-
విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
TS: కరెంట్ షాక్తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం శుక్రవారం రాత్రి తన బావమరిది ఎం.శివతో కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలు తీయడంతో తీగలు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో సుబ్రమణ్యం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కన్న తల్లిని హతమార్చిన కూతురు వాల్మీకిపురం : కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిని హతమార్చిన సంఘటన వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకొంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహళ్ నివాసి యర్రక్క (43) స్థానికంగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేది. కుటుంబ కలహాలతో ఆదివారం కూతురు నందిని, అల్లుడు శివరాంలు ఐరన్ రాడ్, కట్టెలతో కొట్టి యర్రక్కను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నాగేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం మదనపల్లె : తాను ఇప్పించిన రుణం చెల్లించకపోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్థాపం చెంది, వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె లో జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన తిరుపాల్ నాయక్ భార్య తిరుపాలమ్మ (42), స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉన్న స్వరూపారాణి పట్టణంలో హోటల్ నిర్వహిస్తోంది. దీంతో వ్యాపార అవసరాల కోసం తిరుపాలమ్మను నగదు రుణంగా కావాలని కోరింది. ఆమె సుమారు పది లక్షల రూపాయల వరకు స్వరూప రాణికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని అప్పుగా ఇచ్చింది. అయితే స్వరూపారాణి తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో, తిరుపాలమ్మ ఆమెను అప్పు చెల్లించాల్సిందిగా నిలదీసింది. స్వరూప రాణి అప్పు చెల్లించకపోగా దాడికి పాల్పడింది. దీంతో మనస్థాపం చెందిన తిరుపాలమ్మ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
అయిజ: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని రజక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పెద్ద కుమారుడు యుగేంధర్ (32) ఆదివారం నిర్మాణ దశలో ఉన్న గోడలకు నీళ్లు చల్లేందుకు వెళ్లాడు. అక్కడ వి ద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీటి సంపులో పడి చిన్నారి.. జడ్చర్ల: ఇంటి ఆవరణలోని నీటి సంపులో చిన్నారి పడి మృతి చెందిన ఘటన ఆదివారం స్థానిక కావేరమ్మపేటలో చోటు చేసుకుంది. కావేరమ్మపేటకు చెందిన గండు వినోద్, పుష్పమాల కూతురు రియాన్సిక(2) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. కొద్దిసేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నీటి సంపులోకి తొంగి చూడగా చిన్నారి కనిపించడంతో బయటకు తీసి చూడ గా అప్పటికే మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. అచ్చంపేట రూరల్: అమ్రాబాద్ మండలం ఈదులబావికి చెందిన మోటమోని రాజు (55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. ఈనెల 10న అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారుగొలుసు చోరీకి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. బిజినేపల్లి మండలం పోలేపల్లికి చెందిన అలివేలమ్మ ఆర్టీసీ బస్సులో నాగర్కర్నూల్కు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. అలివేలమ్మ జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత గొలుసును చూసుకోగా లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. కారు డ్రైవర్పై కేసు నమోదు వెల్దండ: వెల్దండ మండలం కొట్రగేట్ వద్ద శని వారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్ రుక్మాకర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్కు చెందిన కొరివి రాకేష్ బైక్పై వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రాకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని యువకుడిపై దాడి మహమ్మదాబాద్: యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో యువకుడిని చితకబాధిన వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే మండలంలోని కప్లాపూర్ చెందిన మీర్జాపురం శేఖర్ కుటుంబీకులు అందరూ మహారాష్ట్రలో పూణెలో నివాసం ఉంటున్నారు. శేఖర్ గ్రామంలో ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా దయాదులతో ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇదే క్రమంలో పథకం ప్రకారం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తిరుపతయ్య, ఆయన కుమారులు మురళీ, గణేష్, అంజిలయ్య, కృష్ణ, విగ్నేష్ కలిసి శేఖర్ను చితకబాదారు. దీంతో బాధితుడి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు ఆదివారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బావపై బామ్మర్దుల దాడి ఉండవెల్లి: సొంత బావను బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో ఆదివారం ముగ్గురిపై కేసు నమోదైంది. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొంకూరుకు చెందిన బోయ తిరుమలేష్, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వారిద్దరికి మనస్పార్థాలు రావడంతో స్రవంతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పెద్దమనుషుల వదద పంచాయితీ చేశారు. కాగా తిరుమలేష్ పొలానికి వెళ్లే క్రమంలో స్రవంతి తమ్ముడు నరేష్ దూషించి తిరుమలేష్పై దాడి చేశాడు. తిరుమలేష్ విషయం తండ్రి పెద్ద అయ్యన్నకు చెప్పగా, వారిద్దరు కలిసి పోలీస్స్టేషన్ వెళ్తుండగా బామ్మర్దులు దేవేందర్, నరేష్, అత్త గోపాలమ్మ వారిపై దాడి చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement