-
ఏపీజీవీబీలో రూ.12 కోట్ల కుంభకోణం?
ఇస్నాపూర్ శాఖలో ఉద్యోగి నిర్వాకం పటాన్చెరు: పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్) శాఖలో రూ.12 కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని తెలు స్తోంది. ఖాతాల్లోని నగదును ఓ ఉద్యోగి తమకు తెలిసిన వారి ఖాతాల్లోకి మళ్లిం చారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంకు మేనేజర్ రమణమూర్తిని విలేకరులు ప్రశ్నించగా తమ బ్యాంకు శాఖలో ఉద్యోగి దుర్గాప్రసాద్ అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంత మొత్తం అనే దానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. దుర్గాప్రసాద్ కొద్ది రోజుల నుంచి బ్యాం కుకు రావడం లేదని చెప్పారు. ఎవరి ఖాతా నుంచి ఎంత సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఆడిట్ చేస్తున్నామని, మొత్తం ఎంత సొమ్ము పక్కదారి పట్టిందనే వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్ విధానంతో ఇతరుల ఖాతాల్లోని సొమ్మును దుర్గాప్రసాద్ పక్కదారి పట్టించారని భావి స్తున్నారు. సొమ్మును షేర్ వ్యాపారానికి మళ్లించారనే ప్రచారం సైతం ఉంది. రుణాల మంజూరులో బ్యాంకు ఉన్నతాధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ‘సాక్షి’కి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి దుర్గాప్రసాద్ హౌసింగ్ లోన్లను బినామీ ఖాతాల్లోకి మళ్లించారని ఆరోపించారు. కొంత కాలంగా లావాదేవీలు నిర్వహించి వారి పేర్లపై గృహ రుణాలు మంజూరు చేయించారని చెప్పారు. కుంభకోణం విషయమై బ్యాంకు అధికారులు పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేసినా దానిని మాత్రం ధ్రువీకరించలేదు. -
నా బిడ్డ ఆచూకీ తెలపండి సారూ..
కలెక్టర్, సీపీకి ఓ తల్లి మొర విజయవాడ : ‘నేపాల్ వెళ్లిన నా కొడుకు తిరిగి రాలేదు. అచూకీ తెలియటం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. నా మొరాలకించి న్యాయం చేయండి సారూ..’ అంటూ ఓ మహిళ మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నతాధికారులను వేడుకున్నారు. సత్యనారాయణపురంనకు చెందిన నాగెళ్ల రమణమ్మ క్యాంపు కార్యాలయం వద్ద నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ బాబు.ఏను కలిసి తన బిడ్డ జాడ తెలియడం లేదని మొత్తుకున్నారు. జూన్ 18వ తేదీన తన కుమారుడు నాగళ్ల చెన్నారావు (35) నగరంలో ముగ్గురు వ్యక్తులతో కలిసి నేపాల్ యాత్రకు వెళ్లాడని వివరించింది. జూన్ 29వ తేదీ వరకు తనతో ఫోన్లో మాట్లాడాడని, ఆ మరుసటి రోజునుంచి తనతో మాట్లాడలేదన్నారు. అతనితో పాటు నేపాల్ యాత్రకు వెళ్లిన ముగ్గురు జూలై 12న నగరానికి తిరిగి వచ్చారని ఆమె చెప్పారు. వారిని కలిసి తన కుమారుని గురించి అడిగానని, జూన్ 29న దామోదర కొండల వద్ద చెన్నారావు తమ నుంచి విడిపోయాడని చెపుతున్నారని రమణమ్మ వివరించారు. తన కుమారుని వారు ఏదైనా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె విలపించారు. కాగా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఈ విషయమై నేపాల్ అధికారులతో మాట్లాడుతానని ఆ మహిళకు చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూడా మహిళకు న్యాయం చేయాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement