్తోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీ బీజేపీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ బీజేపీకి ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏలకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త తప్పినట్లు తెలుస్తోంది. -
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. -
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్మీట్లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన. -
ప్యాసింజర్ వాహనాలు.. స్లో
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది. ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్క్రాస్, ఎక్స్ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు. ఇతర దిగ్గజాల తీరిలా..⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు. ⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు విక్రయించింది. ⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది. ⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్సేల్గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది. ⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. ⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది. -
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు. -
అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్కు ఈసీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం(జూన్2) కోరింది. ఈ మేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది. ఎన్నికల కౌంటింగ్పై అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేశారని జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని, వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలుంటే సమర్పించండని ఈసీ జైరామ్రమేశ్ను కోరింది. ఆధారాలు చూపితే తగిన చర్యలు తీసుకుంటామని రమేష్కు ఈసీ లేఖలో తెలిపింది. హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా తెలుస్తోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని జైరాం రమేష్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
పంఘాల్ పంచ్..
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ చిరుత సక్సెస్
హై క్లాస్ దొంగ
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
వానా.. వానా.. వల్లప్పా!
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
బ్రిటన్ ఒపీనియన్ పోల్స్.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?
Advertisement