-
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
తలకొండపల్లి, కల్వకుర్తి /కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ద్విచ క్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తలకొండపల్లి మండల పరిధి వెల్జాల్ సమీపంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలి లా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నారాయణ్రెడ్డి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్తుండగా రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్ (25) అక్కడిక్కడే మృతి చెందగా బైరపాక పరశురాం(35) గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం వెల్దండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. -
ఆ ఫార్చూనర్ కందికుంటదే!
అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ను రూ.2 కోట్ల వ్యవహారం ఇరకాటంలో పడేసింది. అనంతపురం నుంచి కదిరికి ఆయన కారులో తరలిస్తున్న సుమారు రూ.2 కోట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థి కారులోనే నగదును తరలిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో తనకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో కందికుంట ప్రలోభాలకు తెరతీశారు.డబ్బు ఎరవేసి ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి కదిరికి డబ్బు తరలిస్తుండగా..పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. నగదు తరలింపు వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. నగదు లభించిన ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబరు ఫార్చూనర్ కారు కందికుంట ప్రసాద్ పేరుతోనే రిజిస్టర్ అయింది. దీంతో ఎన్నికల సంఘం కందికుంటకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. నగదు తరలించడానికి కారణాలేమిటి? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కందికుంటకు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోనున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి అనంతపురానికి కందికుంట వాహనంలోనే రాంబాబు రాక డబ్బు తరలింపు వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన కందికుంట ప్రధాన అనుచరుడు రాంబాబు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కందికుంట ఫార్చూనర్ కారు సోమవారం కదిరి నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళ్లి.. అక్కడ రాంబాబును ఎక్కించుకుని అనంతపురం వచ్చింది. రాంబాబు సోమవారం రాత్రి నగరంలోని ఓ త్రీస్టార్ హోటల్లో బసచేశారు. మంగళవారం ఉదయం రాంబాబును అదే ఫార్చునర్ కారులో తీసుకెళ్లి రాంనగర్లో వదలి పెట్టారు. తర్వాత కందికుంట వాహన డ్రైవర్ ఆనంద్కుమార్ రాంనగర్లోని ఒక ఇంటికి వెళ్లి, అప్పటికే బ్యాగుల్లో ఉంచిన నగదును కారులో పెట్టుకున్నాడు. ముందు ఒక కారు (పైలట్ వాహనం), వెనుక కందికుంట ఫార్చునర్ కారు వెళ్లేలా ప్రణాళిక రచించుకున్నారు. అనంతపురంలోని విద్యుత్నగర్ సర్కిల్కు వెళ్లాక ముందు ఉన్న కారులో పోలీసులు తనిఖీ చేశారు. వెనుక ఉన్న కందికుంట కారు డ్రైవర్ పోలీసులను చూసి భయపడి కారులో ఉన్న నగదు బ్యాగులు పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు ఆ కారు రిజి్రస్టేషన్ వివరాలు పరిశీలించగా అది కందికుంటదని తేలింది. అప్పటికే ముందున్న కారులోని వ్యక్తులు వేగంగా వెళ్లిపోయారు. ఆ కారులో వెళ్లింది ఎవరన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంలో కందికుంట అనుచరుడు రాంబాబుతో పాటు మరోవ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.ఆదాయపన్ను అధికారుల విచారణ ప్రారంభం పోలీసుల తనిఖీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే ఆదాయపన్ను విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు దాదాపు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయాన్ని ఆదాయపన్ను శాఖకు తెలిపారు. ఆ శాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. నగదుకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారి విచారణ పూర్తయిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. ఏది ఏమైనా కందికుంట వెంకటప్రసాద్ చుట్టూ రూ.2 కోట్ల ఉచ్చు బిగుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కందికుంటకు అసలే నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కారులోనే డబ్బు పట్టుబడింది. దీంతో ఆయన ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు, ఆదాయపన్ను అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ పరిణామాలతో కందికుంట ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సొంత టీడీపీ వారు చెబుతున్నారు. -
షారుక్ ఖాన్ చిన్న పొరపాటు.. కోట్ల రూపాయల నష్టం!
స్టార్ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహానటుడు అలీ ఖాన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్.. షారుక్ కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్లో ఛేజ్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. -
ఇది కెమెరా అనుకుంటున్నారా..! కానే 'కాదు(రు)'
మనం ఇప్పటివరకు ఎన్నోరకాల కార్లను గురించి విన్నాము, అలాగే చూశాము కూడా. కానీ ఈ వింతైన కారు గురించి విన్నారా! చూస్తే అచ్చం కెమెరా మాదిరిగా ఉంటుంది. ఇందులో డ్రైవర్ లేకుండా, నిద్రపోతూ కూడా ప్రయాణం చేయవచ్చట. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా!ఇది అలాంటిలాంటి కారు కాదు. చక్రాల మీద నడిచే హోటల్ గదిలా ఉంటుందిది. దీనికి డ్రైవర్ కూడా అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి ఈ డ్రైవర్లెస్ కాన్సెప్ట్ కారుకు ‘స్విఫ్ట్ పాడ్’ పేరుతో జర్మన్ కంపెనీ ‘జోయియో’కు చెందిన నిపుణులు రూపకల్పన చేశారు.ఇందులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కూర్చోవడం బోరు కొట్టినప్పుడు లేదా నిద్రపోవాలనిపించినప్పుడు ఈ సీట్లను పరిచేసుకుంటే, అవి మంచాల్లా మారిపోతాయి. నిద్రపోతూ కూడా సుదూర ప్రయాణాలు సాగించడానికి వీలుగా ‘జోయియో’ నిపుణులు ఈ కారుకు రూపకల్పన చేయడం విశేషం. ఇందులోని నేవిగేషన్ సిస్టమ్ ద్వారా చేరుకోవలసిన దూరాన్ని, సమయాన్ని సెట్ చేసుకుంటే, అందుకు అనుగుణంగా ఈ కారు తన వేగాన్ని పుంజుకుంటుంది.కాస్త తీరిక ఉంటే, మార్గమధ్యంలో ఆగాల్సిన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటే, ఈ కారు ఆయా ప్రదేశాల్లో ఆగుతూ, కోరుకున్న రీతిలో ప్రయాణం సాగిస్తుంది. ఈ కారును ఎప్పుడు అందుబాటులోకి తేనున్నదీ ‘జోయియో’ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఇవి చదవండి: కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్.. -
ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు
కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్ నగర్కు చెందిన కుమార్ (45), జ్యోతి (38), సిరి అలియాస్ రాజీ (38) వన్గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముసునూరు టోల్ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో వారిని చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement