ఏయూకు బెస్ట్ రీసెర్చ్ వర్సిటీ అవార్డు
ఏయూ క్యాంపస్: దేశంలో ఉన్నత విద్య, డాక్టరేట్ అంశాలలో పరిశోధనను ప్రోత్సహిస్తున్న అత్యుత్తమ వర్సిటీగా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంపికైంది. గుజరాత్ టెక్నికల్ వర్సిటీ, కమ్యూనికేషన్ మల్టీ మీడియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా ఏయూను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. ఈనెల 17న ఉదయం అహ్మదాబాద్లో జరగనున్న ఆఫ్రో ఏసియన్ సదస్సులో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు ఈ అవార్డును అందుకోనున్నారు. టీచింగ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్గా దీనిని పిలుస్తారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన 8 మంది దౌత్యాధికారులు హా జరుకానున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వ వర్సిటీలో 2వ స్థానం, అంతర్జాతీయ స్థాయిలో 151వ స్థానం సాధించిన ఏయూ పరిశోధన విభాగంలో సైతం అత్యుత్తమ స్థానాన్ని సాధించడం గర్వకారణమని వీసీ జి.ఎస్.ఎన్ రాజు అన్నారు.