-
చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షమవడంతో..
టీ.నగర్: కారైకుడి సమీపంలో మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలో గల కల్లుపట్టికి చెందిన చిన్నకన్ను(46) పదేళ్ల కిందట భార్యను వదిలేశాడు. పాతసామాన్లు అమ్ముకుని జీవనం సాగించేవాడు. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో 10 నెలల క్రితం ఇళ్లు విడిచి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం కులికర్తి సమీపాన అటవీ ప్రాంతంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడ విచారించగా స్థానికులు చిన్నకన్నులా ఉన్నట్లు తెలిపారు. దీంతో వారి బంధువులు, సోదరి మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. శివగంగై ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. చిన్నకన్ను మృతిచెందిన సమాచారం అందడంతో అతన్ని విడిచి వెళ్లిన భార్య వలర్మతి, బంధువులు కల్లుపట్టికి చేరుకున్నారు. మృతదేహాన్ని తీసుకునేందుకు శివగంగై వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడున్న బంధువు ఒకరు దేవకోటైలో రెండురోజుల క్రితం చిన్నకన్నును చూసినట్లు తెలిపాడు. బంధువులంతా దేవకోటైలో ఉండగా ఊపిరి పీల్చుకున్నారు. -
మార్చురీలో బాడీని కోస్తుండగా కళ్లు తెరిచాడు
కెరిచో: ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం మనిషి బతికుండగానే మార్చురీలో పడుకోబెట్టేలా చేసింది. చనిపోయాడనుకున్న వ్యక్తిని అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా స్పృహలోకి రావడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కెరిచో దేశానికి చెందిన ముప్పై రెండేళ్ల పీటర్ కైగెన్ కడుపు సంబంధిత సమస్యలతో కప్లాటెట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఓ నర్సు అతడు చనిపోయినట్లు రోగి కుటుంబానికి తెలిపింది. దీంతో సిబ్బంది అతడిని మార్చురీ గదిలోకి తరలించారు. అంత్యక్రియలు జరిపేవరకు అతడి శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు సిబ్బంది ఎంబాలింగ్ ప్రక్రియను చేపట్టారు. (చదవండి: షాకింగ్ వీడియో: యువతి మృతదేహాన్ని..) అందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంతలో అతడు నొప్పితో కళ్లు తెరిచి, కేకలు పెట్టగా చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వచ్చిందని సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికే అతడు చనిపోలేదని నిర్ధారణకు క్యాజువల్ సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన గురించి కైగెన్ సోదరుడు మాట్లాడుతూ.. "మార్చురీలో ఉన్న వ్యక్తి కంగారుగా మా దగ్గరకు వచ్చి లోపలకు రమ్మన్నారు. అక్కడ కైగెన్ శరీరంలో కదలికలు చూసి షాకయ్యాం. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందనేది మాకే అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది" అని చెప్పుకొచ్చారు. మరోవైపు కైగెన్ మాట్లాడుతూ.. 'ఇది నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోయానని డాక్టర్లు ఎలా చెప్పారు? అసలు ఎప్పుడు స్పృహ కోల్పోయానో, ఎప్పుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చానో నాకే తెలీట్లేదు. ఏదేమైనా నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) -
ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!
వాషింగ్టన్: అద్బుతమైన దృశ్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికిన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మంచు కొండ పర్యటనకు వెళ్లిన వ్యక్తి.. అక్కడి మంచులో కూరుకుపోవడంతో అతడిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ 45 నిమిషాల తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించడంతో అతడు మృత్యుంజయుడు అయ్యాడు. ఇంతకి ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాకు చెందిన మైఖేల్ నాపిన్క్సి. 45 ఏళ్ల వయసున్న అతడు కాలినడకన దేశ పర్యటన చేస్తుంటాడు. ఈ క్రమంలో గతవారం తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్లోని మంచుకొండకు కాలినడకన పర్యటనకు వెళ్లాడు. నాపిన్క్సి, అతడి స్నేహితుడు చెరో దిక్కున పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు. అయితే వీరిద్దరూ తిరిగి కలుసుకునే చోటును ముందే నిర్ణయించుకున్నారు. (చదవండి: వైరల్: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు) సాయంత్రమైనా నాపిన్క్సి తాము అనుకున్న చోటికి తిరిగి రాకపోవడం అతడి స్నేహితుడు సహాయక బృందానికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం హెలికాప్టర్తో గాలింపు చర్యల చేపట్టింది. ఈ క్రమంలో కొద్ది సమయానికి నాపిన్క్సిని గుర్తించి రక్షించిన టీం హుటాహుటిన స్థానిక హాస్పిటల్కు తరలించింది. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికి పల్స్ మాత్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. సీపీఆర్ చేసి అతడిలోని అధిక కార్బోరియల్ మెమ్బేన్ ఆక్సిజనేషన్(ఇసీఎంఓ) యంత్రంతో చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు జెనెల్లా బదులక్ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఈ ఇసీఎంఓ శరీరం నుంచి రక్తాన్ని గుండెకు పంప్ చేసి కార్భన్ డై ఆక్సైడ్ను తొలిగిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 45 నిమిషాల తర్వాత నాపిన్స్కి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. (చదవండి: రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు) -
చచ్చిందొకరు.. అంత్యక్రియలు మరొకరికి
సాక్షి, జైపూర్ : స్పష్టత కొరవడితే ఎలా ఉంటుందో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన ఓ నిదర్శనం. చనిపోయాడనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. శోక సంద్రంలో మునిగిపోయి అంతా రోదిస్తుండగా... కొద్ది గంటలకే ఆ వ్యక్తి ప్రాణాలతో ప్రత్యక్ష్యమయ్యాడు. అంతే ఆ కుటుంబ సభ్యుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. హనుమాన్ఘడ్ జిల్లా గోలువాలా జిల్లా వాసి అయిన కులామర్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా అదృశ్యం అయ్యాడు. పైగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో.. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించటం మొదలుపెట్టారు. అదే సమయంలో దలిన్వాలి గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించగా.. గుర్తుతెలియని మృతదేహమంటూ పేపర్లో పోలీసులు ప్రకటన ఇచ్చారు. అది గమనించిన కులామర్ సోదరి రాజో దేవీ(27) చనిపోయింది తన సోదరుడేనంటూ కొందరు గ్రామ పెద్దల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఓ మహిళతో తన సోదరుడు కొద్ది రోజుల క్రితం ఏటో వెళ్లిపోయాడని.. బహుశా ఆ మహిళే అతనిని హత్య చేసి ఉంటుందని రాజోదేవీ అనుమాన వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు శవాన్ని అప్పగించి.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే కులామర్ హత్య విషయంలో ఏవైనా సాక్ష్యాలు లభిస్తాయన్న ఉద్దేశ్యంతో అతని బంధువొకరు మరోసారి అతని ఫోన్ నంబర్కు ప్రయత్నించాడు. ఈసారి అవతలి వైపు ఫోన్ హలో చెప్పింది కులామరే కావటంతో బంధువులు షాక్ తిన్నారు. ఫోన్లోనే జరిగిన విషయాన్ని అతనికి వివరించగా, వెంటనే తన స్వగ్రామానికి చేరుకుని తాను బతికే ఉన్నానంటూ రుజువు చేశాడు. తన ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోవటంతో తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చేరవేయలేకపోయానని అతను చెప్పాడు. దీంతో రాజో దేవీ తాను శవాన్ని గుర్తించటంలో పొరపాటు చేశానని ఒప్పేసుకుంది. ఇక అంత్యక్రియలు నిర్వహించిన ఆ బాడీ ఎవరిదన్నది గుర్తించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. -
హతమయ్యాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
పరిగి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఏడాది తర్వాత ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇదే సమయంలో అప్పట్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జనం మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురం శివారులోని జయమంగళి నదిలో 2013 మార్చి 20న గుర్తు తెలియని వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పటి హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, పరిగి ఎస్ఐ సుధాకర్యాదవ్ కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పి అమాయకులను కేసులో ఇరికించారు. గ్రామానికి చెందిన దాళప్ప బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లగా.. జయమంగళి నదిలో లభించిన మృతదేహం అతడిదేనని తేల్చేశారు. అదే గ్రామానికి సత్యనారాయణ అలియాస్ సత్తి, నరసింహమూర్తి, మోదా గేటుకు చెందిన జిక్రియా అతడిని చంపారని.. వారిని నిందితులుగా గుర్తించి ఈ ఏడాది జనవరి 23న కోర్టులో హాజరు పరిచారు. హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పిన దాళప్ప బుధవారం ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు నిందితులుగా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement