-
నరైన్ మెరుపులు
లక్నో: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ టోరీ్నలో ఎనిమిదో విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన కోల్కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచి్చంది. రాజస్తాన్, కోల్కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ... మెరుగైన రన్రేట్తో కోల్కతా టాప్ ర్యాంక్ను అందుకుంది. టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్స్లు) మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), రమణ్దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ మరోసారి కోల్కతా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి బంతి నుంచే వీరిద్దరు లక్నో బౌలర్ల భరతం పట్టారు. మోసిన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నరైన్ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లతోపాటు ఒక సిక్స్ కూడా బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో సాల్ట్ అవుట్కాగా, పవర్ప్లే ముగిసేసరికి కోల్కతా 70 పరుగులు సాధించింది. పవర్ప్లే తర్వాత కూడా నరైన్ తన జోరు కొనసాగించాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నరైన్ మూడు సిక్స్లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన నరైన్ ఆ తర్వాత మరో భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు. నరైన్ వెనుదిరిగాక... శ్రేయస్, రమణ్దీప్ దూకుడును కొనసాగించడంతో కోల్కతా స్కోరు 230 దాటింది.స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32; నరైన్ (సి) సబ్–పడిక్కల్ (బి) బిష్ణోయ్ 81; రఘువంశీ (సి) రాహుల్ (బి) యు«ద్వీర్ 32; రసెల్ (సి) సబ్–గౌతమ్ (బి) నవీనుల్ 12; రింకూ సింగ్ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16; శ్రేయస్ అయ్యర్ (సి) రాహుల్ (బి) యశ్ ఠాకూర్ 23; రమణ్దీప్ సింగ్ (నాటౌట్) 25; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–61, 2–140, 3–167, 4–171, 5–200, 6–224.బౌలింగ్: స్టొయినిస్ 2–0–29–0, మోసిన్ ఖాన్ 2–0–28–0, నవీనుల్ హక్ 4–0–49–3, యశ్ ఠాకూర్ 4–0–46–1, కృనాల్ పాండ్యా 2–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–33–1, యు«ద్వీర్ సింగ్ 2–0–24–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రమణ్దీప్ (బి) హర్షిత్ 25; అర్షిన్ (సి) రమణ్దీప్ (బి) స్టార్క్ 9; స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రసెల్ 36; దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 5; పూరన్ (సి) సాల్ట్ (బి) రసెల్ 10; బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15; టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16; కృనాల్ పాండ్యా (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5; యు«ద్వీర్ (సి) రసెల్ (బి) వరుణ్ 7; బిష్ణోయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ 2; నవీనుల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–20, 2–70, 3–77, 4–85, 5–101, 6–109, 7–125, 8–129, 9–137, 10–137.బౌలింగ్: వైభవ్ 2–0–21–0, స్టార్క్ 2–0–22–1, నరైన్ 4–0–22–1, హర్షిత్ రాణా 3.1–0–24–3, వరుణ్ చక్రవర్తి 3–0–30–3, రసెల్ 2–0–17–2. -
రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
ధర్మశాల: ఐపీఎల్ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచి గత బుధవారం పంజాబ్ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ స్యామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), డరైల్ మిచెల్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్ దూబే (0)లను అవుట్ చేయగా... మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్కు పంపించాడు. దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్ పాండే (2/35) ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్స్టో, రోసో లను అవుట్ చేసి పంజాబ్ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్, కరన్, అశుతోష్లను జడేజా... శశాంక్ను సాన్ట్నెర్ అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రబడ (బి) అర్‡్షదీప్ 9; రుతురాజ్ (సి) జితేశ్ (బి) చహర్ 32; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 30; శివమ్ దూబే (సి) జితేశ్ (బి) చహర్ 0; మొయిన్ అలీ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 17; జడేజా (సి) స్యామ్ కరన్ (బి) అర్‡్షదీప్ 43; సాన్ట్నెర్ (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 11; శార్దుల్ (బి) హర్షల్ 17; ధోని (బి) హర్షల్ 0; తుషార్ (నాటౌట్) 0; గ్లీసన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్: రబడ 3–0–24–0, అర్‡్షదీప్ 4–0–42–2, స్యామ్ కరన్ 4–0–34–1, హర్ప్రీత్ బ్రార్ 1–0–19–0, రాహుల్ చహర్ 4–0–23–3, హర్షల్ పటేల్ 4–0–24–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్స్టో (బి) తుషార్ 7; రోసో (బి) తుషార్ 0; శశాంక్ (సి) సిమర్జీత్ (బి) సాన్ట్నెర్ 27; స్యామ్ కరన్ (సి) సాన్ట్నెర్ (బి) జడేజా 7; జితేశ్ (సి) ధోని (బి) సిమర్జీత్ (బి) 0; అశుతోష్ శర్మ (సి) సిమర్జీత్ (బి) జడేజా 3; బ్రార్ (నాటౌట్) 17; హర్షల్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) సిమర్జీత్ 12; చహర్ (బి) శార్దుల్ 16; రబడ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్: సాన్ట్నెర్ 3–0–10–1, తుషార్ దేశ్పాండే 4–0–35–2, గ్లీసన్ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్ 3–0–16–2, శార్దుల్ 2–0–12–1. -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్ బెర్త్ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్లో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్ల పడగొట్టగా.. రస్సెల్ రెండు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(36) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను జడ్డూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరిచింది.ఈ క్రమంలో జడేజా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ది అవార్డులను గెలుచుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ధోని రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా చేరాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. -
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్కే విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్ కొనియాడాడు. "ధర్మశాల వికెట్ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్కు వచ్చేటప్పుడే మా స్కోర్ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్ వస్తే చాలు అని భావించాము. మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్ను మేము డిఫెండ్ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్జీత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో తను తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు. అతడు గత సీజన్లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటర్గా దించాలనుకున్నాము. బ్యాటర్ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము. కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్జీత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు. మ్యాచ్ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రుతు పేర్కొన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement