-
జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
-
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.ఈ పిటిషన్ ను పరిశఋలించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. -
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ తరపున ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్లకు టికెట్ ఇచ్చింది.దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్పీ ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement