-
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి/సాక్షి, అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిల్లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3.30 గంటలకు వేమగిరిలో, 5.45 గంటలకు రాజుపాలెంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళతారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాల్గొంటారు. 8న మళ్లీ రాష్ట్రానికి.. ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. -
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులోని ఐటీసీ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందేళ్ల కిందట బ్రిటీష్కాలంలో భూముల సర్వే చేశారని, అనంతరం మళ్లీ సమగ్రమైన సర్వే జరగలేదని చెప్పారు.భూ యాజమాన్య హక్కులు, హద్దులపై రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. భూ వివాదాలతో ప్రజలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో సమగ్ర భూసర్వే ద్వారా భూములకు యజమానులను గుర్తించి, సంబంధిత భూములపై వారికే శాశ్వతరీతిలో హక్కులను కల్పించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ అనే మహత్తరమైన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు.భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించి, యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడంతోపాటు డిజిటల్ రికార్డుల రూపంలో వాటిని భద్రపర్చడం ఎంతో గొప్ప కార్యక్రమమని చెప్పారు. గత ప్రభుత్వాలే కాకుండా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని వివరించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రాజకీయ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం, సీఎం జగన్పై బురదచల్లడం తగదన్నారు. అడ్డగోలుగా ఫిలిం సిటీ కట్టిన రామోజీ రైతుల భూములు ఆక్రమించి అడ్డగోలుగా ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు తన ఈనాడు పత్రిక ద్వారా నిత్యం తప్పుడు వార్తలు రాస్తూ సీఎం వైఎస్ జగన్పై అభాండాలు వేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భూములు లాగేసుకుంటారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్న రామోజీరావు... గతంలో రామోజీ ఫిలింసిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు జడ్జిగా తాను స్టే ఇచ్చిన విషయం మరిచారా.. అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ, జనసేనలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.బీసీ విద్యార్థులకు న్యాయంచేసిన సీఎం జగన్వైద్య విద్య సీట్ల కేటాయింపులో సీఎం జగన్ బీసీ విద్యార్థులకు న్యాయంచేశారని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. బీసీ కోటాలో సీటు పొంది, ఓపెన్ మెరిట్లోకి వెళ్లిన విద్యార్థుల సీట్లను తిరిగి బీసీ కోటాలోనే భర్తీచేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత ప్రభుత్వంలో చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఫలితంగా బీసీ కోటాలో ఏటా దాదాపు 500 ఎంబీబీఎస్ సీట్లను బీసీ విద్యార్థులు కోల్పోతున్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా... బీసీ కోటా సీట్లు బీసీ విద్యార్థులతోనే భర్తీ చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వడంతోపాటు సక్రమంగా అమలు చేయిస్తున్నారని వివరించారు.బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్కు బీసీలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవేనని, అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎంగా ఉండాలని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్, ప్రభుత్వ మాజీ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు, బీసీ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
మేనిఫెస్టో మోసగాడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి.. అందుకోసం వందల హామీలిచ్చి అందలమెక్కుతాడు.. తనను నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా వంచిస్తాడు. హామీలన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. హామీలిస్తే అమలు చేయాలా? అని సమాధానమిస్తాడు. మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు.. మాయమాటలతో ఎన్నికల ముందు తిమ్మిని బమ్మి చేసి కిచిడీ మేనిఫెస్టోతో ప్రజల నమ్మకంతో ఆడుకుంటాడు. ‘చంద్రబాబుకు ఒక శాపముంది.. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని ఆనాడు అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యం.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడు.అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. చంద్రబాబు పాలనలో మహిళలు, వృద్ధుల కష్టాలు, రైతుల కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. కొడుక్కి మంత్రి పదవే కట్టబెట్టి నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన భవిష్యత్ను గుర్తు చేసుకుని.. మన కోసం ఒక మంచి బాట వేసిన జననేతను మళ్లీ గెలిపించుకోవాలి. ఒక్క ఓటుతో చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి. హామీలతో వంచించే నేతను విశ్వసిస్తే భవిత నాశనమే.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడపోయి.. ఇప్పుడు ఆ పారీ్టతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే.. జగన్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చే మాట.. ఐదేళ్ల పాలనను చాటిచెప్పే పవిత్ర వాగ్దానం. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తాను గెలిచిన ప్రతీసారి ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. 2014లో పదవి కోసం చంద్రబాబు 600కు పైగా హామీలు గుప్పించారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. హామీల మాటే మరిచిపోతారు.జనంలోకెళ్తే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోను తన వెబ్సైట్ నుంచి మాయం చేస్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు తొడుగుతూ అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడం.. అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ.. ఎప్పుడూ మేనిఫెస్టోను అమలుచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు మరోసారి.. సూపర్ సిక్స్తో కలిపి ఇతర హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు. రుణమాఫీ పేరుతో టోపీ 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్లో కలిసి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాన హామీలు 1. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం 2. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ 3. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి 4. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25 వేల డిపాజిట్ 5. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం.. పక్కా ఇళ్ల నిర్మాణం 6. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు 7. చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ 8. సింగపూర్ను మించి అభివృద్ధి 9. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మాణం ఇలా 650కిపైగా హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీల అమలును తుంగలో తొక్కారు. ఇదేంటని ప్రశి్నస్తే.. కేంద్రం సహకరించలేదంటూ బుకాయించి.. హామీలిస్తే అమలు చేయాలా? అని ఎదురు ప్రశి్నంచారు. ఎన్టీఆర్ హామీలకు బాబు వెన్నుపోటు ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్కు బాబు వెన్నుపోటు పోడిచి.. అధికారంతోపాటు టీడీపీని కబ్జా చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2 కే కిలో బియ్యం హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. 1999లో అరచేతిలో స్వర్గం 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. 1. కోటి మందికి ఉపాధి 2. 35 లక్షల ఇళ్లు నిర్మాణం 3. దారిద్య్ర నిర్మూలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు 4. పట్టణాల్లో మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు 5. 25 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం ఇలా పదుల సంఖ్యలో హామీలిచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయిపై సానుభూతి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. హామీల అమలును మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కేంద్రం సహకరించలేదని బుకాయించారు. ఉచిత విద్యుత్పై పరిహాసం అలిపిరి ఘటన నుంచి సానుభూతి పొందడం ద్వారా అధికారంలోకి రావాలన్న ఎత్తుగడతో 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. వ్యవసాయ విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని మహానేత వైఎస్సార్ హామీ ఇస్తే అపహాస్యం చేశారు. సేద్యానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని చంద్రబాబు పరిహాసమాడారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన జనం అతని పాలనకు చరమగీతం పాడారు. 2009లో తారాస్థాయికి బాబు అబద్ధాలు 2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో చంద్రబాబు మహాకూటమిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో హామీలు 1. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేల నగదు బదిలీ 2. 50 లక్షల ఉద్యోగాలు 3. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ 4. 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.. అలా పదుల కొద్దీ హామీలతో ప్రచారంలో ఊదరగొట్టినా అతని నైజం తెలిసి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీని జనం గెలిపించారు. వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 4 కేజీలు కాకుండా 6 కేజీలకు పెంచి ఇస్తామని రెండే హామీలు ఇచ్చిన మహానేత వైఎస్ను విశ్వసనీయతకు జనం పట్టం కట్టారు. ప్రత్యేక హోదా అంటూ 2019లో మోసం 2018లో బీజేపీతో విడిపోయి 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కమిషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకోవడం కోసం ప్రత్యేక హోదాను 2016లో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే సరఫరా చేస్తామని.. 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. అన్నదాత సుఖీభవలో రైతులకు ఏటా రూ.15 వేలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతానని హామీలు ఇచ్చారు. చంద్రబాబు మోసానికి భయపడిన జనం ఆ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. కర్ణాటక, తెలంగాణలో విఫలమైన హామీలతో ‘సూపర్ సిక్స్’ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా సీఎం జగన్ను ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టుకట్టారు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమల్లో నీరుగారిపోయినా వాటికే సూపర్ సిక్స్ ముసుగేసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో ఇంతవరకూ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ అమలు కాలేదు. మిగతా అమలవుతాయో లేదో తెలియదు. -
పక్కాగా కేటుగాడే!
‘‘వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు.. వ్యవసాయం చేయడం ఇక దండగ.. భూమిని నమ్ముకోకుండా లాభదాయకమైన వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.. రైతులకు ఎంత చేసినా కావాలంటారు.. వాళ్లకు ఇంకేం పనిలేదు.’’ – అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్నమాటలివి.అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడే ఊసరవెల్లి నారా చంద్రబాబు నాయుడు. అ«ధికారమే పరమావధిగా అమలుకు సా«ధ్యం కాని హామీలు గుప్పించడం.. అధికారం రాగానే వాటిని బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఆయన ఇచి్చన హామీలే ఇందుకు నిదర్శనం. ‘బ్యాంకులో తనఖా పెట్టిన మీ భార్య పుస్తెలతాడు ఇంటికి రావాలంటే బాబు రావాలి. మీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు రావాలి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ..వాడా ప్రచారం ఊదరగొట్టారు. తీరా గద్దెనెక్కాక నిండా ముంచిన వైనం ఇప్పటికీ అన్నదాతలు, డ్వాక్రా మహిళల కళ్లెదుట కదలాడుతోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2014 ఎన్నికల నాటికి రైతులకు ఉన్న రూ.87,612 కోట్ల వ్యవసాయ, బంగారు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారు. రుణ మాఫీ సాధ్యం కాదని, ఎగ్గొట్టడంలో భాగంగా ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కుటుంబానికి రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయబోమని మాట మార్చేశారు.అంతేకాకుండా అనేక షరతులు పెట్టారు. ఎకరాకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, సాగు కోసం తీసుకున్న బంగారు రుణాలు, మీడియం టర్మ్ రుణాలుగా మార్చిన పంట రుణాలు అయి ఉండాలంటూ మెలిక పెట్టారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున గరిష్టంగా రూ.50 వేలకే పరిమితం చేశారు. వ్యవసాయ రుణమాఫీ స్కీమ్ (ఏడీఆర్ఎస్) కోసం బడ్జెట్ అవసరమని 2014 ఆగస్టు 14న జీఓ 174 జారీ చేశారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారు.రూ.50 వేల లోపు ఉన్న రుణాలను వన్టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక వేళ అర్హత పొంది, అప్పటికే రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి ఉంటే, ఆ మేరకు మొత్తాన్ని వారి సేవింగ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని, ఒక వేళ రుణ బకాయిలు ఉండి ఉంటే వాటికి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా గుర్తించిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా రైతు ఉపశమన అర్హత పత్రాలు పేరిట హంగామా చేశారు. చివరకు మూడు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 67.42 లక్షల మందికి అర్హత పత్రాలు ఉన్నప్పటికీ ఎగ్గొట్టారు.అర్హత ఉండి రుణాలు చెల్లించిన వారికి పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. రైతు రుణ అర్హత పత్రాలు పొందిన వారు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పైసా సాయం అందలేదు. దీంతో చేసిన అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేక లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అన్నదాత సుఖీభవ అంటూ హంగామా 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు ఆ ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను బుట్టలో వేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఈ పథకం కింద కౌలు రైతులతో పాటు 2 హెక్టార్లలోపు చిన్న, సన్నకారు రైతులకు రూ.15 వేలు, 2 హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో 28 జారీ చేశారు. ఆచరణలోకి వచ్చే సరికి పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత 46.76 లక్షల మందికి రూ.1,000 చొప్పున జమ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివిధ సాకులతో 3.50 లక్షల మందికి కోతపెట్టి 43.26 లక్షల మందికి రూ.3 వేలు చొప్పున వేశారు. ఇలా నాడు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు మాత్రమే ఇచ్చి రూ.1,765.29 కోట్లతో సరిపుచ్చారు. 2014లో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 200కు పైగా ఇచి్చన హామీలు బుట్టదాఖలయ్యాయి.ఇప్పుడూ అదే రీతిలో మోసం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి రైతులను ఏమార్చేందుకు చంద్రబాబు కొత్త హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు 53.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో కౌలు రైతులు, అటవీ, దేవదాయ సాగుదారులు 2.68 లక్షల మంది ఉన్నారు. ‘బాబు చెప్పినట్టు ఏటా రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఐదేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు అవసరం. గతంలో రూ.17 వేల కోట్లే సరిగా ఇవ్వలేకపోయిన ఈ పెద్దమనిషి రైతుల కోసం లక్ష కోట్లు ఇస్తానంటే నమ్మేవారెవరూ లేరు’ అని అన్నదాతలు మండిపడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement