-
ఉత్తమ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తమ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంటు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్సిటీల్లో పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచాలని నిర్ణయించింది. వర్సిటీ ల్లో కొత్త ఆవిష్కరణలకు చేయూతను ఇచ్చేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయా లని భావిస్తోంది. బోధన, అభ్యసన విధానం లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడం, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న సిలబస్లో మార్పులు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో(పీహెచ్డీ) నాణ్యత పెంచేందుకు డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీలను, ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ కమిటీల ఏర్పా టు పరిశోధన అంశాలపై నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయా లని నిర్ణయించింది. ఆ తర్వాతే పీహెచ్డీలు ప్రదానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే పీహెచ్డీలను అందించవచ్చని భావిస్తోంది. పీహెచ్డీల్లో మాల్ ప్రాక్టీస్ నిరోధానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు యూజీసీ మార్గదర్శకాలను పక్కాగా అమలుకు చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి పోలీసుల సహకారంతో వెబ్సైట్ను అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. బాగా పని చేసే అధ్యాపకులను ప్రోత్సహించేందుకు రివార్డు అండ్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉత్తమ అధ్యాపక అవార్డులను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. -
ఏయూకు బెస్ట్ రీసెర్చ్ వర్సిటీ అవార్డు
ఏయూ క్యాంపస్: దేశంలో ఉన్నత విద్య, డాక్టరేట్ అంశాలలో పరిశోధనను ప్రోత్సహిస్తున్న అత్యుత్తమ వర్సిటీగా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంపికైంది. గుజరాత్ టెక్నికల్ వర్సిటీ, కమ్యూనికేషన్ మల్టీ మీడియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా ఏయూను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. ఈనెల 17న ఉదయం అహ్మదాబాద్లో జరగనున్న ఆఫ్రో ఏసియన్ సదస్సులో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు ఈ అవార్డును అందుకోనున్నారు. టీచింగ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్గా దీనిని పిలుస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన 8 మంది దౌత్యాధికారులు హా జరుకానున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వ వర్సిటీలో 2వ స్థానం, అంతర్జాతీయ స్థాయిలో 151వ స్థానం సాధించిన ఏయూ పరిశోధన విభాగంలో సైతం అత్యుత్తమ స్థానాన్ని సాధించడం గర్వకారణమని వీసీ జి.ఎస్.ఎన్ రాజు అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement