-
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరానా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్కే మెనెజ్మెంట్ ధ్రువీకరించింది.టీ20 వరల్డ్కప్ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్ స్వదేశానికి రప్పించింది.ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరుపున పతిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్ సైతం ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్కేకు నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. -
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
ఐపీఎల్-2024లో టీమిండియా ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివమ్ దూబే వరుసగా రెండో మ్యాచ్లో నిరాశపరిచాడు. ఈ లీగ్ ఫస్ట్హాఫ్లో అదరగొట్టిన దూబే.. సెకెండ్ హాఫ్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో దూబే గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దూబే గోల్డెన్ డక్గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్లో ఔట్ అవుతుండడం సీఎస్కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్కప్ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది. Wickets ki aayi bahar, jaise hi aaye Rahul Chahar 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvCSK #IPLinPunjabi pic.twitter.com/urm9eFIDOW— JioCinema (@JioCinema) May 5, 2024 -
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను టాస్ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఏకంగా పదింట టాస్ ఓడాడు. పంజాబ్తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్లో మరోసారి టాస్ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగాడు.టాస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్ ప్రాక్టీస్) తీసుకుంటున్నా రుతురాజ్ వరుసగా టాస్ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్ల్లో టాస్ ఓడిన రుతు ఓ ఆల్ టైమ్ చెత్త రికార్డును సమం చేశాడు.ఐపీఎల్లో తొలి 11 మ్యాచ్ల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్గా సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్లో తొలి 11 మ్యాచ్ల్లో 10 సార్లు టాస్ ఓడాడు. రాజస్థాన్, సీఎస్కే తర్వాత తొలి 11 మ్యాచ్ల అనంతరం అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై 2011 సీజన్లో తొమ్మిదింట టాస్ ఓడింది. 2013 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తొలి 11 మ్యాచ్ల్లో తొమ్మిదింట టాస్ ఓడింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అర్ష్దీప్ బౌలింగ్లో రబాడకు క్యాచ్ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్ కాగా.. రుతురాజ్ (25), డారిల్ మిచెల్ (25) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండే -
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సీఎస్కే ఒక మార్పు చేయగా.. పంజాబ్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది. సీఎస్కే జట్టులో స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్కీపర్), అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండేసీఎస్కేకు చాలా కీలకం..ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement