-
మహారాష్ట్ర సీఎంకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఫడణవీస్ తనపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించలేదంటూ సతీశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపి ఫడణవీస్కు నోటీసులు ఇచ్చింది. ఫడణవీస్ ఎన్నికను రద్దు చేయాలంటూ తొలుత హైకోర్టులో సతీశ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ çసుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఫడణవీస్పై 1996, 1998లో చీటింగ్, ఫోర్జరీకి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. -
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్పై రాజ్కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్కుమార్ను బయటకు తీసుకెళ్లారు. -
రైతు ‘మహా’ విజయం
సాక్షి, ముంబై: మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ ‘రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించాం. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలి. వారికి భూములను బదిలీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. డిమాండ్లలోని దాదాపు అన్నింటినీ నిర్ణీత సమయంలోపు మేం నెరవేరుస్తాం’ అని చెప్పారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో అలసి సొలసిన రైతన్నలు ఆందోళన విరమించి ఇక తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. రైతులను ముంబై నుంచి ఇళ్లకు తిరిగి పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ముంబై నుంచి నాసిక్ మీదుగా భుసావల్ వరకు రైతుల కోసం 2 రైళ్లను నడపటంతోపాటు ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు జనరల్ బోగీలను కూడా తగిలిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అదనంగా రైతు రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్ను మాత్రం తాము నెరవేర్చలేమని సీఎం చెప్పారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ రుణాలు తీసుకున్నప్పుడు వారిలో ఎవరి పేరున అప్పు తక్కువగా ఉంటే ఆ రుణం మాత్రమే మాఫీ అయిందనీ, దీన్ని సరిదిద్దడానికి ఇంకా ఎంత ఎక్కువ వ్యయం అవుతుందో అంచనా వేయడానికి ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సోమవారం ముంబైలోని ఆజాద్ మైదానంలో సమావేశమైన రైతులు ఒకటే గమ్యం.. ఒకటే గమనం నడిచి నడిచి పాదాలకు పుండ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు. మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకుదెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. నాసిక్ నుంచి ముంబై వరకు మొత్తం 180 కిలో మీటర్లు సాగిన ఈ రైతు పాదయాత్రలో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు.. మహిళా రైతులు కూడా అన్నింటినీ పంటి బిగువున భరించారు. అలుపూసొలుపూ లేకుండా దాదాపు 35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కిలో మీటర్లు నడిచారు. మహారాష్ట్ర సర్కార్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. ఒక్కో ఊరు దాటుతుంటే ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు. మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. తొలి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్లో రోజు గడిచేకొద్దీ రైతుల సంఖ్య పెరిగి ముంబైకొచ్చేసరికి 50 వేలు దాటేసింది. కనీస సదుపాయాలు లేకున్నా.. డెబ్బయి ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు కూడా ఈ పాదయాత్రలో ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా వారు పట్టించుకోలేదు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసుల మూటలను మోస్తూనే నడక సాగించారు. రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండిపోతున్న ఎండలో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలూ తలెత్తాయి. ‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలి? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం’ అని 74 ఏళ్ల వయసున్న శంకర్ గావిట్ అనే రైతు చెప్పారు. రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. అంతటి కష్టంలోనూ రైతులు ముంబై విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ఆదివారం సాయంత్రానికల్లా ముంబై శివార్లకు చేరుకున్న వారు.. తమ పాదయాత్రతో సోమవారం టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే సదుద్దేశంతో ఆదివారం రాత్రి కూడా నడక సాగించి సూర్యుడు ఉదయించేలోపే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. డబ్బావాలాల ఆహారం.. స్థానికుల ఔదార్యం ఎన్నో బాధలను భరించి అన్ని కిలోమీటర్లు నడిచొచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతన్నల ఆకలిదప్పులు తీర్చారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ నెరవేర్చారు. నగరంలో పాదయాత్ర సాగుతుండగా అర్ధరాత్రే అనేక మంది ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి రైతులకు అందించారు. చెప్పులు లేని వారికి కొత్తవి ఇచ్చారు. పాదాల గాయాలకు వైద్య విద్యార్థులు చికిత్స చేశారు. రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్ దిగి రావల్సి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఆజాద్ మైదానానికి చేరుకుంటున్న రైతులు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రూ.34 వేల కోట్ల రుణమాఫీ
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రకటన - 89 లక్షల మంది రైతులకు లబ్ధి సాక్షి, ముంబై: కరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ. 1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారమిక్కడ ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. ‘2012 నుంచి కరువుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్ మేరకు కేబినెట్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత వర్గాలు, పార్టీల నేతలు, రైతు బృందాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. ‘రూ. 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాం. 2012–16 మధ్య రుణాల్ని రీషెడ్యూల్ చేసుకుని.. 2016, జూన్ 30 నాటికి వాటిని చెల్లించని రైతులకు రూ. 25 వేలు లేదా రుణంలో 25 శాతం.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం మేరకు రాయితీ ఉంటుంది’ అని తెలిపారు. కొత్తగా తీసుకునే రుణాల చెల్లింపు గడువును నిర్ణయించడానికి ఏపీ, తెలంగాణలో మాదిరి బ్యాంకులతో కలసి పనిచేస్తామన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళనతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పంతం నెగ్గడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్రకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాను ఎందుకు తప్పించారని, రంగారె డ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు గోదావరి జలాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం ఖర్చును తెలంగాణ భరిస్తే, 20 శాతం నీళ్లను మహారాష్ట్రకు ఎందుకు ఇస్తున్నారన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాత్ర ఉందని రేవంత్రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంలో లొసుగులను గురువారం బహిర్గతం చేస్తామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement