-
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు?. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఏం తెలుసు?’’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా భూమి మాది కాకపోతే మరెవరిది.. రామోజీ.. అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, రాయరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే, ఇలాంటి తప్పుడు కూతలు, రాతలు. భూ వివాదాల్లో, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం కోర్టు పరిధిలో ఉంది.. రాష్ట్రంలో అమల్లో లేదు. వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో ఉన్నవారే, ఈ చట్టాన్ని వెపన్గా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ దుష్ప్రచారం చేసే కూటమి నేతలెవరూ ప్రజలకు కనిపించరు’’ అంటూ ధ్వజమెత్తారు.మంత్రి బొత్స మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:⇒ఏకంగా మీ భూమి మీది కాదు అంటూ రాతలు రాస్తున్నారు. అసలేంటీ రాతలు? నా భూమి నాది కాకపోతే మరెవరది? ⇒మరొక పేపర్లో, నేల చట్టంలో..నింగీ..గాలి అంటూ రాతలు రాశాడు⇒ఈ రాతలు పోలింగ్ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి. అప్పుడు వీళ్లకు, సామాజిక బాధ్యత ఏమీ ఉండదు.⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలనే⇒ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా? మీ మాట ఎవరు నమ్ముతారు? ⇒మీరు చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే, ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే⇒ఏ కోణంలో మీ భూమి మీది కాదో వాళ్లు సమాధానం చెప్పాలి⇒మీ అనుమానాలేంటి అడగండి.. నేను సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా మీ రాతలపై క్లారిటీ కావాలి కదా?⇒మీరు చేస్తున్న మాయ, మోసం, మీ కడుపు మంట ప్రజలకు తెలియాలి⇒రామోజీరావు, రాధాకృష్ణల బాధ కూడా ప్రజలకు తెలియాలి కదా? అడగండి..నేను సమాధానం చెప్తాదళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా పూర్తి హక్కులు కల్పించే చట్టం⇒ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది.⇒అవినీతికి తావులేకుండా, దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని మేం ఈ చట్టం తెస్తున్నాం⇒ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ⇒అందులో భాగంగానే ఇది జరుగుతోంది. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది. పబ్లిక్ హియరింగ్ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు.⇒ఈ లోపు మీటింగులు పెట్టి..., ఒకరు జోగిపోయి.., ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారు.⇒ఏకంగా ఈనాడు వారైతే మీ భూమే మీది కాదని రాసేస్తారు. ఏం ఖర్మ వచ్చింది వీళ్లకు?⇒మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ఏదైతే దళారులు, అవినీతిపరులు, లిటిగెంట్లు చేసే దగాను అరికట్టడానికే ఈ విధానం.⇒భారతదేశం యావత్తు దీనిలో లోపాలను సవరించి చట్టాలను తేవాలని నిర్ణయించింది.⇒అందులో భాగంగా మా ప్రభుత్వం కూడా దానిలో ఉన్న అన్నిటినీ అధ్యయనం చేస్తోంది.⇒దానికింకా బోలెడంత ప్రాసెస్ ఉంది. పబ్లిక్ హియరింగ్, సర్వే పూర్తి కాకుండా చట్టంగా మారదు.⇒ఏ గ్రామమైతే పబ్లిక్ హియరింగ్, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.⇒ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది.పవన్ కల్యాణ్ పెద్ద మేధావా?:⇒పవన్ కల్యాణ్కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు..? ఆయనేమన్నా పెద్ద మేధావా? ⇒ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తారా? అన్నం తినే వాడు మాట్లాడే మాటలేనా అవి?⇒జిరాక్స్ కాపీలు ఇస్తే ప్రజలు అమాయకులనుకుంటున్నారా? ఒప్పుకుంటారా? ⇒ప్రభుత్వం తరఫున జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని ప్రచారం చేయడం, తప్పు అని చాలా సార్లు చెప్పాను.⇒పవన్ కల్యాణ్ మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.⇒ఆయనొక రాజకీయ నాయకుడు..ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా? ⇒తెలిసీ తెలియని అంశాలను ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా?⇒ఆయన భాష కూడా మారింది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు అలాంటి భాష ఎవరైనా మాట్లాడాతారా?⇒ఏమీ తెలియని పవన్ కల్యాణ్ మాట్లాడితే మనందరం వినాలా?⇒అతని భాషను ప్రజాస్వామ్యంలో ఎవరైనా అంగీకరిస్తారా?⇒ఇప్పుడు ఆ యాక్ట్ ఫోర్స్లో లేదు. ⇒అసలు ఒక్క సీటు కూడా లేని పవన్ కల్యాణ్ ప్రతిపక్షం ఏంటి?⇒ఆయనకొచ్చిన ఒక్క సీటు వ్యక్తి కూడా నీదగ్గర ఉండనని వెళ్లిపోయాడు.⇒ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి ఎంత ఉక్రోషం ఉందో వారి రాతలను బట్టి అర్ధం అవుతుంది.⇒మేం కాల్చిన గుడ్డ మీ నెత్తిన వేశాం..మీ చెప్పాల్సింది చెప్పుకోండి అన్నట్లుంది వారి వ్యవహారం.⇒ఏదో ఒక తప్పుడు రాతలు రాసేస్తాం..ఆ తర్వాత మేం దాని గురించి ప్రశ్నించం అని అనుకుంటున్నారు. ⇒ప్రజలారా మీరే ఆ పత్రికల తీరును ఆలోచన చేయండి. మీరే డిసైడ్ చేయండి.⇒ఆ పత్రికల ద్వంద వైఖరి, బుద్ధిని గమనించండి.వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో ప్రతిపక్షాలు:⇒ఏ గ్రామమైతే సర్వే పూర్తి చేసుకుంటుందో ఆ గ్రామమే దీని పరిధిలోకి వస్తుంది.⇒తర్వాత ఏదైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్ అథారిటీ దృష్టికి తీసుకురావచ్చు.⇒కోర్టుకు కూడా ఎప్పుడైనా వెళ్లొచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు.⇒ప్రత్యర్థులు వారి వక్రబుద్ధి, క్రిమినల్ మైండ్తో దీన్ని వెపన్గా వాడుకోవాలని చూస్తున్నారు. ⇒క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లు కాబట్టే, ఇలాంటి సున్నితమైన సమస్యపై అపోహలు సృష్టిస్తున్నారు.⇒జగన్ ఫోటోను పట్టాదారు పాసుపుస్తకంపై వేశారంటున్నారు. మరి ఎన్టీఆర్ బొమ్మను మరుగుదొడ్లపై వేశారు కదా. దానికేం చెప్తారు?రిజిస్ట్రేషన్ పేపర్లు ఎవరి ఇంట్లో వారివి ఉంటాయి, సందేహం ఎందుకు?⇒బొమ్మ ఉంటే మాకు వచ్చేట్లయితే, ఎన్టీఆర్ బొమ్మ ఉన్న మరుగుదొడ్డి వాళ్లకు వెళ్లిపోతుందా?⇒ అసలు మీ ఇంట్లో కాగితాలు..మా ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు?⇒రిజిస్ట్రేషన్ కాగితం నీ ఇంట్లో ఉంటుంది కానీ..మరెవరింట్లోనే ఎందుకుంటుంది? ⇒ ఎవరో ఏదో చెప్తేస్తే, కడుపులో మంట ఉన్న వాళ్లు రాతలు రాస్తుంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు⇒రాజకీయ కోణంలో, క్రిమినల్ మైండ్తో, దుర్భిద్ధితో చేస్తున్న దుష్ప్రచారం ఇది⇒వీళ్లు రాసే రాతలు, చేసే ప్రచారం తప్పు అని చెప్పే బాధ్యత మాపై ఉంది⇒దీనిలో జిల్లా అప్పిలేట్ విచారించిన తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదు. అందుకు కొంతమంది న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు⇒కేవలం లిటిగేషన్ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశాం⇒ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తాం?⇒సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం⇒ఎప్పుడో బ్రిటీష్ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివిధాలు, లిటిగేషన్లు వస్తున్నాయి⇒ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దశల వారీగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోంది⇒మొదటి దశ అయిపోయింది. రెండో దశ కొనసాగుతోంది. తర్వాత అర్బన్లో కూడా సర్వే చేస్తాందేశంలో 73 శాతం భూ వివాద కేసులే...:⇒కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ 68 నుంచి 73 శాతం కేసులు భూవివాదాలే.⇒సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని చాలా సార్లు చెప్పారు.⇒తొలుత గ్రామాల్లో భూసేకరణ జరగాలి. ఆ సందర్భంలో ఏదైనా వివాదాలు వస్తే కింది స్థాయి ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారు.⇒ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరు.⇒ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో సమస్య పరిష్కారానికి వెళ్లొచ్చు.⇒ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చు. అప్పీలింగ్ అథారిటీ రెండేళ్ల వరకూ ఉంటుంది. ⇒ఈ రకంగా రాతలు రాయడం అనేది చాలా పెద్ద క్రైం. ⇒ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇదో పెద్ద క్రైం.⇒ఈ ప్రజాస్వామ్యంలో ఎవడి ఆస్తి ఎవడు తీసుకుంటాడు?వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం⇒కూటమిలో ముగ్గురున్నారు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు. ఒకరు రాష్ట్రంలో అధికారం చేసినవాళ్లు..మరొకరు ఎక్కడా ఏదీ లేని వాళ్లు.⇒వాళ్లలో ఒకరు ఒప్పుకోకుండా, ఇద్దరు ఒప్పుకుంటే ఇక ప్రజలకు క్లారిటీ ఏముంటుంది? ⇒వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం. దానిలో పెట్టిన వాటి గురించి ఎందుకు ఆలోచించాలి?⇒వాళ్లకున్న అత్మాభిమానం ఏంటి? మాకున్న అహంకారం ఏంటో చెప్పండి.⇒8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచామని అనడం చాలా తప్పు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల ఒక సారి ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.⇒ఎన్నికలు అయిన తర్వాత పాత్రికేయులకు చెప్పిన విధంగా వారికి స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు
విశాఖ సిటీ: ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజి్రస్టేషన్ తర్వాత జిరాక్స్ కాపీ ఇస్తారనడం... తెల్లకాగితం మీద రిజి్రస్టేషన్ చేస్తారనడం పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం మన రాష్ట్రంలోని ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాం. అందరి ఆమోదం తర్వాతే అమలుచేస్తాం. చంద్రబాబు మాయమాటలను ఎవరూ నమ్మవద్దు’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖ లాసెన్స్బే కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదనతోనే... ‘దేశంలో సమగ్రమైన రిజి్రస్టేషన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా తయారుచేసింది. దానిప్రకారం మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా కేంద్రం ఇచ్చిన ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు రూపొందించింది. రిజి్రస్టేషన్శాఖలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసెంబ్లీలో మూడుస్లార్లు చర్చ జరిగింది. కేంద్రానికి పంపిన తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశాం. ప్రస్తుతం ఈ యాక్ట్ కోర్టు పరిధిలో ఉంది. ఈ చట్టాన్ని అమలుచేసే ముందు సమగ్ర భూసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. ఆ గ్రామంలో మొత్తం భూముల వివరాలు, వ్యక్తిగత, ప్రభుత్వ భూములు, వాటి హద్దులు.. ఇలా అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వాటన్నింటినీ సరిచేసిన తర్వాత వారి ఆమోదంతోనే ఆ గ్రామాన్ని చట్టం పరిధిలోకి తీసుకువస్తాం. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఈ చట్టాన్ని అమలుచేయబోం. ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. లిటిగెంట్లకు, దళారులకు మాత్రమే ఈ చట్టం కారణంగా నష్టం కలుగుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం జవాబుదారీ.’ అని మంత్రి బొత్స చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశమివ్వడు ‘ఆలూ లేదు.. చూలులేదు అన్న సామెతలా ఉంది చంద్రబాబు పరిస్థితి. చట్టం అమల్లోకే రాలేదు. అయినా ఆయన అధికారంలోకి వచి్చన వెంటనే దానిని రద్దు చేస్తానని చెబుతున్నాడు. రద్దు చేయడానికి ఆ చట్టంలో ఉన్న తప్పేంటో చెప్పగలడా? అయినా చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశం ఇవ్వడు. పచ్చ మీడియా కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసత్య ప్రచారంచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత జిరాక్సు కాపీలు ఇస్తారని ఎవడు చెప్పాడు రామోజీకి? ఎన్నికలు జరుగుతున్నాయి.. లేదంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నందుకు ఎల్లో మీడియాపై చర్యలు తీసుకునేవాళ్లం.’ అని మంత్రి బొత్స చెప్పారు. మోదీ బొమ్మ ఎందుకు లేదు? ‘బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు మేనిఫెస్టోలో మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్, ఎనీ్టఆర్ బొమ్మలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇద్దరు ఏమయ్యారు? కూటమిలోని పార్టీయే మీ మేనిఫెస్టోను అంగీకరించనప్పుడు ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు చంద్రబాబు? దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఆయన 2019, 2024లో తీసుకొచ్చిన మేనిఫెస్టోలు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. 2014లో చంద్రబాబు 50పేజీల మేనిఫెస్టో ప్రింట్ చేశాడు. ఇప్పుడు ఐదు పేజీలకు దిగివచ్చాడు. ఈ కూటమి ముఠా... జగన్ మేనిఫెస్టోలోని అంశాలనే కాదు.. పేజీల సంఖ్యను సైతం కాపీ కొట్టింది.’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
-
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ రికార్డ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement